ఏపీ ఎన్నికల్లో కూటమి గెలుపు.. చాలా అన్యాయం అన్న అంటూ యాంకర్ శ్యామల వీడియో
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Anchor Shyamala Reacts on AP Election Results: 2024 ఎన్నికల్లో వైసీపీ తరఫున చాలా ప్రాంతాల్లో ప్రచారం చేసి జనసేన తెలుగుదేశం పార్టీ అధినేతలను విమర్శించిన యాంకర్ శ్యామల అనూహ్యంగా వార్తల్లోకి వస్తున్న సంగతి తెలిసిందే. కూటమి భారీ మెజారిటీతో గెలుపొందిన నేపథ్యంలో శ్యామలను సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోల్ చేస్తున్నారు. ఈ నేపద్యంలో ఆమె ఒక వీడియో రిలీజ్ చేసింది. ప్రియమైన ఆంధ్రప్రదేశ్ ప్రజలకు నమస్తే. ఎన్నికల్లో ప్రజల తీర్పుని స్వాగతిస్తున్నాను కచ్చితంగా క్షేత్రస్థాయిలో జరిగినటువంటి ఎన్నికల్లో ఈ ప్రజా తీర్పుని స్వాగతిస్తున్నాం, గౌరవిస్తున్నాం. ముందుగా అఖండ విజయాన్ని మూటగట్టుకున్న కూటమికి ధన్యవాదాలు.
Rakshana Review: పాయల్ రాజ్ పుత్ రక్షణ రివ్యూ
Also Read
- Hero Sanjosh : బ్లైండ్ ఫౌండేషన్ అమ్మాయిలతో రాఖీ వేడుకలు జరుపుకున్న హీరో సంజోష్
- Rakhi Sawant: మక్కాలో అల్లాకు రాఖీ ప్రార్థనలు.. జెన్-జీకి ఉద్యోగాలు ఇవ్వాలని వేడుకోలు..
- Bigg Boss Telugu 10: బిగ్ బాస్ హౌస్లోకి ఎంట్రీ ఇస్తున్న యంగ్ హీరో?..
- Anumana Pakshi: ‘డీజే టిల్లు’ దర్శకుడి మరో కొత్త కామెడీ.. ‘అనుమాన పక్షి’ రిలీజ్ డేట్ ఫిక్స్
పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే పవన్ కళ్యాణ్ గారికి బిజెపి సభ్యులకు, పురందేశ్వరి గారికి అందరికీ కూడా హార్దిక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలాగే వైసీపీ గెలుపు కోసం కష్టపడ్డ ప్రతి కార్యకర్తకి ప్రతి ఒక్కరికి వైసీపీ కూడా మొత్తానికి కూడా పేరుపేరునా పేరుపేరునా ధన్యవాదాలు. ఎస్ ఓడిపోయాము, కానీ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, గెలిచిన నాడు ఏ రోజు విర్ర వీగ లేదు. విజయగర్వంతో ఓడిపోయిన నాడు, ఏనాడు కుంగిపోలేదు. అలాగే ఈసారి కూడా మన జగన్మోహన్ రెడ్డి గారు మరింత బలాన్ని పుంజుకొని మళ్లీ ఖచ్చితంగా మీ అందరి సపోర్టుతో మనందరం కలిసి జగనన్నతో నడిస్తే ఖచ్చితంగా మళ్ళీ ఒక మంచి ప్రభుత్వంగా మన ఏర్పడతాము. దేవుడిపై నమ్మకం ఉంచి ప్రజలకు మంచి జరగాలని కోరుకుంటూ ఎస్ ఎప్పటికీ జగనన్నతోనే కలిసి నడుద్దాం, పనిచేద్దాం. ఏదైనా ప్రజలకు మంచి జరగడమే ముఖ్యం. ఈ ఐదేళ్లు కూడా ఆంధ్రప్రదేశ్కి ఎంత మంచి జరగాలో అంత మంచి జరగాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను.
నన్ను భయపెడుతూ చాలా కాల్స్ వస్తున్నాయి, చాలా బెదిరిస్తున్నారు. ఒక రకమైన భయంగానే ఉంది, నాకు కూడా కానీ ఒకటే చెప్పాలి నేను. మీకు ఒకటి నచ్చుతుంది నాకు ఒకటి నచ్చుతుంది. అలా అని చెప్పి మీకు నచ్చనిది నాకు నచ్చింది అని చెప్పి మీరు బతకడానికి వీలు లేదంటే ఇది చాలా అన్యాయం అన్న. సో ప్లీజ్ దయచేసి ఏది వ్యక్తిగతంగా తీసుకోవద్దు. నేను వ్యక్తిగతంగా ఎవరి మీద విమర్శలు చేయలేదు చేయను కూడా ఎప్పటికీ. నాకు చాలా గౌరవం వ్యక్తిగత విమర్శలు నేను ఎప్పుడూ చేయలేదు, చేయను కూడా. దయచేసి మీరు కూడా అలాగే ఉండండి. ఒక పార్టీకి సపోర్ట్ చేసే ప్రయత్నంలో ఎంత చేయాలో అంత చేశాను. ఉన్నదే చెప్పాను లేనిది ఎక్కడా మాట్లాడలేదు దయచేసి దాన్ని మీరు అర్థం చేసుకుంటారని కోరుకుంటున్నాను. అంటూ ఆమె చెప్పుకొచ్చింది.
తాజావార్తలు
-
Indian Railway: రైళ్లలో టికెట్ లేని ప్రయాణికులకు షాక్.. భారీగా జరిమానాలు..
-
Story Board : నేపాల్ ఆకస్మిక వరదలకు కారణాలేంటి..? చైనా నిర్లక్ష్యం ఎంతవరకు ఉంది..?
-
OTR: ఎమ్మెల్యే, ఎంపీ.. మధ్యలో సూర్యలంక బీచ్!
-
OTR: ఆ నేతకు పీఏ పోట్లు.. ఆ ఎమ్మెల్యే చుట్టూ నడుస్తున్న అసలు డ్రామా!
-
OTR: సొంత పార్టీ నేతలకే టార్గెట్ అవుతున్న తెలంగాణ బీజేపీ సోషల్ మీడియా!
ట్రెండింగ్
-
Fridge Wall Gap : ఫ్రిజ్ను గోడకు ఆనిస్తున్నారా? ఈ తప్పు చేయొద్దు.!
-
Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!
-
Mithali Raj: వనరుల కొరత నుంచి సమాన మ్యాచ్ ఫీజుల వరకు.. మహిళా క్రికెట్లో విప్లవం.!
-
Mithali Raj: ‘నా తప్పేమీ లేకున్నా తొక్కేయాలని చూశారు’.. 2018 నాటి వివాదంపై సంచలన వ్యాఖ్యలు.!
-
Mithali Raj: ‘సరైన వ్యక్తి దొరికితే ఆలోచిస్తా..’ పెళ్లి, వ్యక్తిగత జీవితంపై మనసు విప్పిన టీమిండియా మాజీ కెప్టెన్.!