Rajnath Singh : టన్నెల్ నుంచి ఇంటర్నెట్ వరకు… పదేళ్లలో పూర్తిగా మారిన సరిహద్దు గ్రామాలు : రాజ్నాథ్ సింగ్
Rajnath Singh : దేశ రక్షణ మంత్రి రాజ్నాథ్సింగ్ బుధవారం ‘బోర్డర్ ఏరియా డెవలప్మెంట్ కాంక్లేవ్’లో ప్రసంగించారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ హయాంలో సరిహద్దు గ్రామాలు ఏ విధంగా అభివృద్ధి చెందాయో ఆయన వెలుగులోకి తెచ్చారు. సరిహద్దు గ్రామాలు మారుమూల ప్రాంతాలేనని, దేశంలోనే తొలి గ్రామాలని రాజ్నాథ్సింగ్ అన్నారు. ఈ గ్రామాల అభివృద్ధికి మా ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందన్నారు. సరిహద్దు ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు మరియు సామాజిక-ఆర్థిక పురోగతిని నిర్ధారించడం మా లక్ష్యమన్నారు. ఈ సమ్మేళనం సందర్భంగా గత 10 సంవత్సరాలలో ప్రధాని మోదీ నాయకత్వంలో సరిహద్దు ప్రాంతాల్లో జరిగిన అభివృద్ధిని రక్షణ మంత్రి అందరి ముందు ప్రదర్శించారు.
Read Also:Fridge Explodes: ఉమెన్స్ హాస్టల్లో పేలిన ఫ్రిడ్జ్.. ఇద్దరు యువతులు మృతి!
Also Read
- Petrol Price: బిగ్ షాక్.. లీటర్ పెట్రోల్పై రూ.25, డీజిల్పై రూ.28 రాత్రికి రాత్రే పెంపు..?
- Storyboard : తమిళనాడు రాజకీయం ఎలా ఉంది..? టీవీకే తో విజయ్ ఏం చేయబోతున్నారు..?
- Amazon Great India Summer Sale: అమెజాన్ సమ్మర్ సేల్లో.. ల్యాప్టాప్లు, స్మార్ట్ఫోన్లు సగం కంటే తక్కువ ధరకే!
- Telangana : పోలీస్ శాఖలో భారీ పదోన్నతులు.. సజ్జనార్, మహేష్ భగవత్ లకు డీజీపీ హోదా..!
Addressed the ‘Border Area Development Conclave’ in New Delhi.
Border villages are the country’s first villages, not remote areas. Our Govt fully committed to their holistic development.
⁰Our aim is to ensure infrastructure & socio-economic progress in border areas.… pic.twitter.com/2R3jsAGceK— Rajnath Singh (@rajnathsingh) September 11, 2024
బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ (BRO) 8,500 కిలోమీటర్లకు పైగా రోడ్లు, 400 కంటే ఎక్కువ శాశ్వత వంతెనలను నిర్మించిందని రాజ్నాథ్ సింగ్ చెప్పారు. అటల్ టన్నెల్, సెలా టన్నెల్ నిర్మించబడ్డాయి, దీని తరువాత షికున్-లా టన్నెల్ నిర్మించబడుతుంది, ఇది ప్రపంచంలోనే ఎత్తైన సొరంగంగా గుర్తింపు పొందుతుంది. లడఖ్ సరిహద్దు ప్రాంతాలను నేషనల్ ఎలక్ట్రిసిటీ గ్రిడ్కు అనుసంధానించడానికి మా ప్రభుత్వం 220 కిలో వోల్ట్ శ్రీనగర్-లేహ్ పవర్ లైన్ను ప్రారంభించింది. అంతే కాకుండా ప్రతి ఇంటికి టెక్నాలజీ, ఇంటర్నెట్ని తీసుకెళ్లేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది. ఈశాన్య రాష్ట్రాల ట్రాన్స్మిషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను బలోపేతం చేస్తున్నామని రాజ్నాథ్సింగ్ తెలిపారు.
Read Also:Cloud kitchens: రైల్వే శాఖ కీలక నిర్ణయం.. అందుబాటులోకి క్లౌడ్ కిచెన్లు
భారత్-నెట్ బ్రాడ్బ్యాండ్ ప్రాజెక్ట్ ద్వారా 1,500 కంటే ఎక్కువ గ్రామాలకు హై-స్పీడ్ ఇంటర్నెట్ అందించబడింది. లడఖ్, అరుణాచల్ ప్రదేశ్లపై ప్రత్యేక దృష్టి సారించి గత నాలుగేళ్లలో 7,000కు పైగా సరిహద్దు గ్రామాలను ఇంటర్నెట్ కనెక్షన్లకు అనుసంధానం చేశారు. ఏ ప్రాంతమైనా అభివృద్ధి చెందాలంటే రోడ్లు, విద్యుత్ చాలా ముఖ్యమని, వీటిని గ్రామాలకు అందించడమే కాకుండా సరిహద్దు గ్రామాలను దేశంలోని ఇతర ప్రాంతాలతో కలిపే పని కూడా ప్రభుత్వం చేసిందని రక్షణ మంత్రి అన్నారు. సరిహద్దు గ్రామాల ప్రగతికి కూడా పర్యాటకమే మార్గమని రాజ్నాథ్ సింగ్ ఉద్ఘాటించారు. సరిహద్దు గ్రామాల్లో పర్యాటకాన్ని పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తోందన్నారు. 2020 నుండి 2023 వరకు, లడఖ్, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్లలో పర్యాటకుల సంఖ్యలో 30శాతం పెరుగుదల నమోదైంది. అంతేకాకుండా, రాజ్నాథ్ సింగ్ కాశ్మీర్లో పర్యాటకాన్ని కూడా పెంచారు. ఇది ఉపాధి అవకాశాలను సృష్టించింది. స్థానిక ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసిందన్నారు..
తాజావార్తలు
-
Off The Record : ఘోష్ కమిషన్ రిపోర్ట్ ఆధారంగా చర్యలు వద్దన్న హైకోర్ట్
-
Petrol Price: బిగ్ షాక్.. లీటర్ పెట్రోల్పై రూ.25, డీజిల్పై రూ.28 రాత్రికి రాత్రే పెంపు..?
-
Asian Games: ‘ఆసియా క్రీడల’ ప్రత్యక్ష ప్రసారం సోనీ నెట్వర్క్ చేతికి.. యాప్లో కూడా..
-
Storyboard : తమిళనాడు రాజకీయం ఎలా ఉంది..? టీవీకే తో విజయ్ ఏం చేయబోతున్నారు..?
-
Amazon Great India Summer Sale: అమెజాన్ సమ్మర్ సేల్లో.. ల్యాప్టాప్లు, స్మార్ట్ఫోన్లు సగం కంటే తక్కువ ధరకే!
ట్రెండింగ్
-
Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!
-
Mirchi Bajji Recipe: పర్ఫెక్ట్ గా, బండిమీద టేస్ట్ రావాలంటే మిరపకాయ బజ్జీ పిండి ఇలా కలిపి వేయండి.. లొట్టలేసుకుంటూ తినాల్సిందే.!
-
భారీ బ్యాటరీ + స్లిమ్ డిజైన్, రఫ్ & టఫ్ ఫోన్ Motorola Edge 70 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
200MP+200MP కెమెరాలు, IP66, IP68, IP69 రేటింగ్స్, 7025mAh బ్యాటరీతో ప్రీమియం ఫోన్ OPPO Find X9s Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
కాంపాక్ట్ డిజైన్, 8000mAh బ్యాటరీతో OPPO Pad Mini లాంచ్.. ధర ఎంతంటే.?