Rajiv Gandhi Case: 3 దశాబ్దాల తర్వాత నిందితులకు వీడ్కోలు
దాదాపు 30 ఏళ్ల తర్వాత మాజీ ప్రధాని రాజీవ్గాంధీ నిందితులకు భారత్ నుంచి విముక్తి లభించింది. బుధవారం నిందితులు తమ స్వదేశానికి బయల్దేరి వెళ్లారు. రాజీవ్ గాంధీ హత్య కేసులో దోషులుగా తేలి, జీవిత ఖైదు అనుభవించిన ముగ్గురు వ్యక్తులు బుధవారం ఉదయం శ్రీలంకకు వెళ్లారు. రాజీవ్గాంధీ 1991, మే 21న మానవ బాంబు దాడిలో ప్రాణాలు కోల్పోయారు. తమిళనాడు రాష్ట్రంలోని శ్రీపెరంబదూర్లో రాజీవ్ గాంధీ మరణించారు.
ఇది కూడా చదవండి: Kinnera Mogilaiah: సీఎం రేవంత్పై మొగిలయ్య పాట..
Also Read
అయితే ఈ హత్య కేసులో దోషులైన మురుగన్, రాబర్ట్ పయస్, జయకుమార్ సహా మొత్తం ఆరుగురు దోషులను సుప్రీంకోర్టు సూచనల మేరకు 2022 నవంబర్లో విడుదల చేశారు. వీరు జైల్లో సత్ర్పవర్తనతో మెలగడంతో శిక్షా కాలాన్ని తగ్గించాలని తమిళనాడు ప్రభుత్వం సిఫార్సు చేసింది. వారు శ్రీలంక జాతీయులు కావడంతో జైలు నుంచి విడుదలైన అనంతరం తిరుచురాపల్లిలోని శరణార్థి శిబిరానికి తరలించారు. ఇటీవల శ్రీలంక ప్రభుత్వం ఈ ముగ్గురికి పాస్పోర్ట్లు మంజూరు చేయడంతో బుధవారం ఉదయం పోలీసుల బృందం వారిని చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయానికి తీసుకెళ్లారు. ముగ్గురు కూడా శ్రీలంకకు చేరుకున్నారు. దాదాపు 33 ఏళ్ల తర్వాత భారత్ నుంచి వారికి విముక్తి లభించింది.
ఇది కూడా చదవండి: Film Chamber: హైదరాబాద్ ఫిల్మ్ ఛాంబర్లో అగ్నిప్రమాదం
నిందితుల్లో ఒకరైన భారతీయ పౌరురాలు నళినిని మురుగన్ వివాహం చేసుకున్నారు. ఆమెకు మరణశిక్ష విధించినప్పుడు నళిని గర్భిణి అని తేలడంతో సోనియాగాంధీ ఆమె మరణశిక్షను రద్దు చేశారు. ప్రస్తుతం ఆమె కుమార్తె యూఎస్లో వైద్యురాలుగా ఉన్నారు. నళిని తన కుమార్తె దగ్గరకు వెళ్లేందుకు వీసా కోసం ప్రయత్నిస్తోంది. ఆమె భర్త కొలంబో వెళ్లిన అనంతరం అక్కడి నుంచి వీసా తీసుకొని కూతురి దగ్గరకు వెళ్లాలనుకుంటున్నట్లు తెలుస్తోంది.
ఇది కూడా చదవండి: RC 16: మెగాస్టార్ ని కూడా దింపుతున్నావా? అసలు ఏం ప్లాన్ చేశావ్ బుచ్చి?
తాజావార్తలు
-
Fuel Shortage: తెలుగు రాష్ట్రాల్లో మూడోరోజుకు చేరిన ఇంధన కష్టాలు.. అధికారులు ఏం చెబుతున్నారంటే..?
-
Akhil : అఖిల్ ‘లెనిన్’ మళ్లీ వాయిదా.. జూన్ బరిలోకి అక్కినేని వారసుడు దిగడం డౌటే
-
Petrol and Diesel Shortage in AP: పెట్రోల్, డీజిల్ కొరతపై సీఎం ఆరా
-
Spirit : స్పిరిట్.. మెంటలెక్కించే అప్డేట్!
-
Manish Sisodia: కోర్టులో మీరుంటే విచారణకు రాను.. జస్టిస్ స్వర్ణకాంతకు మనీష్ సిసోడియా లేఖ
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!