Rajendranagar Crime: మార్నింగ్ వాక్ చేస్తున్నవారిపై దూసుకెళ్లిన కారు.. తల్లి, కూతురు మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rajendranagar Crime: రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ లో కారు బీభత్సం సృష్టించింది. ఉదయాన్నే మార్నింగ్ వాక్ చేస్తున్న తల్లి కూతుర్లపై కారు దూసుకుపోయింది. దీంతో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు.కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
హైదర్ షాకోట్ శాంతి నగర్ లో అనురాధ కుటుంబం నివాసం ఉంటుంది. రోజూ తన కూతురు తో కలిసి అనురాధ మార్నింగ్ వాక్ వెళ్లతూ ఉంటుంది. దీంతో రోజూలాగానే ఇవాళ ఉదయం బండ్లగూడ సన్ సిటీ వద్ద అనురాధ తన కూతురు మమత, కవిత అనే మహిళతో కలిసి మార్నింగ్ వాక్ కు వెళ్ళారు. మార్నింగ్ వాక్ చేస్తున్న వారిని విధి వక్రీకరించింది. కారు రూపంలో జీవితాలను ఛిదిలం చేసింది. ఫుట్ పాత్ పై మార్నింగ్ వాక్ చేస్తున్న వారిపైకి కారు దూసుకెళ్లింది. అంతేకాకుండా.. అక్కడే మార్నింగ్ వాకర్స్ పై కూడా దూసుకుని పొదల్లోకి వెళ్లింది. దీంతో తల్లి కూతురు అనురాధ, మమత అక్కడికక్కడే మృతి చెందగా.. మరో ఐదు మందికి తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన కారు డ్రైవర్ కారు వదలి పారిపోయాడు.
Also Read
- Aata Sandeep: డ్యాన్సర్ల కష్టార్జితంపై రూపాయి కమిషన్ తీసుకోను: సందీప్ సంచలన ప్రకటన!
- Israel-Turkey: ఇజ్రాయెల్ నెక్ట్స్ టార్గెట్ టర్కీనేనా? గ్రీస్లో శక్తివంతమైన క్షిపణి ఏర్పాట్లు!
- Tamil Nadu: అలాగైతే కేబినెట్ నుంచి వైదొలుగుతాం.. సీఎం విజయ్కు కాంగ్రెస్ వార్నింగ్.. కారణమిదేనా?
- IMD Rain Alert: తెలుగు రాష్ట్రాలపై మళ్లీ వాన గండం.. ఈ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు..
కారులో బ్యాగ్ లభ్యం మయ్యింది. కారును స్వాధీనం చేసుకున్న పోలీసులు కారులో వున్న బ్యాగ్ను తీసి చూడగా షాక్ కు గురయ్యారు. బ్యాగ్ లో మారణ ఆయుధాలు ప్రత్యేక్షమయ్యాయి. దీంతో కారు డ్రైవర్ ఎదైన నేరం చేసి పారిపోతున్నాడా? అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అందుకే హడావిడిగా కారును నడపడం వల్లే మార్నింగ్ వాకర్స్ పై దూసుకుపోయివుంటుందని తెలిపారు. అంతేకాకుండా కారు డ్రైవర్ మద్యం సేవించి నడిపాడా? అనే అనుమానం కూడా వ్యక్తం చేస్తున్నారు. ప్రమాద స్థలం నుంచి పారిపోతున్న కారు డ్రైవర్ ను గమనించిన స్థానికులు, ఆర్మీ అధికారులు పట్టుకుని దేహశుద్ది చేశారు. అనంతరం పోలీసులకు అప్పగించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం తరలించారు. కారు డ్రైవర్ అతివేగంగా నడపడం వల్లే ప్రమాదం జరిగిందని స్థానికులు తెలిపారు. కారు నంబర్ ఆధారంగా యజమానిని గుర్తించిన పోలీసులు వాహనం నడిపిన వ్యక్తిని పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.
Eye Care: నిద్ర, శారీరక శ్రమ లేకపోతే కంటి చూపు మందగిస్తుంది
తాజావార్తలు
-
Aata Sandeep: డ్యాన్సర్ల కష్టార్జితంపై రూపాయి కమిషన్ తీసుకోను: సందీప్ సంచలన ప్రకటన!
-
Israel-Turkey: ఇజ్రాయెల్ నెక్ట్స్ టార్గెట్ టర్కీనేనా? గ్రీస్లో శక్తివంతమైన క్షిపణి ఏర్పాట్లు!
-
CM Revanth Reddy : కేసీఆర్ అప్పులపై రేవంత్ ఫైర్.. ‘భారం మోస్తున్నాం’!
-
Allu Arjun : రాకా హైప్ ఓకే.. కంటెంట్ ఆ రేంజ్ లో లేక పోతే?
-
CM Revanth Reddy : హైదరాబాద్కు కొత్త రూపు.. మూడు కార్పొరేషన్ల లోగోలు
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!