MDMA Factory: ఇంత టాలెంటెడ్ గా ఉన్నావేంట్రా నువ్వు.. ఇంట్లోనే MDMA తయారీ కేంద్రం పెట్టేశావ్.!
- ఇంటినే అక్రమ MDMA తయారీ కేంద్రం..
- తనిఖీల్లో 5.418 కిలోల MDMA స్వాధీనం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rajasthan MDMA Factory: రాజస్థాన్కు చెందిన 28 ఏళ్ల మహావీర్ ఉద్యోగం చేసేవాడు. అయితే వచ్చే ఆదాయంతో సంతృప్తి చెందలేదు. త్వరగా ఎక్కువ డబ్బు సంపాదించాలనే ఆలోచనతో ఉద్యోగాన్ని వదిలేశాడు. ఆ తర్వాత అక్రమ మార్గంలో డబ్బు సంపాదించేందుకు ప్రయత్నించాడు. ఇందులో భాగంగానే.. చివరకు అతడు అద్దె ఇంటినే డ్రగ్స్ తయారీ కేంద్రంగా మార్చి, కోట్ల రూపాయల విలువైన MDMA తయారీ చేస్తున్నాడు.
నాగౌర్ పోలీసుల ప్రకారం.. లక్ష్మణ్పురా కుచేరాకు చెందిన మహావీర్ ప్రస్తుతం నాగౌర్ లోని దీప్ కాలనీలో నివసిస్తున్నాడు. ఉద్యోగం ద్వారా వచ్చే ఆదాయం సరిపోవడం లేదనే కారణంతో ఎక్కువ డబ్బు సంపాదించాలని భావించాడు. ఈ క్రమంలో 2025 డిసెంబర్ నుంచి 2026 జనవరి మధ్య MDMA తయారు చేసేందుకు ప్రయత్నాలు ప్రారంభించినట్లు దర్యాప్తులో వెల్లడైంది. తొలుత చేసిన ప్రయత్నాలు విజయవంతం కాలేదని పోలీసులు తెలిపారు. ఆ తర్వాత ఆన్లైన్లో MDMA తయారీకి సంబంధించిన సమాచారాన్ని సేకరించినట్లు పోలీసులు తెలిపారు. క్రమంగా తయారీ విధానంపై అవగాహన పెంచుకుని అవసరమైన సామగ్రిని సమకూర్చుకున్నాడని చెప్పారు. 2026 ఫిబ్రవరిలో ఉద్యోగాన్ని వదిలేసిన అనంతరం నాగౌర్లోని ఓ అద్దె ఇంటిని ఈ అక్రమ కార్యకలాపాలకు ఉపయోగించడం ప్రారంభించినట్లు దర్యాప్తులో తేలిందని పోలీసులు తెలిపారు.
Also Read
- CM Chandrababu: వికసితం నుంచి వైభవం వైపు.. ఆంధ్రప్రదేశ్పై చంద్రబాబు భారీ లక్ష్యం
- PM Modi: ఎర్రకోట వేదికగా యూత్కు ప్రధాని మోడీ గుడ్న్యూస్.. కోటి మంది యువతకు ఉచితంగా..
- Nara Lokesh: యువత ఇతర రాష్ట్రాలకు వెళ్లొద్దు.. మన అమరావతి, విశాఖ, కర్నూలులోనే ఉద్యోగాలు..
- PM Modi: ప్రభుత్వ అధికార వర్గాల్లోనూ మావోయిస్టు భావజాలం.. 'అర్బన్ నక్సల్స్'ను సమాజం దూరం పెట్టాలి..
పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో భారీగా MDMA, దాని తయారీలో ఉపయోగించే పదార్థాలు లభించినట్లు వెల్లడించారు. మొత్తం 5.418 కిలోల MDMA, సుమారు 2.744 కిలోల కెఫీన్, 24 రకాల రసాయనాలు, సుమారు 210 లీటర్ల వివిధ రసాయనాలను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. స్వాధీనం చేసుకున్న MDMA, ఇతర పదార్థాల అంతర్జాతీయ మార్కెట్ విలువ రూ.100 కోట్లకు పైగా ఉంటుందని పోలీసులు అంచనా.
పోలీసుల తనిఖీల్లో కేవలం డ్రగ్స్, రసాయనాలు మాత్రమే కాకుండా తయారీకి ఉపయోగించిన పలు పరికరాలు కూడా లభించాయి. మిక్సింగ్ మెషిన్, థర్మామీటర్, మాగ్నెటిక్ స్టిరర్, pH మీటర్, గ్లాస్ బీకర్లు, గాజు జార్లు, ప్లాస్టిక్ పాత్రలు, MDMAను ఆరబెట్టేందుకు ఉపయోగించే పెద్ద ప్లేట్లు తదితర సామగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం మహావీర్ను అదుపులోకి తీసుకుని ఈ డ్రగ్స్ వ్యవహారంలో మరెవరైనా ప్రమేయం ఉందా? తయారైన MDMAను ఎక్కడికి తరలించేవారు? ఎవరికి అమ్మేవారు? అనే కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
తాజావార్తలు
-
MDMA Factory: ఇంత టాలెంటెడ్ గా ఉన్నావేంట్రా నువ్వు.. ఇంట్లోనే MDMA తయారీ కేంద్రం పెట్టేశావ్.!
-
CM Chandrababu: వికసితం నుంచి వైభవం వైపు.. ఆంధ్రప్రదేశ్పై చంద్రబాబు భారీ లక్ష్యం
-
Unmadam OTT Release: మర్డర్ కేసు వెనుక ముచ్చెమటలు పట్టించే మైండ్ గేమ్స్!.. ఓటీటీలోకి మరో మలయాళ సైకలాజికల్ థ్రిల్లర్..
-
PM Modi: ఎర్రకోట వేదికగా యూత్కు ప్రధాని మోడీ గుడ్న్యూస్.. కోటి మంది యువతకు ఉచితంగా..
-
Nara Lokesh: యువత ఇతర రాష్ట్రాలకు వెళ్లొద్దు.. మన అమరావతి, విశాఖ, కర్నూలులోనే ఉద్యోగాలు..
ట్రెండింగ్
-
డిజైన్, ఫీచర్లలో భారీ అప్డేట్స్ తో సెప్టెంబర్ 5న రాబోతున్న Maruti Baleno Facelift..!
-
కొత్త పికప్ ట్రక్ Mahindra Scorpio Lifestyler వచ్చేస్తోంది.. ధర, ఫీచర్లు ఇవే!
-
48dB ANC, AI మీటింగ్ సమ్మరీ.. భారత్లో POVA AI Buds Pro లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
Healthy Snacks : నల్లగా మారిన అరటిపండ్లు పారేయొద్దు.. ఇలా చేస్తే అదిరిపోయే టేస్టీ డెజర్ట్స్.!
-
Nagarjuna Akkineni: నేను సైబర్ క్రైమ్ బాధితుడినే.. నాలుగేళ్ల క్రితం మోసపోయా.. ఆసక్తికర విషయాలు చెప్పిన కింగ్!