NTV Telugu Site icon

Crime News: మత్తుమందు ఇచ్చి.. 14 రోజుల పాటు వితంతువుపై సామూహిక అత్యాచారం!

Gang Rape

Gang Rape

Women Was Gang Raped by 6 Men in Rajasthan: రాజస్థాన్‌లోని దారుణం చోటుచేసుకుంది. పహాడీ సబ్‌ డివిజన్ పరిధిలో ఓ వితంతువుకు మత్తుమందు ఇచ్చి.. కొందరు సామూహిక అత్యాచారం చేశారు. ఆరుగురు కామాంధులు 14 రోజుల పాటు ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డారు. కామాంధుల నుంచి తప్పించుకున్న ఆ మహిళా పోలీస్ స్టేషనులో ఫిర్యాదు చేసింది. పరారీలో ఉన్న నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.

పహాడీ సబ్‌ డివిజన్ పరిధిలో భర్తను కోల్పోయి ఇద్దరు పిల్లలతో ఓ మహిళ జీవిస్తోంది. ఆమెకు ఉద్యోగం ఆశ చూపి.. ఓ వ్యక్తి చేరువయ్యాడు. మహిళపై కెన్నేసిన ఆ వ్యక్తి.. తన అయిదుగురు స్నేహితులతో కలిసి కుట్ర పన్నాడు. ఉద్యోగం విషయమై మాట్లాడుదాం రమ్మని ఆ వ్యక్తి మహిళకు చెప్పాడు. ముందుగా వేసుకున్న ప్రణాళిక ప్రకారం.. శీతల పానీయంలో మత్తుమందు కలిపి ఇచ్చాడు. శీతల పానీయం తాగిన మహిళను భరత్‌పుర్‌లోని ఓ హోటలుకు ఆమెను తీసుకువెళ్లాడు.

Also Read: Disney+ Hotstar-Reliance: జియో దెబ్బకు ఆగమాగం అవుతున్న స్టార్ స్పోర్ట్స్‌.. ఇక అంబానీ చేతికి..!

మహిళను అక్కడే నిర్బంధించి ఆరుగురూ అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఆరుగురు 14 రోజుల పాటు ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డారు. చివరకు ఆ కామాంధుల ఉచ్చు నుంచి బయటపడిన మహిళ.. కామా పోలీస్ స్టేషనులో నిందితుల పేర్లతో సహా ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు. పరారీలో ఉన్న నిందితులను త్వరలో పట్టుకుంటామని డీఎస్పీ దేశ్‌రాజ్‌ కుల్దీప్‌ చెప్పారు.