Rajasthan: భర్త ఉద్యోగం కోసం ఇద్దరు భార్యల మధ్య గొడవ.. ఒకరి దారుణ హత్య
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rajasthan: ప్రస్తుత కలియుగంలో మన అనుకున్న వాళ్లే అవకాశాలను ఆసరాగా చేసుకుని మోసం చేసిన ఉదంతాలు చాలానే చూస్తున్నాం. ప్రస్తుతం ఇలాంటి ఘటనలు అనేకం తెరపైకి రావడంతో నేరాలు కూడా పెరుగుతున్నాయి. అలాంటి ఘటనే వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన రాజస్థాన్లోని భరత్పూర్ జిల్లాలో చోటుచేసుకుంది. కొద్ది రోజుల క్రితం సుధా చౌదరి అనే 32 ఏళ్ల మహిళ తన కుమారుడితో కలిసి స్కూటీపై వెళుతోంది. ఆ సమయంలో బైక్పై వచ్చిన ఇద్దరు దుండగులు ఈ మహిళను కాల్చిచంపారు. ఈ ఘటనతో జిల్లా మొత్తం ఉలిక్కిపడింది. ఇప్పుడు ఈ షాకింగ్ ఘటనను పోలీసులు బయటపెట్టారు.
Read Also:Silvio Berlusconi: ప్రియురాలికి రూ.906 కోట్ల ఆస్తి.. వీలునామా రాసిన మాజీ ప్రధాని
Also Read
- Sai Sudharsan: ఐపీఎల్ చరిత్రలోనే మొదటి బ్యాట్స్మెన్గా.. ఆ రికార్డు బద్దలు కొట్టిన సాయి సుదర్శన్..
- Trump: ట్రంప్ సంచలన నిర్ణయం.. భారత్లో పెట్రోల్, డీజిల్ ధరలు మరింత పెరిగే ఛాన్స్?
- Guntur Job Fraud: ఉద్యోగాల పేరుతో విద్యార్థులకు భారీ మోసం.. కోట్లు నొక్కేశాడు..
- Beerakaya Chutney Recipe: పప్పు, అన్నంతో అదిరే రుచి.. కారం కారంగా బీరకాయ చట్నీ ఇలా చేస్తే వేళ్లు కూడా వదలరు..!
ఈ హత్య కేసులో నిందితులను పోలీసులు గుర్తించారు. ఈ మహిళ హత్య వెనుక సూత్రధారి మరెవరో కాదు.. ఆమె సవతి తమ్ముడు. నిందితుడు దిర్ మనోజ్ సింగ్ను పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. ఆ తర్వాత హత్యకు రచించిన పథకం గురించి పోలీసులకు పూస గుచ్చినట్లు చెప్పాడు. సుధా చౌదరి భర్త పుష్పేంద్ర సింగ్ సీఆర్పీఎఫ్లో ఉన్నారు. ఉత్తరప్రదేశ్కు చెందిన సుశీలాదేవి అనే మహిళతో రెండో పెళ్లి చేసుకున్నాడు. దీంతో సుధా చౌదరి తన అత్తమామలతో కాకుండా తల్లితో కలిసి జీవించింది. తరువాత, పుష్పేంద్ర సింగ్ 27 జూలై 2022 న ప్రమాదంలో మరణించాడు. అతని మరణానంతరం, కారుణ్య ఉద్యోగం విషయంలో అతని ఇద్దరు భార్యలు సుధా చౌదరి, సుశీలాదేవి మధ్య వివాదం జరిగింది.
Read Also:MLA Prasanna Kumar: పవన్ కళ్యాణ్ వాలంటీర్లపై ఆరోపణలు చేయడం సరికాదు
భర్త చనిపోవడంతో ఇద్దరు భార్యల మధ్య గొడవ జరిగింది. అలాగే, నిందితుడు మనోజ్ సింగ్ తన సోదరుడి రెండవ భార్య అంటే సుశీలాదేవికి మద్దతు పలికాడు. అందుకే హత్యకు పథకం వేసి సుధా చౌదరిని హత్య చేశాడు. మరోవైపు మనోజ్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు మిగిలిన నిందితుల కోసం గాలిస్తున్నారు.
తాజావార్తలు
-
Sai Sudharsan: ఐపీఎల్ చరిత్రలోనే మొదటి బ్యాట్స్మెన్గా.. ఆ రికార్డు బద్దలు కొట్టిన సాయి సుదర్శన్..
-
WHO Ebola Emergency: కాంగో, ఉగాండాలలో ఎబోలా వ్యాప్తి.. ఇంటర్నేషనల్ హెల్త్ ఎమర్జెన్సీగా ప్రకటించిన డబ్ల్యూహెచ్ఓ
-
Trump: ట్రంప్ సంచలన నిర్ణయం.. భారత్లో పెట్రోల్, డీజిల్ ధరలు మరింత పెరిగే ఛాన్స్?
-
Virat Kohli: నాకు చాలా భయమేస్తోంది.. విరాట్ కోహ్లీ సంచలన వ్యాఖ్యలు!
-
Guntur Job Fraud: ఉద్యోగాల పేరుతో విద్యార్థులకు భారీ మోసం.. కోట్లు నొక్కేశాడు..
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..