Duddilla Sridhar Babu : మా ప్రభుత్వం వచ్చాక కార్మికుల సంక్షేమంలో రాజీలేదు
- నేతన్నల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం
- వేములవాడ ఆలయానికి నిధుల కేటాయింపుతో ధార్మిక అభివృద్ధికి బాసట
- విద్య, పరిశ్రమల పరిరక్షణపై బీఆర్ఎస్పై మంత్రి ఘాటు విమర్శలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Duddilla Sridhar Babu : మంత్రి శ్రీధర్ బాబు ఇవాళ రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం నేతృత్వంలోని లక్ష్యాలను స్పష్టంగా వెల్లడించారు. సిరిసిల్లను నేతన్నలకి నిలయంగా అభివర్ణిస్తూ, రాష్ట్రంలో చేనేత కార్మికుల బతుకులకు ఉజ్వల భవిష్యత్ అందించాలన్నదే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయమని చెప్పారు. దేశవ్యాప్తంగా చేనేత రంగానికి గుర్తింపు కల్పించేందుకు ప్రభుత్వం సంకల్పబద్ధంగా పనిచేస్తుందని ఆయన పేర్కొన్నారు.
వేములవాడ ఆలయం గురించి ప్రస్తావిస్తూ, ఇది దేశ నలుమూలల నుండి భక్తులు తరలి వచ్చే పవిత్ర క్షేత్రమని అన్నారు. ఇలాంటి ధార్మిక క్షేత్రాల అభివృద్ధి కోసం నిధులు విడుదల చేయడం ప్రభుత్వ ప్రథమ కర్తవ్యంగా తీసుకుంటోందన్నారు. గత ప్రభుత్వ హయాంలో వాగ్దానాలు చేసి కూడా ఒక్క రూపాయి కూడా ఆలయానికి మంజూరు చేయలేదని విమర్శించారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎలాంటి ప్రకటనలూ లేకుండానే బడ్జెట్ లో నేరుగా వేములవాడ ఆలయ అభివృద్ధికి నిధులు కేటాయించిందని తెలిపారు.
Also Read
- Vaibhav Sooryavanshi: బెంచ్కే పరిమితమైన 'బేబీ బాస్'.. వైభవ్కు ఎందుకు ఛాన్స్ లేదు?
- Tamil Nadu Politics: విజయ్ సర్కార్ ఎప్పుడైనా కూలిపోవచ్చు.. ఎన్నికలకు సిద్ధం కండి..! స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు
- WhatsApp New Feature: వాట్సాప్ వినియోగదారులకు గుడ్న్యూస్.. మరో స్మార్ట్ ఫీచర్.. మరింత భద్రత..
- Astrology: జూన్ 29 సోమవారం దినఫలాలు.. ఈ రాశివారికి గుడ్ న్యూస్..
పరిశ్రమల పరిరక్షణపై మంత్రి ఘాటుగా స్పందిస్తూ, పరిశ్రమల ఆధారంగా జీవనం సాగించే కార్మికులను ఆదుకోవడం ప్రభుత్వ బాధ్యత అన్నారు. తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత కార్మికుల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నామని, రాజీలేని విధంగా ఆ దిశగా ముందుకు సాగుతున్నామని చెప్పారు.
విద్యా రంగంపై కూడా ఆయన తీవ్రమైన విమర్శలు చేశారు. గత పదేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం విద్యను పూర్తిగా విస్మరించిందని, విద్యారంగం మునుపటి గొప్పతనాన్ని కోల్పోయిందని అన్నారు. అయితే శాతవాహన విశ్వవిద్యాలయాన్ని స్థాపించిన ఘనత మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వానికే చెందుతుందని గుర్తు చేశారు.
బీఆర్ఎస్ నాయకులపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తూ, అపనిందలు, తప్పుడు ప్రచారాలు చేయడం వారికి అలవాటైపోయిందని మంత్రి ఆరోపించారు. హైద్రాబాద్ యూనివర్సిటీ భూముల విషయాన్ని ప్రస్తావిస్తూ, నగర మధ్యలో ఏనుగులు తిరుగుతాయా అంటూ తప్పుడు ఆరోపణలు చేసి ప్రజల్లో భ్రమలు సృష్టించారని పేర్కొన్నారు.
తమ ప్రభుత్వ ధ్యేయాలు చాలా స్పష్టంగా ఉన్నాయనీ, సాగునీరు, తాగునీరు, విద్య, వైద్యం, నేతన్న సంక్షేమం, ధార్మిక క్షేత్రాల అభివృద్ధి వంటి అంశాలపై కేంద్రీకరించి పాలన సాగిస్తామని మంత్రి శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేలా పాలన సాగిస్తున్నామని తెలిపారు.
Tahawwur Rana: ముంబై ఉగ్రదాడుల్లో పాక్ ఐఎస్ఐ ప్రమేయం.. మేజర్ ఇక్బాల్, సమీర్ల పాత్ర..
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: బెంచ్కే పరిమితమైన ‘బేబీ బాస్’.. వైభవ్కు ఎందుకు ఛాన్స్ లేదు?
-
Cinema News: థియేటర్లలో ఫ్లాప్.. యూట్యూబ్లో చరిత్ర సృష్టించిన బెల్లంకొండ సినిమా!
-
Suriya : రాజకీయాల్లోకి తమిళ స్టార్ హీరో సూర్య ఎంట్రీ.?
-
Jai Moondra: రెండు మ్యాచ్లకే ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అండ్ ‘సిరీస్’.. టీమిండియాపై ఈ అవార్డులు వస్తాయనుకోలేదు!
-
Tamil Nadu Politics: విజయ్ సర్కార్ ఎప్పుడైనా కూలిపోవచ్చు.. ఎన్నికలకు సిద్ధం కండి..! స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!