Raja Gopal Reddy: కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారా..? రాజగోపాల్ రెడ్డి ఏమన్నారంటే..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Raja Gopal Reddy: కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రస్తుతం బీజేపీలో ఉన్నారు.. త్వరలో కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారా..? ఇదే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. బీజేపీకి గుడ్ బై చెబుతారని సోషల్ మీడియా, కొన్ని ఛానెల్స్ ద్వారా ప్రచారం సాగుతోంది. ఉప ఎన్నికల్లో ఓటమి తర్వాత.. బీజేపీలో యాక్టివ్గా లేని రాజగోపాల్.. 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు.. బీజేపీని వీడి.. కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. మీడియా ప్రచారాన్ని ఆయన ఖండించలేదు. దీంతో ఇది నిజమేనా అనే మాటలు వినిపిస్తున్నాయి. అక్టోబర్ 24న రాహుల్ గాంధీ సమక్షంలో రాజగోపాల్ కాంగ్రెస్లో చేరే అవకాశం ఉంది. రాజగోపాల్ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తారని సమాచారం. ఇదే విషయమై ఆయన తన అనుచరులు, ముఖ్య కార్యకర్తలతో చర్చిస్తున్నారు.
పార్టీ మార్పుపై రాజగోపాల్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ముందుగా తెలంగాణ ప్రజలకు విజయ దశమి శుభాకాంక్షలు రాజగోపాల్ రెడ్డి తెలిపారు. ఈ దసరాతోనే కేసీఆర్ రాక్షస పాలనకి స్వస్తి పలుకుదామన్నారు. తెలంగాణ ప్రజల ఆలోచనకి అనుగుణంగానే నా భవిష్యత్ నిర్ణయం ఉంటుందన్నారు. కేసీఆర్ కుటుంబ దుర్మార్గ పాలన విముక్తి కోసమే నా పోరాటమన్నారు. మునుగోడు కార్యకర్తలు.. నాయకులు.. ప్రజల ఆలోచనకు అనుగుణంగా నిర్ణయం తీసుకుంటామన్నారు. నాపై ఎంత దుష్ప్రచారం చేసినా కేసీఆర్ పై పోరాటం ఆపలేదని, ఇకపై అపబోనని అన్నారు. తాను ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారు. కాంగ్రెస్ నుంచి పోటీ చేయాలని గతంలో ప్రజలు ఒత్తిడి తెచ్చారని అన్నారు. ఇప్పటికైనా ఉప ఎన్నికల పరిస్థితులు మారాయన్నారు.
Also Read
- Nara Lokesh: ఇప్పుడు 'మావిగన్'.. రేపు బెంగళూరు, తాడేపల్లి, హైదరాబాద్ కలిపి ‘బెన్తాహై’ అంటారేమో..!
- Simhachalam Temple Land: సింహాచలం భూముల వివాదంపై హైకోర్టు సీరియస్.. ప్రభుత్వానికి నోటీసులు
- Astrology: జూలై 2 గురువారం దినఫలాలు.. ఈ రాశివారికి ఊహించని గుడ్ న్యూస్..
- Vaibhav Sooryavanshi: బుడ్డోడికి మళ్లీ నిరాశే.. ఇంగ్లండ్తో తొలి టీ20లోనూ 'నో ఛాన్స్'.!
మరోవైపు బీజేపీ ప్రకటించిన 52 మంది తొలి జాబితాలో రాజగోపాల్ పేరు లేదు. దీంతో రాజగోపాల్ పార్టీ మారతారనే ప్రచారం జోరందుకుంది. గతంలో జరిగిన ఉప ఎన్నికల్లో రాజగోపాల్ రెడ్డి బీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి చేతిలో ఓడిపోయారు. అప్పటి నుంచి పార్టీ కార్యక్రమాల్లో అంటీముట్టనట్టు ఉంటున్నారు. దీంతో ఆయన పార్టీ మారతారనే ప్రచారం సాగుతోంది.
Ram Charan: రామ్ చరణ్ కూతురిని చూశారా?.. వైరల్ అవుతున్న ఫోటో..
తాజావార్తలు
-
India – Pakistan: భారత్ – పాక్ మధ్య అర్ధరాత్రి ఆసక్తికర ఒప్పందం.. ఏంటో తెలుసా!
-
Jana Nayagan : జననాయగన్ రిలీజ్కు అన్ని దారులు క్లియర్.. రిలీజ్ ఎప్పుడంటే?
-
GST Collection June 2026: జూన్లో జీఎస్టీ వసూళ్ల జోరు.. రూ.1.95 లక్షల కోట్లకు చేరిన ఆదాయం
-
Nara Lokesh: ఇప్పుడు ‘మావిగన్’.. రేపు బెంగళూరు, తాడేపల్లి, హైదరాబాద్ కలిపి ‘బెన్తాహై’ అంటారేమో..!
-
Donald Trump: డియర్ ట్రంప్.. నీకంత సీన్ లేదంటగా..! ప్యూ రీసెర్చ్ సెంటర్ నివేదికలో బయటపడ్డ ప్రెసిడెంట్ గారి బండారం
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 10,000mAh బ్యాటరీతో Vivo Pad 5c ఎంట్రీ.. ధర ఎంతంటే?
-
Lenovo నుంచి డబుల్ ధమాకా.. Tab Plus Gen 2, LOQ మానిటర్ సిరీస్ లాంచ్.!
-
Fluffy Omelette: రెగ్యులర్ ఆమ్లెట్కు బదులుగా.. స్పాంజీలా ఉండే ‘ఫ్లఫీ ఆమ్లెట్’ చేసేయండి ఇలా.! లొట్టలేసుకుని తింటారంతే.!
-
Air Fryer vs Stove Cooking: ఎయిర్ ఫ్రయర్ Vs స్టవ్ వంట.. ఆరోగ్యానికి ఏది మంచిది.?
-
అందుబాటులోకి Aadhaar App కొత్త వెర్షన్..ఫేస్ ఆథెంటికేషన్, మొబైల్ నంబర్ అప్డేట్లతో పాటు మరిన్ని సేవలు.!