Delhi Weather: ఢిల్లీలో మరో నాలుగు రోజులు వర్షాలు.. ఉగ్రరూపం దాల్చనున్న యమునా నది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Delhi Weather: దేశ రాజధాని ఢిల్లీ ఇటీవల వర్షాలకు అతలాకుతలం అయిపోతుంది. యమునా నది నీటిమట్టం తగ్గుముఖం పట్టడంతో ఢిల్లీ జనజీవనం మెల్లగా తిరిగి పట్టాలపైకి వస్తోంది. అయితే గత 24 గంటల్లో మరోసారి వరద ఢిల్లీ వాసుల ఆందోళనను మరింత పెంచింది. దీంతో పాటు నేడు (మంగళవారం), జూలై 19వ తేదీల్లో ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ (ఐఎండీ) హెచ్చరికలు జారీ చేసింది. దీంతో యమునా నీటి ఉధృతి, వర్షాల కారణంగా ఢిల్లీ కష్టాలు మరోసారి పెరిగే చాన్స్ ఉంది.
Read Also:Vijay Sethupathi : షారుఖ్ ఖాన్ కోసం జవాన్ సినిమాలో నటించాను
Also Read
- NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
- Kerala: "ఇక కేరళలో చట్టాలను నిర్ణయించేది మేమే".. ఊరేగింపులో రెచ్చిపోయిన ముస్లిం లీగ్ నేతలు..
- Tirupati Crime News: తిరుపతిలో దారుణం.. బాలికపై బాబాయ్ అత్యాచారం!
- Hyderabad: శంషాబాద్ ఎయిర్పోర్ట్కు బాంబు బెదిరింపు.. ఆ విమానమే టార్గెట్ అంటూ..
ఢిల్లీలో సోమవారం కూడా తేలికపాటి వర్షం కురిసింది. అక్కడ ప్రస్తుతం గరిష్ట ఉష్ణోగ్రత 35 డిగ్రీల సెల్సియస్ , కనిష్ట ఉష్ణోగ్రత 27 డిగ్రీల సెల్సియస్గా ఉండి ఆకాశం మేఘావృతమై చిరుజల్లులు పడే అవకాశం ఉంది. నేటి నుండి జూలై 22 వరకు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. నిజానికి భారీ వర్షాల కారణంగా దేశంలోని అనేక నదులు ఉప్పొంగుతున్నాయి. ప్రధానంగా గంగా యమునా ఇందులో చాలా విధ్వంసం సృష్టించింది. దీంతో ఉత్తర భారతదేశంలోని పలు రాష్ట్రాలు వరదల బారిన పడ్డాయి. మీడియా కథనాల ప్రకారం ఉత్తరాఖండ్లోని నాలుగు జిల్లాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించారు. దీనితో పాటు బద్రీనాథ్ హైవేతో సహా అనేక రహదారులు మూసివేశారు. ఉత్తరాఖండ్లోని ఉధమ్సింగ్ నగర్, నైనిటాల్, చంపావత్, అల్మోరా, బాగేశ్వర్, పితోర్గఢ్ జిల్లాలకు నేటికీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ.. ‘ఆరెంజ్ అలర్ట్’ జారీ చేసింది.
Read Also:Shankar : ఇండియన్ 2 సినిమా కోసం సరికొత్త ప్రయోగం చేయబోతున్న దర్శకుడు శంకర్..?
అంతేకాకుండా రాజస్థాన్లోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని IMD హెచ్చరిక జారీ చేసింది. మరోవైపు ఢిల్లీలో బీభత్సం సృష్టించిన యమునా నది ఉత్తరప్రదేశ్లోని 11 జిల్లాల్లోనూ బీభత్సం సృష్టించింది. మరోవైపు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఇది కాకుండా, హిమాచల్ ప్రదేశ్లోని ప్రపంచ ప్రసిద్ధ పర్యాటక కేంద్రమైన కులు-మనాలిలో వరదలు బీభత్సం సృష్టించాయి. కులు – మనాలి మధ్య NH నీటి కారణంగా బాగా దెబ్బతింది. దీంతో పాటు వ్యాస్ నదిపై నిర్మించిన పలు వంతెనలు కూడా వరదలో కొట్టుకుపోయాయి.
తాజావార్తలు
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
PBKS Captain Shreyas Iyer: చాలా బాధగా ఉంది.. మా విజయాన్ని ఆ ‘ఒక్కడు’ లాగేసుకున్నాడు!
-
Google Free Storage: గూగుల్ షాకింగ్ డెసిషన్.. ఫ్రీ స్టోరేజ్లో భారీ మార్పు.. కొత్త అకౌంట్లకు 5GB మాత్రమే!
-
Kerala: “ఇక కేరళలో చట్టాలను నిర్ణయించేది మేమే”.. ఊరేగింపులో రెచ్చిపోయిన ముస్లిం లీగ్ నేతలు..
-
RRB ALP Recruitment 2026: 11,127 అసిస్టెంట్ లోకో పైలట్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ రిలీజ్.. ఈ అర్హతలుండాలి
ట్రెండింగ్
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!
-
WhatsAppలో ‘Incognito AI Chat’.. యూజర్లకు మెటా బిగ్ అప్డేట్.!