Delhi Weather: ఢిల్లీలో మరో నాలుగు రోజులు వర్షాలు.. ఉగ్రరూపం దాల్చనున్న యమునా నది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Delhi Weather: దేశ రాజధాని ఢిల్లీ ఇటీవల వర్షాలకు అతలాకుతలం అయిపోతుంది. యమునా నది నీటిమట్టం తగ్గుముఖం పట్టడంతో ఢిల్లీ జనజీవనం మెల్లగా తిరిగి పట్టాలపైకి వస్తోంది. అయితే గత 24 గంటల్లో మరోసారి వరద ఢిల్లీ వాసుల ఆందోళనను మరింత పెంచింది. దీంతో పాటు నేడు (మంగళవారం), జూలై 19వ తేదీల్లో ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ (ఐఎండీ) హెచ్చరికలు జారీ చేసింది. దీంతో యమునా నీటి ఉధృతి, వర్షాల కారణంగా ఢిల్లీ కష్టాలు మరోసారి పెరిగే చాన్స్ ఉంది.
Read Also:Vijay Sethupathi : షారుఖ్ ఖాన్ కోసం జవాన్ సినిమాలో నటించాను
Also Read
- Online Shopping: ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నారా..? కొత్త రూల్స్ వచ్చేస్తున్నాయ్.. కేంద్రం కీలక నిర్ణయం..
- Saudi-Europe: యూరప్కు సౌదీ బిగ్ షాక్.. చమురు నిలిపిపోయే అవకాశం
- Macron: యూరప్లో ఇంధన ధరలు మంటలు.. త్వరలో G7 దేశాల సమావేశం
- Air India: ఖర్చులు తగ్గించేందుకు కీలక నిర్ణయం.. ఎయిరిండియా కొత్త సీఈవో సూపర్ ప్లాన్!
ఢిల్లీలో సోమవారం కూడా తేలికపాటి వర్షం కురిసింది. అక్కడ ప్రస్తుతం గరిష్ట ఉష్ణోగ్రత 35 డిగ్రీల సెల్సియస్ , కనిష్ట ఉష్ణోగ్రత 27 డిగ్రీల సెల్సియస్గా ఉండి ఆకాశం మేఘావృతమై చిరుజల్లులు పడే అవకాశం ఉంది. నేటి నుండి జూలై 22 వరకు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. నిజానికి భారీ వర్షాల కారణంగా దేశంలోని అనేక నదులు ఉప్పొంగుతున్నాయి. ప్రధానంగా గంగా యమునా ఇందులో చాలా విధ్వంసం సృష్టించింది. దీంతో ఉత్తర భారతదేశంలోని పలు రాష్ట్రాలు వరదల బారిన పడ్డాయి. మీడియా కథనాల ప్రకారం ఉత్తరాఖండ్లోని నాలుగు జిల్లాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించారు. దీనితో పాటు బద్రీనాథ్ హైవేతో సహా అనేక రహదారులు మూసివేశారు. ఉత్తరాఖండ్లోని ఉధమ్సింగ్ నగర్, నైనిటాల్, చంపావత్, అల్మోరా, బాగేశ్వర్, పితోర్గఢ్ జిల్లాలకు నేటికీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ.. ‘ఆరెంజ్ అలర్ట్’ జారీ చేసింది.
Read Also:Shankar : ఇండియన్ 2 సినిమా కోసం సరికొత్త ప్రయోగం చేయబోతున్న దర్శకుడు శంకర్..?
అంతేకాకుండా రాజస్థాన్లోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని IMD హెచ్చరిక జారీ చేసింది. మరోవైపు ఢిల్లీలో బీభత్సం సృష్టించిన యమునా నది ఉత్తరప్రదేశ్లోని 11 జిల్లాల్లోనూ బీభత్సం సృష్టించింది. మరోవైపు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఇది కాకుండా, హిమాచల్ ప్రదేశ్లోని ప్రపంచ ప్రసిద్ధ పర్యాటక కేంద్రమైన కులు-మనాలిలో వరదలు బీభత్సం సృష్టించాయి. కులు – మనాలి మధ్య NH నీటి కారణంగా బాగా దెబ్బతింది. దీంతో పాటు వ్యాస్ నదిపై నిర్మించిన పలు వంతెనలు కూడా వరదలో కొట్టుకుపోయాయి.
తాజావార్తలు
-
OTR: దానం నాగేందర్ పై వేటు..మిగతా 9 మంది ఎమ్మెల్యేల సంగతేంటి ..?
-
Botsa Anusha: భీమిలి YSRCP నియోజకవర్గ సమన్వయకర్తగా బొత్స అనూష
-
Old Currency: కాజీపేటలో పాత నోట్ల కలకలం.. రూ.1.38 కోట్ల కరెన్సీతో 8 మంది అరెస్ట్!
-
Bhatti Vikramarka : ఎల్నినో ఎఫెక్ట్.. తెలంగాణలో ముందస్తు ప్లాన్
-
Online Shopping: ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నారా..? కొత్త రూల్స్ వచ్చేస్తున్నాయ్.. కేంద్రం కీలక నిర్ణయం..
ట్రెండింగ్
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్పై భారత్ ఘన విజయం.. సెమీస్కు దూసుకెళ్లిన హర్మన్సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..