ఇప్పటికే ఏపీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. నైరుతి రుతుపవనాల ప్రభావంతో అన్ని జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. అయితే నేడు, రేపు పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఏపీ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఏజెన్సీ పలు జిల్లాలకు వర్ష హెచ్చరికలు జారీ చేసింది. శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, పశ్చిమగోదావరి, కోనసీమ, తూర్పుగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, బాపట్ల, చిత్తూరు, అన్నమయ్య జిల్లాల్లో ఆదివారం తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. . విజయనగరం, అనకాపల్లి, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, శ్రీ సత్యసాయి, అనంతపురం, నంద్యాల జిల్లాల్లో చిరుజల్లులు పడే అవకాశం ఉందని పేర్కొంది.
సోమవారం శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, కృష్ణా, బాపట్ల, చిత్తూరు, అన్నమయ జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయి. విశాఖపట్నం, అనకాపల్లి, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కోనసీమ, ఏలూరు, నంద్యాల, వైఎస్ఆర్, తిరుపతి, నెల్లూరు, ప్రకాశం. , పల్నాడు. అనకాపల్లి, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని విపత్తు నిర్వహణ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.
కాగా, ఏపీలో కురుస్తున్న వర్షాల కారణంగా ఉష్ణోగ్రతలు భారీగా పడిపోయాయి. గరిష్ఠ ఉష్ణోగ్రతలు 37 డిగ్రీల కంటే తక్కువగా నమోదవుతున్నాయి. బాపట్లో గరిష్టం 34.4, కనిష్టంగా 25 డిగ్రీల సెల్సియస్, గరిష్టంగా 32.3, కాకినాడలో కనిష్టంగా 25.5, గరిష్టంగా 33.2, కనిష్టంగా 26.6 డిగ్రీల సెల్సియస్, కళింగపట్నంలో గరిష్టంగా 36.7, కనిష్టంగా 28.5, కావలిలో 28.5, కనిష్టంగా 23.5 డిగ్రీలు దిగమ గరిష్టంగా 34.6, కనిష్టంగా 27, నర్సాపూర్లో 33, కనిష్టంగా 23.6, నెల్లూరులో 36.5, కనిష్టంగా 27.5, ఒంగోలులో గరిష్టంగా 34.2, కనిష్టంగా 27.8 డిగ్రీల సెల్సియస్ నమోదైంది.