TG Rains: వరద బీభత్సం.. ఊరు చెరువైంది.. రైల్వే ట్రాక్ కొట్టుకుపోయింది
- ఊరు చెరువైంది
- రైల్వే ట్రాక్ కొట్టుకుపోయింది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా తెలంగాణలో కుండపోత వానలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేని వర్షాలతో బారీ వరదలు సంభవిస్తున్నాయి. కాలనీల్లోని రోడ్లు ఏరులైపారుతున్నాయి. ఊర్లు చెరువులను తలపిస్తున్నాయి. జనజీవనం అస్తవ్యస్తమైపోయింది. రహదారులు కొట్టుకుపోవడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ముఖ్యంగా మెదక్, కామారెడ్డిలో వరుణుడు బీభత్సం సృష్టిస్తున్నాడు. హావేలిఘనపూర్ మండలంలో వర్షం వణికించింది. ధూప్ సింగ్ తండా, తిమ్మాయిపల్లి, నాగపూర్, వాడి గ్రామాలను వరద ముంచెత్తింది. ఇండ్లలో నీళ్లు చేరి గ్రామాల్లో రోడ్లపై నుంచి ఉదృతంగా ప్రవహిస్తోంది వరద. పిల్లికొట్టాల్ లో నీట మునిగిన సబ్ స్టేషన్.. మెదక్ జిల్లా కేంద్రానికి కరెంట్ సరఫరా నిలిపివేత.. మెదక్ జిల్లా కేంద్రాన్ని వాన ముంచెత్తింది. హవేలీ ఘనపూర్ (మం) నాగపూర్ వాగులో కారు కొట్టుకుపోయింది. కారులో నలుగురు ఉండొచ్చని స్థానికుల అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
Also Read:CP Radhakrishnan: తిరుచానూరు పద్మావతి అమ్మవారిని దర్శించుకున్న సీపీ రాధాకృష్ణన్
Also Read
- Maoists Surrender : జార్ఖండ్లో మావోయిస్టులకు భారీ దెబ్బ.. ఒకేసారి 27 మంది లొంగుబాటు..!
- Shubman Gill: 36 పరుగులతో చరిత్ర స్పష్టించిన శుభ్మన్ గిల్.. కెరీర్లోనే అరుదైన రికార్డు..
- UP: అత్తగారి అంత్యక్రియల్లో ఘోరం.. నదిలో చేతులు కడుక్కుంటుండగా భారీ మొసలి హఠాత్తుగా..!
- Cockroach Janta Party: "కాక్రోచ్ జనతా పార్టీ" ఫాలోవర్లు అంతా పాకిస్తాన్, బంగ్లాదేశ్ వాళ్లేనా..?
కామారెడ్డి లో కుండ పోత వర్షం కురిసింది. పలు కాలనీలు నీట మునిగాయి. టెక్రియాల్ వద్ద డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు జల దిగ్బంధం లో చిక్కుకున్నాయి.. వాగులో చిక్కిన వారి కోసం.. హెలికాప్టర్ పంపించాలని ప్రభుత్వాన్ని కోరాడు ఎం.ఎల్. ఏ. మదన్ మోహన్ రావు. బిక్కనూరు మండలం తలమట్ల వద్ద రైలు పట్టాల పై నుంచి వరద ఉదృతంగా ప్రవహిస్తోంది. వరద నీటికి రైల్వే ట్రాక్ కొట్టుకుపోయింది. పట్టాలు నీటిపై తేలియాడుతున్నాయి. అప్రమత్తమైన రైల్వే అధికారులు.. నిజమాబాద్ -సికింద్రాబాద్ రూట్ లో రైళ్ల రాకపోకలను నిలిపివేశారు. కామారెడ్డి – హైదరాబాద్ జాతీయ రహదారి పై నుంచి వరద నీరు ప్రవహిస్తుండటం తో మూసివేశారు.
Also Read:Ganesh Chaturthi 2025: గణేష్ పండుగ భారత్ లోనే కాదు.. ఈ దేశాల్లో కూడా జరుపుకుంటారు తెలుసా?
రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం నర్మాల గ్రామానికి చెందిన పంపుకాడి నాగయ్య బర్లను మేపేందుకు వెళ్లి వాగులో గల్లంతయ్యాడు. మానేరు వాగులో గల్లంతయ్యాడు. పోలీసులకు సమాచారం అందించడంతో గాలింపు చర్యలు చేపట్టారు. వర్షాలు ఎక్కువగా కురుస్తున్న కామారెడ్డి, మెదక్ జిల్లాల కలెక్టర్లను ముఖ్యమంత్రి రేవంత్ అలర్ట్ చేశారు. వెంటనే అక్కడ అవసరమైన సహాయక చర్యలు చేపట్టాలని, ఎలాంటి విపత్కర పరిస్థితులు వచ్చినా ఎదుర్కునేందుకు అన్ని విభాగాల అధికారులు సిద్ధంగా ఉండాలని, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాల సాయం తీసుకోవాలని సీఎస్ కు ఆదేశాలు జారీ చేశారు.
తాజావార్తలు
-
GT vs CSK : గుజరాత్ టైటాన్స్ ఘన విజయం.. టాప్లో GT.. CSK అవుట్..!
-
OTR : TPCC కి కొత్త హంగులు రాబోతున్నాయా..?
-
Maoists Surrender : జార్ఖండ్లో మావోయిస్టులకు భారీ దెబ్బ.. ఒకేసారి 27 మంది లొంగుబాటు..!
-
Storyboard : ఏపీలో కూటమి పాలన ఎలా ఉంది..? సూపర్ సిక్స్ హామీల స్థితిగతులేంటి..?
-
Off The Record : కోనసీమ జిల్లా వైసీపీలో అసంతృప్తి రాగాలు
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!