Railway Rules: రైలులో ఈ వస్తువులను తీసుకెళ్లలేరు.. తీసుకెళ్తే జరిమానా, జైలు శిక్ష తప్పదు సుమీ
- రైలులో కొన్ని వస్తువులను తీసుకెళ్లలేరు..
- తీసుకెళ్తే జరిమానా
- జరిమాణతోపాటు జైలు శిక్ష.
Railway Rules: దీపావళి పండుగ సమీపిస్తున్న సమయంలో ప్రజలు వారి ఇళ్లకు వెళ్లడం చేస్తుంటారు. దీని కారణంగా రైళ్లలో భారీ రద్దీ కనిపిస్తోంది. రైల్వే నిబంధనల ప్రకారం.. ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకుని రైలులో పటాకులు, పేలుడు సంభవించే వంటి వస్తువులను తీసుకెళ్లడంపై కఠిన నిషేధం ఉంది. ఈ నిబంధనల ప్రకారం రైలులో ప్రయాణికులు ఎలాంటి పటాకులను తీసుకెళ్లకూడదు. నిషేధిత వస్తువులతో ప్రయాణిస్తున్నట్లు తేలితే, అతను రైల్వే చట్టంలోని సెక్షన్ 164 ప్రకారం చర్య తీసుకోవలసి ఉంటుంది. దీని కింద రూ. 1,000 జరిమానా లేదా మూడేళ్ల వరకు జైలు శిక్ష లేదా రెండూ విధించవచ్చు. కాబట్టి మీరు నివసిస్తున్న చోట పటాకులు మరియు స్పార్క్లర్లు చౌకగా లభిస్తే.. దీపావళికి వాటిని ఇంటికి తీసుకెళ్లాలని మీరు అనుకుంటే మీ ప్లాన్ను వదిలివేయండి. రైలులో నిషేధిత వస్తువులతో పట్టుబడితే పెద్ద చిక్కుల్లో పడవచ్చు. ప్రతిసారీ భారతీయ రైల్వే కూడా పటాకులతో ప్రయాణించవద్దని పదే పదే ప్రయాణికులకు విజ్ఞప్తి చేస్తోంది.
CM Chandrababu: విద్యార్థినిపై దాడి కలచివేసింది.. కడప ఘటనపై స్పందించిన సీఎం చంద్రబాబు
Also Read
- Navjot Kaur Sidhu: రాఘవ్ చద్దా బీజేపీలో చేరడానికి ప్రియాంక చోప్రానే కారణం.. అసలు కథ ఇదేనా?
- యష్ ‘టాక్సిక్’కు ఓటీటీ టెన్షన్..
- Mahabubabad: దారుణం.. ఇద్దరు కుమారులకు ఉరేసి, తానూ ఆత్మహత్య చేసుకున్న తండ్రి..
- Ashwini Vaishnaw: విశాఖపట్నం ఇక ఏఐపట్నం.. దక్షిణాది రాష్ట్రాలకు పూర్తి న్యాయం.. అమరావతి నుంచి త్వరలోనే బుల్లెట్ ట్రైన్..
భారతీయ రైల్వే నిబంధనల ప్రకారం, ప్రయాణ సమయంలో ఒక ప్రయాణీకుడు ఏదైనా నిషేధిత వస్తువులను తీసుకువెళితే, అతనిపై రైల్వే చట్టంలోని సెక్షన్ 164 ప్రకారం చర్య తీసుకోవచ్చు. ఈ సెక్షన్ కింద వ్యక్తికి రూ. 1000 జరిమానా లేదా మూడేళ్ల జైలు శిక్ష లేదా రెండూ విధించవచ్చు. పటాకులు నిషేధిత వస్తువుల కేటగిరీ కిందకు వస్తాయి కాబట్టి, రైలులో వీటిని పట్టుకుంటే మీరు శిక్షకు గురవుతారు. రైలు ప్రయాణీకుల భద్రతకు హాని కలిగించే అనేక వస్తువులను రైలులో తీసుకెళ్లడాన్ని రైల్వే నిషేధించింది. ఇవి రైలులో అగ్ని ప్రమాదాన్ని కలిగిస్తాయి. రైలును మురికిగా మార్చడం, ప్రయాణీకులకు అసౌకర్యం కలిగించడం ఇంకా రైలు ప్రమాదానికి కారణమవుతాయి.
India vs New Zealand: కరుణించని వరణుడు.. టీమిండియా ఓటమి
స్టవ్లు, గ్యాస్ సిలిండర్లు, కొన్ని రకాల మండే రసాయనాలు, బాణసంచా, యాసిడ్, దుర్వాసన వచ్చే వస్తువులు, తోలు లేదా తడి తొక్కలు, ప్యాకేజ్లలో తెచ్చిన నూనె లేదా గ్రీజు, విరిగిపోయే లేదా లీక్ అయ్యే వస్తువులు ఇలా ప్రయాణికులకు నష్టం కలిగించే వస్తువులు రైలు ప్రయాణ సమయంలో నిషేధించబడ్డాయి. రైల్వే నిబంధనల ప్రకారం రైలులో ప్రయాణికులు 20 కిలోల వరకు నెయ్యి తీసుకెళ్లవచ్చు. అయితే నెయ్యిని సరిగ్గా టిన్ బాక్స్లో ప్యాక్ చేయాలి.
తాజావార్తలు
-
Navjot Kaur Sidhu: రాఘవ్ చద్దా బీజేపీలో చేరడానికి ప్రియాంక చోప్రానే కారణం.. అసలు కథ ఇదేనా?
-
యష్ ‘టాక్సిక్’కు ఓటీటీ టెన్షన్..
-
Mahabubabad: దారుణం.. ఇద్దరు కుమారులకు ఉరేసి, తానూ ఆత్మహత్య చేసుకున్న తండ్రి..
-
Ashwini Vaishnaw: విశాఖపట్నం ఇక ఏఐపట్నం.. దక్షిణాది రాష్ట్రాలకు పూర్తి న్యాయం.. అమరావతి నుంచి త్వరలోనే బుల్లెట్ ట్రైన్..
-
Mumbai: దారుణం.. కల్మా పఠించలేదని ఇద్దరు సెక్యూరిటీ గార్డులపై దాడి.. రంగంలోకి ఏటీఎస్
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!