Rahul Gandhi: దేశం చక్రవ్యూహంలో చిక్కుకుపోయింది.. రాహుల్ సంచలన వ్యాఖ్యలు
- దేశంలో భయానక వాతావరణం నెలకొందన్న రాహుల్
- మహాభారతం ద్వారా బీజేపీనీ టార్గెట్ చేసిన విపక్షనేత
- మోడీపై సంచలన వ్యాఖ్యలు
దేశంలో భయానక వాతావరణం నెలకొందని రాహుల్ గాంధీ అన్నారు. మహాభారతం ద్వారా రాహుల్ గాంధీ బీజేపీని టార్గెట్ చేశారు. చక్రవ్యూహాన్ని ప్రస్తావిస్తూ రాహుల్ గాంధీ ప్రధాని మోడీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. చక్రవ్యూహంలో దేశంలోని ఆరు వర్గాలు చిక్కుకున్నాయని రాహుల్ గాంధీ అన్నారు. దేశం మొత్తం చక్రవ్యూహంలో చిక్కుకుపోయిందని సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్లమెంట్లో ప్రసంగంచిన ఆయన ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. అభిమన్యుడు ఏ చక్రవ్యూహంలో చిక్కుకున్నాడో అదే చక్రవ్యూహంలో భారతదేశ ప్రజల చిక్కుకున్నారన్నారు. “మహాభారత చక్రవ్యూహాన్ని ద్రోణాచార్యుడు, కర్ణుడు, కృపాచార్యుడు, కృతవర్మ, అశ్వర్థామ, శకుని 6 మంది నియంత్రించారు. నేటికీ 6 మంది దీనిని నియంత్రిస్తున్నారు. ఇందులో నరేంద్ర మోడీ , అమిత్ షా, మోహన్ భగవత్, అజిత్ దోవల్, అంబానీ, అదానీ ఉన్నారు.” అని వ్యాఖ్యానించారు.
READ MORE:SAPTA JYOTIRLINGA DARSHAN YATRA: భక్తులకు శుభవార్త.. ఐఆర్సిటిసి భారత్ గౌరవ్ ప్రత్యేక రైలు..
Also Read
‘మంత్రులు, రైతులు, ఓటర్లు అందరూ భయపడుతున్నారు..
రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. నేడు మంత్రులు, రైతులు, ఓటర్లు, కార్మికులు అందరూ భయపడుతున్నారన్నారు. “నేను దాని గురించి చాలా ఆలోచించాను. నేను సమాధానం కోసం ప్రతిపాదిస్తున్నాను. వేల సంవత్సరాల క్రితం, హర్యానాలోని కురుక్షేత్రలో చక్రవ్యూహంలో యువకుడైన అభిమన్యుడిని ట్రాప్ చేసి చంపారు. చక్రవ్యూహం లోపల భయం, హింస కారణంగానే చక్రవ్యూహంలో చిక్కుకుని చంపబడ్డాడు. చక్రవ్యూహం గురించి నేను కొంత పరిశోధన చేశాను. దాని రెండవ నామపద్మ వ్యూహం కమలం ఆకారంలో ఉందని తెలుసుకున్నాను. 21 శతాబ్ధంంలో కొత్త చక్రవ్యూహం వచ్చింది. ఇది కమలం ఆకారంలో కూడా ఉంది. ప్రధాని ఆ కమలం చిహ్నాన్ని ఛాతీపై ధరించారు. అని రాహుల్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
READ MORE: SAPTA JYOTIRLINGA DARSHAN YATRA: భక్తులకు శుభవార్త.. ఐఆర్సిటిసి భారత్ గౌరవ్ ప్రత్యేక రైలు..
ఆస్తి హక్కులపై ప్రశ్న..
దేశంలోని మొత్తం ఆస్తిని సొంతం చేసుకునే హక్కు ఎవరికీ లేదని రాహుల్ గాంధీ అన్నారు. ఆర్థిక శక్తి, సంస్థలు, ఏజెన్సీలు, సీబీఐ, ఈడీ, ఆదాయపు పన్ను, మూడో రాజకీయ కార్యనిర్వాహక వ్యవస్థ ఈ చిట్టడవికి గుండెకాయ అని అన్నారు. ఈ చక్రవ్యూహాన్ని ఈ బడ్జెట్ నిర్వీర్యం చేస్తుందనేదే నా ఆశ అన్నారు. రైతుకు, కూలీలకు అండగా ఉంటానని తెలిపారు.
తాజావార్తలు
-
Toes Writing: నిరాశకు లొంగని ధైర్యం.. చేతులు లేకపోయినా సాటిలేని ప్రతిభ.. కాళ్లతో రాసి ఫస్ట్ డివిజన్ సాధించిన శివాని
-
What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
-
Jananayagan : జననాయగన్ రిలీజ్ పై నేడు సెన్సార్ బోర్డు ఫైనల్ డెసిషన్.. రెండు డేట్స్ లాక్ చేసిన మేకర్స్
-
Israel-Lebanon: లెబనాన్పై ఇజ్రాయెల్ దాడులు.. 14 మంది మృతి
-
BRS 26th Foundation Day: 25 ఏళ్ల ప్రయాణం.. 26వ వసంతంలోకి బీఆర్ఎస్
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!