దేశంలో భయానక వాతావరణం నెలకొందని రాహుల్ గాంధీ అన్నారు. మహాభారతం ద్వారా రాహుల్ గాంధీ బీజేపీని టార్గెట్ చేశారు. చక్రవ్యూహాన్ని ప్రస్తావిస్తూ రాహుల్ గాంధీ ప్రధాని మోడీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. చక్రవ్యూహంలో దేశంలోని ఆరు వర్గాలు చిక్కుకున్నాయని రాహుల్ గాంధీ అన్నారు. దేశం మొత్తం చక్రవ్యూహంలో చిక్కుకుపోయిందని సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్లమెంట్లో ప్రసంగంచిన ఆయన ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. అభిమన్యుడు ఏ చక్రవ్యూహంలో చిక్కుకున్నాడో అదే చక్రవ్యూహంలో భారతదేశ ప్రజల చిక్కుకున్నారన్నారు. “మహాభారత చక్రవ్యూహాన్ని ద్రోణాచార్యుడు, కర్ణుడు, కృపాచార్యుడు, కృతవర్మ, అశ్వర్థామ, శకుని 6 మంది నియంత్రించారు. నేటికీ 6 మంది దీనిని నియంత్రిస్తున్నారు. ఇందులో నరేంద్ర మోడీ , అమిత్ షా, మోహన్ భగవత్, అజిత్ దోవల్, అంబానీ, అదానీ ఉన్నారు.” అని వ్యాఖ్యానించారు.
READ MORE:SAPTA JYOTIRLINGA DARSHAN YATRA: భక్తులకు శుభవార్త.. ఐఆర్సిటిసి భారత్ గౌరవ్ ప్రత్యేక రైలు..
‘మంత్రులు, రైతులు, ఓటర్లు అందరూ భయపడుతున్నారు..
రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. నేడు మంత్రులు, రైతులు, ఓటర్లు, కార్మికులు అందరూ భయపడుతున్నారన్నారు. “నేను దాని గురించి చాలా ఆలోచించాను. నేను సమాధానం కోసం ప్రతిపాదిస్తున్నాను. వేల సంవత్సరాల క్రితం, హర్యానాలోని కురుక్షేత్రలో చక్రవ్యూహంలో యువకుడైన అభిమన్యుడిని ట్రాప్ చేసి చంపారు. చక్రవ్యూహం లోపల భయం, హింస కారణంగానే చక్రవ్యూహంలో చిక్కుకుని చంపబడ్డాడు. చక్రవ్యూహం గురించి నేను కొంత పరిశోధన చేశాను. దాని రెండవ నామపద్మ వ్యూహం కమలం ఆకారంలో ఉందని తెలుసుకున్నాను. 21 శతాబ్ధంంలో కొత్త చక్రవ్యూహం వచ్చింది. ఇది కమలం ఆకారంలో కూడా ఉంది. ప్రధాని ఆ కమలం చిహ్నాన్ని ఛాతీపై ధరించారు. అని రాహుల్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
READ MORE: SAPTA JYOTIRLINGA DARSHAN YATRA: భక్తులకు శుభవార్త.. ఐఆర్సిటిసి భారత్ గౌరవ్ ప్రత్యేక రైలు..
ఆస్తి హక్కులపై ప్రశ్న..
దేశంలోని మొత్తం ఆస్తిని సొంతం చేసుకునే హక్కు ఎవరికీ లేదని రాహుల్ గాంధీ అన్నారు. ఆర్థిక శక్తి, సంస్థలు, ఏజెన్సీలు, సీబీఐ, ఈడీ, ఆదాయపు పన్ను, మూడో రాజకీయ కార్యనిర్వాహక వ్యవస్థ ఈ చిట్టడవికి గుండెకాయ అని అన్నారు. ఈ చక్రవ్యూహాన్ని ఈ బడ్జెట్ నిర్వీర్యం చేస్తుందనేదే నా ఆశ అన్నారు. రైతుకు, కూలీలకు అండగా ఉంటానని తెలిపారు.