South Central Railway: సికింద్రాబాద్ నుంచి తక్కువ టైమ్ లో గుంటూరు, విజయవాడకు వెళ్లొచ్చు..
- తగ్గుతున్న సికింద్రాబాద్ నుంచి గుంటూరు- విజయవాడకు ప్రయాణ సమయం..
- గుంటూరుకు మూడు గంటలు- విజయవాడకు మూడున్నర గంటలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
South Central Railway: రైల్వేల అభివృద్ధికి ప్రధాని నరేంద్ర మోడీ ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. దేశవ్యాప్తంగా అన్ని రైల్వే లైన్ల ఆధునీకరణతో పాటు సింగిల్ లైన్ రూట్లను డబుల్ లైన్లుగా, డబుల్ లైన్ రూట్లను ట్రిపుల్ లైన్లుగా మార్చేందుకు పనులను చేపట్టారు. ప్రధాన నగరాల్లోని అన్ని రైల్వే స్టేషన్లను విమానాశ్రయాల తరహాలో తీర్చిదిద్దుతున్నారు. వందే భారత్ రైళ్లను సెమీ-హై స్పీడ్ రైళ్లుగా కూడా ప్రవేశపెట్టి.. ప్రయాణాన్ని మరింత ఆనందదాయకంగా చేయాలనే ఉద్దేశ్యంతో తక్కువ సమయంలో ఎక్కువ దూరం ప్రయాణించేవిధంగా చేశారు. కాగా.. దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని గుంటూరు-సికింద్రాబాద్ మార్గం చాలా కీలకంగా మారింది. సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం, తిరుపతి, చెన్నైలకు వెళ్లే రైలు మార్గాలకు ఇది ప్రత్యామ్నాయం. రైళ్ల రాకపోకలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. దీంతో ఇప్పటి వరకు సింగిల్ లైన్ గా ఉన్న గుంటూరు-బీబీనగర్ మార్గాన్ని డబుల్ లైన్ గా విస్తరిస్తున్నారు.
Read also: CM Revanth Reddy: ఆగస్టు 1, 2న బీఆర్ఎస్ పదేళ్ల పాలనపై చర్చకు సిద్ధం..
Also Read
- Ebola Virus : గాంధీ ఆసుపత్రిలో సుడాన్ వ్యక్తికి ‘ఎబోలా’ నెగిటివ్.. ఊపిరి పీల్చుకున్న వైద్యులు
- Indiramma House: మోడ్రన్ టెక్నాలజీ వచ్చేసింది.. 12 రోజుల్లోనే ఇందిరమ్మ ఇంటి నిర్మాణం..
- CM Revanth Reddy : కేసీఆర్ చర్చకు అసెంబ్లీకి రా.. పాలమూరును బొందపెట్టింది నువ్వే
- Spa Center Raids : స్పా సెంటర్ల ముసుగులో గలీజ్ దందా.. 113 చోట్ల పోలీసుల మెగా రైడ్స్!
దీంతో సికింద్రాబాద్ నుంచి గుంటూరు, విజయవాడకు ప్రయాణ సమయం తగ్గుతోంది. సికింద్రాబాద్ నుంచి గుంటూరుకు మూడు గంటల్లో, విజయవాడకు మూడున్నర గంటల్లో చేరుకోవచ్చు. డబుల్ లైన్ పనులు చేపట్టేందుకు గుంటూరు జిల్లాల్లో భూమి అవసరం కావడంతో రైల్వే శాఖ భూసేకరణకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇప్పటికే రైల్వేలైన్ సమీపంలో భూములు ఉన్నా.. మరికొన్ని అవసరం కావడంతో అధికారులు నిర్ణయం తీసుకున్నారు. తాడికొండ మండలం బండారుపల్లిలో 9.099 ఎకరాలు, గుంటూరు పశ్చిమ మండలం చినపలకలూరులో 9.463 ఎకరాలు, మేడికొండూరు మండలం సిరిపురంలో 15.809 ఎకరాలు, అదే మండలం మండపాడులో 7.35 ఎకరాలు, విశాలాలలో పది సెంట్లు, నల్లపాడులో 5.958 ఎకరాలు. అభ్యంతరాలను నెల రోజుల్లోగా గుంటూరు ఆర్డీఓకు సమర్పించాలని నోటిఫికేషన్లో పేర్కొన్నారు. గుంటూరు ఆర్డీఓ కార్యాలయం కాంపిటెంట్ అథారిటీ. రెండేళ్లలో ఈ ప్రాజెక్టును పూర్తి చేసి ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకురావాలని దక్షిణ మధ్య రైల్వే లక్ష్యంగా పెట్టుకుంది.
Revanth Reddy Vs Jagadish Reddy: అసెంబ్లీలో రేవంత్ రెడ్డి, జగదీష్ రెడ్డిల మధ్య డైలాగ్ వార్..
తాజావార్తలు
-
Ebola Virus : గాంధీ ఆసుపత్రిలో సుడాన్ వ్యక్తికి ‘ఎబోలా’ నెగిటివ్.. ఊపిరి పీల్చుకున్న వైద్యులు
-
Shreyas Iyer: చరిత్రను లిఖించనున్న శ్రేయస్ అయ్యర్.. 2028 వరకు కెప్టెన్గా సర్పంచ్ సాబ్..
-
Hyderabad: బంధాల్ని తెంచుతున్న వివాహేతర సంబంధాలు.. తెలుగు రాష్ట్రాల్లో కలకలం
-
NTR Viral Tweet: కుకీలు పంపమన్న అభిమాని.. ఎన్టీఆర్ క్రేజీ రిప్లై ట్వీట్ వైరల్!
-
Natural gas: భారత్కు జాక్పాట్.. అండమాన్లో గ్యాస్ నిల్వలు..
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!