South Central Railway: సికింద్రాబాద్ నుంచి తక్కువ టైమ్ లో గుంటూరు, విజయవాడకు వెళ్లొచ్చు..
- తగ్గుతున్న సికింద్రాబాద్ నుంచి గుంటూరు- విజయవాడకు ప్రయాణ సమయం..
- గుంటూరుకు మూడు గంటలు- విజయవాడకు మూడున్నర గంటలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
South Central Railway: రైల్వేల అభివృద్ధికి ప్రధాని నరేంద్ర మోడీ ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. దేశవ్యాప్తంగా అన్ని రైల్వే లైన్ల ఆధునీకరణతో పాటు సింగిల్ లైన్ రూట్లను డబుల్ లైన్లుగా, డబుల్ లైన్ రూట్లను ట్రిపుల్ లైన్లుగా మార్చేందుకు పనులను చేపట్టారు. ప్రధాన నగరాల్లోని అన్ని రైల్వే స్టేషన్లను విమానాశ్రయాల తరహాలో తీర్చిదిద్దుతున్నారు. వందే భారత్ రైళ్లను సెమీ-హై స్పీడ్ రైళ్లుగా కూడా ప్రవేశపెట్టి.. ప్రయాణాన్ని మరింత ఆనందదాయకంగా చేయాలనే ఉద్దేశ్యంతో తక్కువ సమయంలో ఎక్కువ దూరం ప్రయాణించేవిధంగా చేశారు. కాగా.. దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని గుంటూరు-సికింద్రాబాద్ మార్గం చాలా కీలకంగా మారింది. సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం, తిరుపతి, చెన్నైలకు వెళ్లే రైలు మార్గాలకు ఇది ప్రత్యామ్నాయం. రైళ్ల రాకపోకలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. దీంతో ఇప్పటి వరకు సింగిల్ లైన్ గా ఉన్న గుంటూరు-బీబీనగర్ మార్గాన్ని డబుల్ లైన్ గా విస్తరిస్తున్నారు.
Read also: CM Revanth Reddy: ఆగస్టు 1, 2న బీఆర్ఎస్ పదేళ్ల పాలనపై చర్చకు సిద్ధం..
Also Read
- Hyderabad: ప్రేమిస్తున్న యువకుడు మాట్లాడటం లేదని మనస్తాపం.. మైనర్ బాలిక ఆత్మహత్య.!
- Minor Girl Harassment: 9 ఏళ్ల బాలికతో అసభ్య ప్రవర్తన.. నిందితుడిపై దాడి, ఆస్పత్రిలో మృతి
- CM Revanth Reddy : సీఎం రేవంత్ బిగ్ ప్లాన్.. స్పోర్ట్స్ యూనివర్సిటీ, గచ్చిబౌలి మేకోవర్.!
- Local Governance : గ్రామ పంచాయతీలకు బంపర్ పవర్.. సొంత ఆదాయంపై పూర్తి హక్కు.!
దీంతో సికింద్రాబాద్ నుంచి గుంటూరు, విజయవాడకు ప్రయాణ సమయం తగ్గుతోంది. సికింద్రాబాద్ నుంచి గుంటూరుకు మూడు గంటల్లో, విజయవాడకు మూడున్నర గంటల్లో చేరుకోవచ్చు. డబుల్ లైన్ పనులు చేపట్టేందుకు గుంటూరు జిల్లాల్లో భూమి అవసరం కావడంతో రైల్వే శాఖ భూసేకరణకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇప్పటికే రైల్వేలైన్ సమీపంలో భూములు ఉన్నా.. మరికొన్ని అవసరం కావడంతో అధికారులు నిర్ణయం తీసుకున్నారు. తాడికొండ మండలం బండారుపల్లిలో 9.099 ఎకరాలు, గుంటూరు పశ్చిమ మండలం చినపలకలూరులో 9.463 ఎకరాలు, మేడికొండూరు మండలం సిరిపురంలో 15.809 ఎకరాలు, అదే మండలం మండపాడులో 7.35 ఎకరాలు, విశాలాలలో పది సెంట్లు, నల్లపాడులో 5.958 ఎకరాలు. అభ్యంతరాలను నెల రోజుల్లోగా గుంటూరు ఆర్డీఓకు సమర్పించాలని నోటిఫికేషన్లో పేర్కొన్నారు. గుంటూరు ఆర్డీఓ కార్యాలయం కాంపిటెంట్ అథారిటీ. రెండేళ్లలో ఈ ప్రాజెక్టును పూర్తి చేసి ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకురావాలని దక్షిణ మధ్య రైల్వే లక్ష్యంగా పెట్టుకుంది.
Revanth Reddy Vs Jagadish Reddy: అసెంబ్లీలో రేవంత్ రెడ్డి, జగదీష్ రెడ్డిల మధ్య డైలాగ్ వార్..
తాజావార్తలు
-
US-Iran: ఇరాన్ చాబహార్ పోర్టుపై అమెరికా దాడులు.. ఫొటోలు విడుదల
-
ISRO: ఇస్రోను శాస్త్రవేత్తలు ఎందుకు వదిలేస్తున్నారు..? అసలు కారణాలు ఇవే..
-
Sanjay Malhotra: పశ్చిమాసియా యుద్ధం నేపథ్యంలో దేశానికి ఆర్బీఐ గవర్నర్ హెచ్చరిక
-
Rohit Sharma: “రోహిత్ రిటైర్మెంట్ గురించి విరాట్కు ముందే తెలుసు?”.. డ్రెస్సింగ్ రూమ్లో కోహ్లీ ఎమోషనల్!
-
Off The Record: అవనిగడ్డ కూటమి పరిణామాలతోబుద్ధప్రసాద్ మధనపడుతున్నారా?
ట్రెండింగ్
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?