South Central Railway: సికింద్రాబాద్ నుంచి తక్కువ టైమ్ లో గుంటూరు, విజయవాడకు వెళ్లొచ్చు..
- తగ్గుతున్న సికింద్రాబాద్ నుంచి గుంటూరు- విజయవాడకు ప్రయాణ సమయం..
- గుంటూరుకు మూడు గంటలు- విజయవాడకు మూడున్నర గంటలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
South Central Railway: రైల్వేల అభివృద్ధికి ప్రధాని నరేంద్ర మోడీ ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. దేశవ్యాప్తంగా అన్ని రైల్వే లైన్ల ఆధునీకరణతో పాటు సింగిల్ లైన్ రూట్లను డబుల్ లైన్లుగా, డబుల్ లైన్ రూట్లను ట్రిపుల్ లైన్లుగా మార్చేందుకు పనులను చేపట్టారు. ప్రధాన నగరాల్లోని అన్ని రైల్వే స్టేషన్లను విమానాశ్రయాల తరహాలో తీర్చిదిద్దుతున్నారు. వందే భారత్ రైళ్లను సెమీ-హై స్పీడ్ రైళ్లుగా కూడా ప్రవేశపెట్టి.. ప్రయాణాన్ని మరింత ఆనందదాయకంగా చేయాలనే ఉద్దేశ్యంతో తక్కువ సమయంలో ఎక్కువ దూరం ప్రయాణించేవిధంగా చేశారు. కాగా.. దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని గుంటూరు-సికింద్రాబాద్ మార్గం చాలా కీలకంగా మారింది. సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం, తిరుపతి, చెన్నైలకు వెళ్లే రైలు మార్గాలకు ఇది ప్రత్యామ్నాయం. రైళ్ల రాకపోకలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. దీంతో ఇప్పటి వరకు సింగిల్ లైన్ గా ఉన్న గుంటూరు-బీబీనగర్ మార్గాన్ని డబుల్ లైన్ గా విస్తరిస్తున్నారు.
Read also: CM Revanth Reddy: ఆగస్టు 1, 2న బీఆర్ఎస్ పదేళ్ల పాలనపై చర్చకు సిద్ధం..
Also Read
దీంతో సికింద్రాబాద్ నుంచి గుంటూరు, విజయవాడకు ప్రయాణ సమయం తగ్గుతోంది. సికింద్రాబాద్ నుంచి గుంటూరుకు మూడు గంటల్లో, విజయవాడకు మూడున్నర గంటల్లో చేరుకోవచ్చు. డబుల్ లైన్ పనులు చేపట్టేందుకు గుంటూరు జిల్లాల్లో భూమి అవసరం కావడంతో రైల్వే శాఖ భూసేకరణకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇప్పటికే రైల్వేలైన్ సమీపంలో భూములు ఉన్నా.. మరికొన్ని అవసరం కావడంతో అధికారులు నిర్ణయం తీసుకున్నారు. తాడికొండ మండలం బండారుపల్లిలో 9.099 ఎకరాలు, గుంటూరు పశ్చిమ మండలం చినపలకలూరులో 9.463 ఎకరాలు, మేడికొండూరు మండలం సిరిపురంలో 15.809 ఎకరాలు, అదే మండలం మండపాడులో 7.35 ఎకరాలు, విశాలాలలో పది సెంట్లు, నల్లపాడులో 5.958 ఎకరాలు. అభ్యంతరాలను నెల రోజుల్లోగా గుంటూరు ఆర్డీఓకు సమర్పించాలని నోటిఫికేషన్లో పేర్కొన్నారు. గుంటూరు ఆర్డీఓ కార్యాలయం కాంపిటెంట్ అథారిటీ. రెండేళ్లలో ఈ ప్రాజెక్టును పూర్తి చేసి ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకురావాలని దక్షిణ మధ్య రైల్వే లక్ష్యంగా పెట్టుకుంది.
Revanth Reddy Vs Jagadish Reddy: అసెంబ్లీలో రేవంత్ రెడ్డి, జగదీష్ రెడ్డిల మధ్య డైలాగ్ వార్..
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi Debut: ఎంతో ప్రతిభ ఉన్నా.. వైభవ్ సూర్యవంశీకి అరంగేట్రం చేసే అర్హత ఉందా?
-
Ketan Murder Case: “ఒక్క మాట చెబితే పెళ్లి ఆపేవాళ్లం”.. కూతురు ఘాతుకంపై తల్లిదండ్రుల కన్నీటిపర్యంతం!
-
Muskan Pradhan: తాగొచ్చిన వరుడికి చెంపదెబ్బ.. ఇప్పుడు మహిళలకు మార్గదర్శి! కౌన్సెలర్గా నియమితురాలైన ముస్కాన్
-
Asha Bhosle : ఆశా భోస్లేకు బ్రిటిష్ బ్యాండ్ గొరిల్లాజ్ ఘన నివాళి.. లండన్ స్టేడియంలో భావోద్వేగ క్షణాలు
-
NRI: అంతిమ శ్వాస భారత్లోనే… అమెరికా పౌరసత్వం ఉన్న బాపట్ల వృద్ధురాలి కన్నీటి విజ్ఞప్తి!
ట్రెండింగ్
-
రూ.9,999కే Lava Smart 4 Plus లాంచ్.. 6.75 అంగుళాల డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో అదిరిపోయే ఫీచర్లు.!
-
Pesara Garelu Recipe: బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా ఉండే రుచికరమైన స్నాక్ “పెసర గారెలు” చేసేయండి ఇలా.!
-
Baahubali 3 Announced: ఇండియన్ సినీ ప్రియులకు బిగ్ సర్ప్రైజ్.. ‘బాహుబలి 3′ వస్తోంది!
-
BSNL మాస్టర్ స్ట్రోక్.! అన్లిమిటెడ్ కాలింగ్, డేటా మాత్రమే కాదు.. OTT సబ్స్క్రిప్షన్స్ కూడా..
-
Viral Video: ఎవరయ్యా ఈయన.. మద్యం మత్తులో 11KV విద్యుత్ స్తంభం ఎక్కి తీగలపై పడుకున్నాడు.!