Jaipur tinder murder Case: టిండర్లో పరిచయం, డేట్.. కట్ చేస్తే కిడ్నాప్, దారుణహత్య
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tinder Date: టిండర్లో పరిచయం చివరకు హత్యకు దారి తీసింది. అబద్ధాలపై ఏర్పడిన ఇద్దరి మధ్య బంధం హత్యకు పురిగొల్పాయి. ప్రేయసిగా నటించి ఓ వ్యక్తిని చంపిన సంఘటన 2018లో జైపూర్లో జరిగింది. 28 ఏళ్ల దుష్యంత్ శర్మ, 27 ఏళ్ల ప్రియాసేథ్ అనే అమ్మాయితో టిండర్లో పరిచయమైంది. ఇద్దరి అభిరుచులు కలవడంతో మూడు నెలల పాటు మాట్లాడుకున్నారు. ఇద్దరూ వ్యక్తిగతంగా కలవాలనుకున్నారు. ప్రియాసేథ్ తన ఇంటికి ఆహ్వానించడంతో వెనకాముందు ఆలోచించకుండా దుష్యంత్ అక్కడికి వెళ్లాడు. అక్కడికి వెళ్లాక తెలిసింది, తను కిడ్నాప్ అయ్యానని, చివరకు డబ్బుల కోసం దుష్యంత్ని ప్రియాసేథ్ దారుణంగా చంపేసింది. ఈ కేసులో ప్రియాసేథ్ నేరాన్ని అంగీకరించింది. దుష్యంత్ శర్మ కేసులో జైపూర్ కోర్టు ముగ్గురు నిందితులకు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది.
2018లో ప్రారంభమైన ఈ సంబంధం చివరకు హత్యతో ముగిసింది. అప్పటికే వివాహం చేసుకున్న దుష్యంత్ ఢిల్లీకి చెందిన ధనవంతుడైన వ్యాపారవేత్తగా వివాన్ కోహ్లీ అనే నకిలీ పేరుతో పరిచయమ్యాడు. డబ్బున్న వాడు కావడంతో అతన్ని కిడ్నాప్ చేసి, డబ్బులు వసూలు చేయాలని ప్రియాసేథ్, దుష్యంత్ని ట్రాప్ చేసింది. దీనికి ప్రియా సేథ్కి మరో ఇద్దరు దీక్షంత్ కమ్రా, లక్ష్య వాలియా సహాయం చేశారు.
Also Read
- Siya Goyal: ప్రియుడి కోసం కాబోయే భర్త హ*త్య.. పూణే కోటలో నిందితులతో క్రైమ్ సీన్ రీక్రియేట్.. కుటుంబ సభ్యుల్లో ఆవేదన
- Ganja Smuggling : శంషాబాద్లో అంతర్రాష్ట్ర గంజాయి రాకెట్ గుట్టురట్టు..
- Rajasthan: 13 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారం.. రాజస్థాన్ను కుదిపేస్తున్న ఘటన..
- Ketan Agarwal Case: దర్యాప్తులో సంచలన ట్విస్ట్.. వేళ్లన్నీ సియా తల్లిదండ్రుల వైపే..!
Read Also: Balakrishna: బాలకృష్ణపై విచిత్ర లైంగిక వేధింపుల ఆరోపణలు.. అందుకే చేశారట!
అయితే, కిడ్నాప్ చేసిన తర్వాత బెదిరింపు కాల్ చేసిన తర్వాత తెలిసింది, అసలు దుష్యంత్ ఢిల్లీ వ్యాపారవేత్త కాదని, కిడ్నాప్ చేసిన వారు దుష్యంత్ కుటుంబం నుంచి రూ.10 లక్షలు కావాలని డిమాండ్ చేశారు. దుష్యంత్ని చాలాసార్లు పొడిచి, దిండుతో అదిమి చంపేశారు. హత్య వివరాలను దుష్యంత్ పంచుకున్నారు. ‘‘ నా కొడుకు ఫోన్ నుంచి కాల్ వచ్చింది.. నాన్న నన్ను చంపేస్తారు, దయచేసి రూ. 10 ఇచ్చి నన్ను రక్షించండి’’ అని దుష్యంత్ తండ్రి రామేశ్వర్ ప్రసాద్ శర్మ ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. నా దగ్గర అంత డబ్బు లేదని సాయంత్రం 4 గంటల వరకు రూ. 3 లక్షలు ఇస్తానని చెప్పినట్లు ఆయన వెల్లడించారు.
ఆ డబ్బు నుంచి రూ. 20,000 విత్ డ్రా చేసేందుకు నేరస్తులు దుష్యంత్ డెబిట్ కార్డును ఉపయోగించారు. అయితే తమ నేరం బయటకు వస్తుందని ముగ్గురు నిందితులు దుష్యంత్ని చంపేశారు. 2018లో జైపూర్ గ్రామంలో ఓ సూట్ కేసులో దుష్యంత్ డెడ్ బాడీ లభించింది.
ఈ కేసులో ప్రియాసేథ్ నేరాన్ని అంగీకరించింది. ‘‘ అతను నాకు అసలు పేరు చెప్పలేదు. అతను చాలా ధనవంతుడిని అని చెప్పాడు. నేను అప్పటికే దీక్షాత్తో లివ్-ఇన్ రిలేషన్ లో ఉన్నాను, అతనికి రూ.21 లక్షల అప్పు ఉంది. ఈ డబ్బును పొందాలనే దుష్యంత్ని కిడ్నాప్ చేశామని’’ నేరస్తురాలు ప్రియా చెప్పింది. అయితే డబ్బులు ఇచ్చిన తర్వాత ఎందుకు చంపారని ప్రశ్నిస్తే.. డబ్బులు రాకముందే దుష్యంత్ ని చంపేసినట్లు వెల్లడించింది.
తాజావార్తలు
-
IND Vs IRE: టీమిండియాకు షాక్.. కొంపముంచనున్న వర్షం.. ఐర్లాండ్దే సిరీస్..
-
NTR – Trivikram Movie: రేపే ఎన్టీఆర్-త్రివిక్రమ్ ‘God Of War’ అనౌన్స్మెంట్!
-
Garuda Puran: చనిపోయిన వారి బట్టలు ఇంట్లో ఉంచుతున్నారా? గరుడ పురాణంలో చెప్పిన భయంకరమైన నిజాలు ఇవే!
-
Komatireddy Venkat Reddy : రేవంత్పై కోమటిరెడ్డి ప్రశంసలు.. నల్లగొండలో 12 సీట్లు మావే.!
-
Womens T20 World Cup: ముగిసిన టీమిండియా బ్యాటింగ్.. ఆస్ట్రేలియా టార్గెట్ ఎంతంటే..
ట్రెండింగ్
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!