Raghu Veera Reddy: మూడు ప్రాంతీయ పార్టీలు రాష్ట్రాన్ని నాశనం చేశాయి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అనంతపురం జిల్లా నుంచి ఎన్నికల శంఖారావం ప్రారంభిస్తామని సీడబ్ల్యూసీ సభ్యుడు రఘువీరారెడ్డి తెలిపారు. ఈనెల 26వ తేదీన మల్లిఖార్జున ఖర్గే, షర్మిల, మాణిక్యం ఠాగూర్ లతో కలిసి జిల్లాలో ఎన్నికల ప్రచారం ప్రారంభిస్తామని అన్నారు. మరోవైపు రాష్ట్రాన్ని మూడు ప్రాంతీయ పార్టీలు నాశనం చేశాయని దుయ్యబట్టారు. పోలవరం, రాజధాని, ప్రత్యేక హోదాలాంటి అంశాలు తమ మేనిఫెస్టోలో ఉంటాయని తెలిపారు. కాగా.. ఇండియా కూటమితో కలిసి వచ్చే అందరితో మాట్లాడతామని అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ చనిపోయింది అన్న పెద్దిరెడ్డి వ్యాఖ్యల పై రఘువీరా రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖూనీలు చేసే వారు కూడా తమ గురించి మాట్లాడితే ఎలా అని ప్రశ్నించారు. బీజేపీ తమ పార్టీ ఖాతాలు ఫ్రీజ్ చేయడం చూస్తే.. మమ్మలని చూస్తే ఎంత భయంగా ఉందో అర్థం అవుతుందని ఆరోపించారు.
Read Also: Balineni Srinivasa Reddy: పేద ప్రజలను అన్యాయం చేయాలని చూస్తే సహించం..
Also Read
- Talliki Vandanam Scheme: గుడ్న్యూస్.. రూ.10,049 కోట్లు విడుదల.. 'తల్లికి వందనం'కి సొమ్ము ఖాతాల్లో పడేది ఎప్పుడంటే..?
- IND Vs ENG: ఇండియా బ్యాటింగ్.. జట్టులోకి విధ్వంసకర బ్యాటర్..
- West Bengal: లవ్ ప్రపోజల్ రిజెక్ట్ చేసిందని, 16 ఏళ్ల బాలిక హత్య..
- Puri: పూరీ జగన్నాథ రథయాత్రలో తొక్కిసలాట.. ఒకరి మృతి.. 120 మందికి గాయాలు
మరోవైపు.. ఏపీ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇంఛార్జ్ మాణిక్యం ఠాకూర్ మాట్లాడుతూ.. 2024లో అధికారంలోకి వచ్చేందుకు ప్రణాళికలు వేస్తున్నామని తెలిపారు. ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ రెఢీగా ఉందని అన్నారు. విశాఖపట్నంలో జరిగే ఎన్నికల ప్రచారంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పాల్గొంటారని తెలిపారు. అంతేకాకుండా.. ఎన్నికల ప్రచార సభలలో ప్రియంకా గాంధీ, కర్నాటక సీఎం సిద్ధరామయ్య కూడా పాల్గొంటారన్నారు. ఏపీకి ప్రత్యేక హోదాకు కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని ఆయన పేర్కొన్నారు. మరోవైపు.. జగన్ ఏపీ ప్రయోజనాలను బీజేపీ దగ్గర తాకట్టు పెట్టారని ఆరోపించారు. మా అజెండా చాలా క్లియర్ గా ఉంది.. రాబోయే ఎన్నికలలో తప్పకుండా గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు.
తాజావార్తలు
-
Talliki Vandanam Scheme: గుడ్న్యూస్.. రూ.10,049 కోట్లు విడుదల.. ‘తల్లికి వందనం’కి సొమ్ము ఖాతాల్లో పడేది ఎప్పుడంటే..?
-
IND Vs ENG: ఇండియా బ్యాటింగ్.. జట్టులోకి విధ్వంసకర బ్యాటర్..
-
West Bengal: లవ్ ప్రపోజల్ రిజెక్ట్ చేసిందని, 16 ఏళ్ల బాలిక హత్య..
-
Puri: పూరీ జగన్నాథ రథయాత్రలో తొక్కిసలాట.. ఒకరి మృతి.. 120 మందికి గాయాలు
-
Fauji: ప్రభాస్ ‘ఫౌజీ’ చుట్టూ బిగ్ గేమ్.. ఆ సినిమాల రిలీజ్ డేట్లు మారతాయా?
ట్రెండింగ్
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?
-
TGEAPCET 2026: రేపటి నుంచి రెండో విడత ఇంజనీరింగ్ అడ్మిషన్స్ కౌన్సిలింగ్ ప్రారంభం..!
-
50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 50MP కెమెరా, 8000mAh భారీ బ్యాటరీతో Realme NARZO 100x 5G భారత్లో లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!