Rachamallu Siva Prasad Reddy: ఓటమిపై వైసీపీ నేత రాచమల్లు రియాక్షన్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rachamallu Siva Prasad Reddy: కడప జిల్లా ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత రాచమల్లు శివప్రసాద్ రెడ్డి.. సార్వత్రిక ఎన్నికల్లో తన ఓటమిపై స్పందించారు.. ఈ రోజు మీడియాతో మాట్లాడిన ఆయన.. ప్రొద్దుటూరు వాసుల ప్రజాతీర్పును గౌరవిస్తాను అన్నారు. గడిచిన 10 సంవత్సరాల కాలంలో నేను నిబద్ధతగా ప్రజాలకోసమే పాలన చేశా.. ఉద్యోగస్తుల విషయంలో వారిని ఎల్లప్పుడూ గౌరవిస్తూనే వచ్చాను.. ప్రతీ ఉద్యోగస్తులకు నా కృతజ్ఞతలు అన్నారు. నేను ఎమ్మెల్యే గా పనిచేసిన 10 సంవత్సరాల కాలంలో వ్యాపారస్తుల కోసం పనిచేసా… ఎక్కడా ఎవరినీ ఇబ్బందిపెట్టలేదు.. పెట్టబోను అన్నారు. నియోజకవర్గ పరిధిలో నా గడపతొక్కిన ప్రతీ పేదమనిషికీ సహాయం చేస్తూనే వచ్చాను. నన్ను రెండుపర్యాయలు ఎమ్మెల్యే గా చేసిన ప్రజలకు నేను రుణపడి ఉంటానన్నారు.
Read Also: Pushpa 2 : ‘పుష్ప 2’ కు తప్పని రీ షూట్స్ గండం.. కారణం అదేనా..?
Also Read
- Fraud: రూ.1700 కోట్ల నకిలీ జీఎస్టీ కుంభకోణం బట్టబయలు.. ప్రధాన సూత్రధారి అరెస్ట్..
- LayOffs: స్టార్బక్స్లో మళ్లీ ఉద్యోగుల తొలగింపు.. 300 మంది కార్పొరేట్ స్టాఫ్పై వేటు.. కొన్ని ఆఫీసుల మూసివేత..
- Foreign Travels: విదేశీ టూర్లపై భారీగా ట్యాక్స్ వేసేందుకు రంగం సిద్ధం! కేంద్రం ప్లాన్ ఇదేనా?
- NEET-UG 2026 paper leak: నీట్ పేపర్ లీక్ను ఛేదించిన సీబీఐ.. అసలు సూత్రధారి కెమిస్ట్రీ లెక్చరర్..
ఇక, రాజకీయాల్లో గెలుపోటములు సాధారణం.. ప్రజలను నిందించడం తగదు అన్నారు రాచమల్లు.. టీడీపీ అధినేత చంద్రబాబు చెప్పిన హామీలు అన్ని నెరవేర్చాలని నేను కోరుకుంటున్నానన్న ఆయన.. వరదరాజుల రెడ్డికి మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలిపారు.. వరదరాజుల రెడ్డిపై నాకు ఎప్పటికీ గౌరమే.. ఆయన నా రాజకీయగురువుగా తెలిపారు. వరదరాజుల రెడ్డి పాలన గొప్పగా అందించాలని కోరుకుంటున్నా.. టీడీపీ చేయబోయే అభివృద్ధికి నేను సహకరిస్తానని ప్రకటించారు. సంవత్సరం పాటు నేను టీడీపీని విమర్శించను.. తర్వాత ప్రొద్దుటూరు అభివృద్ధి గురించి ప్రశ్నిస్తా అన్నారు. శాంతియుతంగా ప్రజలపక్షాన.. ఎల్లపూడూ పోరాడుతూనే ఉంటా.. 83,000 మంది ప్రజలు నా వైసీపీ జెండాకు ఓట్లేశారు.. వాళ్లు నాతో ఉన్నందుకు వారికి కృతజ్ఞతలు తెలిపారు. ఇక, శాంతిభద్రతలు కాపాడాలని పోలీసులను కోరారు ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత రాచమల్లు శివప్రసాద్ రెడ్డి.
తాజావార్తలు
-
Fraud: రూ.1700 కోట్ల నకిలీ జీఎస్టీ కుంభకోణం బట్టబయలు.. ప్రధాన సూత్రధారి అరెస్ట్..
-
Trump China Visit: చైనా భయంతో అమెరికాకు రాగానే వాటిని చెత్తబుట్టల్లో పడేసిన ట్రంప్ సిబ్బంది.. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే!
-
LayOffs: స్టార్బక్స్లో మళ్లీ ఉద్యోగుల తొలగింపు.. 300 మంది కార్పొరేట్ స్టాఫ్పై వేటు.. కొన్ని ఆఫీసుల మూసివేత..
-
Foreign Travels: విదేశీ టూర్లపై భారీగా ట్యాక్స్ వేసేందుకు రంగం సిద్ధం! కేంద్రం ప్లాన్ ఇదేనా?
-
NEET-UG 2026 paper leak: నీట్ పేపర్ లీక్ను ఛేదించిన సీబీఐ.. అసలు సూత్రధారి కెమిస్ట్రీ లెక్చరర్..
ట్రెండింగ్
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!