R. Ashwin: సీఎస్కేకు తిరిగి రావడంపై ఓపెన్ అయిపోయిన అశ్విన్..
- ఐపీఎల్ 2025లో సీఎస్కే తరఫున ఆడనున్న రవిచంద్రన్ అశ్విన్
- 2009లో సీఎస్కే తరుఫున అశ్విన్ అరంగేట్రం
- చెన్నై సూపర్ కింగ్స్కు తిరిగి రావడంపై అశ్విన్ ఓపెన్
- సీఎస్కే జట్టుకు తిరిగి రావడం వింతగా అనిపించింది- అశ్విన్.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐపీఎల్ 2025లో రవిచంద్రన్ అశ్విన్ చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) తరపున ఆడనున్నాడు. కాగా.. 2009లో సీఎస్కే తరుఫున అశ్విన్ అరంగేట్రం చేశాడు. 2015 వరకు ఏడు సీజన్లు చెన్నైకి ఆడాడు. ఆ తర్వాత 2016, 2017లో రైజింగ్ పూణే సూపర్ జెయింట్స్ తరఫున ఆడాడు. 2018లో పంజాబ్ కింగ్స్ తరపున ఆడాడు. ఆ తర్వాత రెండు సీజన్లలో ఢిల్లీ క్యాపిటల్స్ తరపున ఆడాడు. 2022 నుండి 2024 వరకు రాజస్థాన్ రాయల్స్ తరపున ఆడాడు. తాజాగా జరిగిన వేలంలో చెన్నై సూపర్ కింగ్స్ అశ్విన్ను రూ.9.75 కోట్లకు దక్కించుకుకుంది. ఐపీఎల్లో తన కెరీర్ ఎక్కడైతే మొదలుపెట్టాడో.. తిరిగి అక్కడికే వచ్చాడు.
Read Also: Himachal: రాష్ట్ర పథకాలకు “దేవాలయాల” డబ్బులు.. కాంగ్రెస్ సర్కార్పై బీజేపీ ఆగ్రహం..
Also Read
- Twisha Sharma: ట్విషా శర్మ మృతి కేసులో భర్త సమర్థ్ సింగ్కు షాక్.. న్యాయ వృత్తి నుంచి సస్పెండ్
- Abhishek Sharma: మళ్లీ రికార్డుల వేట.. కాటేరమ్మ కొడుకు అరుదైన రికార్డు..
- Asim Munir: టెహ్రాన్కు వెళ్లిన పాక్ ఆర్మీ చీఫ్ మునీర్.. శాంతి చర్చలపై సర్వత్రా ఆసక్తి
- IPL Team: కొత్త ఐపీఎల్ జట్టులో దిగ్గజాలు.. CSK, MI, RCB తట్టుకునేనా..?
ఈ క్రమంలో.. చెన్నై సూపర్ కింగ్స్కు తిరిగి రావడంపై అశ్విన్ ఓపెన్ అయ్యాడు. 2025లో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టుకు తిరిగి రావడం వింతగా అనిపించిందని అన్నాడు. ‘నేను చెన్నై సూపర్ కింగ్స్ జట్టును వదిలి చాలా సంవత్సరాలు అయింది. ఇప్పుడు తిరిగి జట్టులో చేరడం చాలా ప్రత్యేకమైన అనుభూతి. జట్టులో అందరూ ఒకేలా ఉన్నారు, నేనే చాలా సీనియర్గా అనిపిస్తోంది. చేపాక్ వేదికపై ఆడటానికి ఎదురు చూస్తున్నాను” అని సీఎస్కే అధికారిక సోషల్ మీడియా హ్యాండిల్లో విడుదలైన వీడియోలో అశ్విన్ తెలిపాడు.
Read Also: CM Revanth Reddy: పార్టీ కోసం కష్టపడ్డ వారికి తప్పకుండా గుర్తింపు ఉంటుంది..
చెన్నై తరపున 97 మ్యాచ్లలో 6.46 ఎకానమీ రేటుతో 90 వికెట్లు పడగొట్టిన అశ్విన్.. ఛాంపియన్స్ లీగ్ టీ20లో 24 మ్యాచ్లలో 7.44 ఎకానమీ రేటుతో 30 వికెట్లు పడగొట్టాడు. మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్లో ఆస్ట్రేలియాతో జరిగిన బాక్సింగ్ డే టెస్టులో భారత్ ఓడిపోయిన తర్వాత.. అశ్విన్ అంతర్జాతీయ క్రికెట్ నుండి రిటైర్మెంట్ తీసుకున్నట్లు ప్రకటించాడు. ఇదిలా ఉంటే.. సీఎస్కే మార్చి 23న చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో ముంబై ఇండియన్స్తో తొలి మ్యాచ్ను ఆడుతుంది.
తాజావార్తలు
-
Bhatti Vikramarka : 3 ట్రిలియన్ల ఆర్థిక వ్వవస్థే లక్ష్యం
-
Twisha Sharma: ట్విషా శర్మ మృతి కేసులో భర్త సమర్థ్ సింగ్కు షాక్.. న్యాయ వృత్తి నుంచి సస్పెండ్
-
Abhishek Sharma: మళ్లీ రికార్డుల వేట.. కాటేరమ్మ కొడుకు అరుదైన రికార్డు..
-
Asim Munir: టెహ్రాన్కు వెళ్లిన పాక్ ఆర్మీ చీఫ్ మునీర్.. శాంతి చర్చలపై సర్వత్రా ఆసక్తి
-
IPL Team: కొత్త ఐపీఎల్ జట్టులో దిగ్గజాలు.. CSK, MI, RCB తట్టుకునేనా..?
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!