ప్రధాని మోడీ (PM Modi) మంగళవారం జమ్మూలో (Jammu) పర్యటించనున్నారు. రూ.13,375 కోట్ల విలువైన ప్రాజెక్టులను ప్రారంభోత్సవం చేయనున్నారు. ప్రధాని పర్యటన నేపథ్యంలో బాణాసంచా అమ్మకాలపై అధికారులు నిషేధం విధించారు. నేటి నుంచి మంగళవారం సాయంత్రం 5 గంటల వరకు క్రాకర్స్పై నిషేధం విధిస్తూ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. తక్షణమే అమల్లోకి వస్తుందని పేర్కొ్న్నారు. ఇప్పటికే డ్రోన్లు ఎగురవేతను నిషేధించింది.
ప్రధాని మోడీ జమ్మూలో నిర్మించిన ఎయిమ్స్ను మంగళవారం ప్రారంభించబోతున్నారు. ఈ ఆస్పత్రికి పునాది రాయిని మోడీ 2019 ఫిబ్రవరిలో వేశారు. అంతేకాకుండా 48.1 కి.మీ పొడవైన బనిహాల్-సంగల్దాన్ రైల్వే సెక్షన్ను కూడా ప్రధాని ప్రారంభించనున్నారు. ఈ రైలు విభాగం కాశ్మీర్ను దేశంలోని ఇతర ప్రాంతాలతో కలుపుతూ 272 కి.మీ పొడవైన ఉధంపూర్-శ్రీనగర్-బారాముల్లా రైలు తిరిగనుంది. జమ్మూ కాశ్మీర్ను కేంద్ర పాలిత ప్రాంతంగా అవతరించిన తర్వాత ప్రధాని మోడీ చేపట్టిన రెండో పర్యటన ఇది. ప్రధాని ఈ పర్యటనను జాతికి అంకితం చేయనున్నారు.
ఇదిలా ఉండగా జమ్మూ విమానాశ్రయంలో కొత్త టెర్మినల్ భవనానికి కూడా ప్రధాని శంకుస్థాపన చేయనున్నారు. ఈ కొత్త టెర్మినల్ 40 వేల చదరపు మీటర్లలో విస్తరించి ఉంది. ఇందులో సుమారు 2000 మంది ప్రయాణికులకు సేవలను అందించవచ్చు. దీనితో పాటు, ఈ టెర్మినల్లో ఆధునిక సౌకర్యాలు కూడా ఉంటాయి. ఈ కార్యక్రమంలో జమ్మూ – కత్రా మధ్య నిర్మించిన ఢిల్లీ-అమృత్సర్-కత్రా ఎక్స్ప్రెస్వే రెండు ప్యాకేజీలతో పాటు ఇతర ముఖ్యమైన రహదారి ప్రాజెక్టులకు ఆయన శంకుస్థాపన చేస్తారు. జమ్మూలో కామన్ యూజర్ ఫెసిలిటీ పెట్రోలియం డిపోను అభివృద్ధి చేసే ప్రాజెక్టుకు కూడా మోడీ శంకుస్థాపన చేస్తారు.
Sale/purchase and use of firecrackers prohibited in Jammu district with immediate effect until 5 pm on 20th February in wake of the upcoming VVIP visit in the district. pic.twitter.com/gr3plnFzf7
— ANI (@ANI) February 19, 2024