Purandeswari: ఏపీలో ఇసుక దోపిడీ..! పురంధేశ్వరి సంచలన ఆరోపణలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Purandeswari: ఏపీలోని ఇసుక దోపిడీ జరుగుతోందని విమర్శించారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి.. కోట్లాది రూపాయల మేర ఇసుక దోపిడీ జరిగిందని సంచలన ఆరోపణలు చేశారు.. ప్రజా సమస్యలని ప్రస్తావించడం మా ప్రధాన అజెండాగా స్పష్టం చేసిన ఆమె.. ప్రభుత్వంలో అవినీతి జరుగుతోందనే విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాం. నేను వివిధ అంశాలను ప్రస్తావిస్తోంటే.. నాపై విమర్శలు చేశారని మండిపడ్డారు. ఏపీలో ఇసుక దోపిడీ జరుగుతోంది.. గతంలో ట్రాక్టర్ ఇసుక రూ. వేయి లభించేది.. కానీ, ఇప్పుడు రూ. 5-6 వేలుగా ఉందన్నారు.. ఇసుక ధరలు పెరగడం వల్ల సామాన్యులు ఇబ్బందులు పడుతున్నారు. ఇసుక ధర పెరగడంతో నిర్మాణ రంగం కుదేలైందని.. దీంతో సుమారు 35 లక్షల మంది ఉన్న భవన నిర్మాణ కార్మికులు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
Read Also: Kishan Reddy: నేడు ఢిల్లీకి కిషన్ రెడ్డి.. బీజేపీ మూడో జాబితాపై అగ్రనేతలతో చర్చ..
Also Read
వైసీపీ అధికారంలోకి వచ్చాక ఇసుక పాలసీని మార్చి.. ఒకే కాంట్రాక్టరుకు ఇచ్చారు. ఎవ్వర్నీ పోటీకి రానివ్వకుండా జేపీ వెంచర్స్కు కట్టబెట్టారు.. సబ్ లీజ్ ఇవ్వకూడదనే నిబంధన ఉంది.. కానీ, దానిని ఉల్లంఘించారని దుయ్యబట్టారు పురంధేశ్వరి. శేఖర్ రెడ్డికి సంబంధించిన టర్న్ కీ ఎంటర్ప్రైజెస్కు జేపీ వెంచర్స్ సంస్థ సబ్ లీజుకు ఇచ్చింది. సబ్ లీజ్ తీసుకున్న టర్న్ కీ సంస్థను పంపేసి.. కొందరు అధికార పార్టీ ఎమ్మెల్యేలకు అనధికారికంగా కట్టబెట్టారని ఆరోపించారు. జిల్లాల వారీగా ఇసుక రీచ్లను అమ్మేశారు. ఇసుక దోపిడీలో భాగంగా తాడేపల్లి ప్యాలెస్కు రూ. 2 వేల కోట్లు వెళ్లాయని సంచలన ఆరోపణలు గుప్పించారు.. హైదరాబాద్లోని సుధాకర్ అనే వ్యక్తి ఈ ఇసుక దందాను పర్యవేక్షిస్తున్నారు. ఇసుక దోపిడీకి ఓ ఐఏఎస్ అధికారి సహకరిస్తున్నట్టు మాకు సమాచారం ఉందన్నారు. జేపీ వెంచర్స్ సంస్థతో ఒప్పందం ముగిసిన తర్వాత కూడా ఇంకా ఇసుక తవ్వకాలు జరుపుతున్నారు.. అనధికారికంగా ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయి.. బిల్లుల్లో ఉండే లెక్కలకూ.. జరుపుతోన్న తవ్వకాలకు భారీ వ్యత్యాసం ఉందని విమర్శించారు. భారీ యంత్రాలతో ఇసుక తవ్వకాలు జరపకూడదనే నిబంధనలున్నాయి.. కానీ, దాన్ని ఉల్లంఘిస్తున్నారు. నదీ గర్భంలో తవ్వకాలు జరపకూడదనే నిబంధనలున్నా.. రోడ్లు వేసి మరీ డీప్ డ్రెడ్జింగ్ చేసేస్తున్నారు. వర్షాకాలంలో తవ్వకూడదనే నిబంధనలను ఉల్లంఘిస్తున్నారు. పరిధిని మించి తవ్వకాలు యథేచ్ఛగా జరుగుతున్నాయి అంటూ ఆరోపణలు గుప్పించారు ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి.
తాజావార్తలు
-
Story Board : పాస్ పోర్ట్ కేవలం ప్రయాణ పత్రమేనా..? ఇప్పుడు కేంద్రం వాదనేంటి..?
-
OTR: ధర్మవరం రాజకీయాల్లో హీట్… మంత్రి సత్యకుమార్ వ్యూహం మారిందా?
-
OTR : SIR రూల్తో ఓటర్లలో గందరగోళం – ఏ గట్టు ఎంచుకోవాలి?
-
OTR: మంత్రాలయం కోటను బద్దలు కొట్టేందుకు టీడీపీ మాస్టర్ ప్లాన్?
-
YS Jagan : ఏపీలో నడుస్తోంది గూండాల రాజ్యమా?.. చంద్రబాబుపై వైఎస్ జగన్ ఫైర్..
ట్రెండింగ్
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్తో మరింత సౌలభ్యం.!