CSK vs PBKS: ప్లేఆఫ్స్ రేసు నుంచి చెన్నై నిష్క్రమణ.. పంజాబ్ కింగ్స్ ఘన విజయం
- ప్లేఆఫ్స్ రేసు నుంచి చెన్నై నిష్క్రమణ
- పంజాబ్ కింగ్స్ చెన్నై సూపర్ కింగ్స్ను 4 వికెట్ల తేడాతో ఓడించింది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
శ్రేయాస్ అయ్యర్ (72), ప్రభ్సిమ్రాన్ సింగ్ (54) అర్ధ సెంచరీలతో పాటు యుజ్వేంద్ర చాహల్ హ్యాట్రిక్ సాధించడంతో పంజాబ్ కింగ్స్ చెన్నై సూపర్ కింగ్స్ను 4 వికెట్ల తేడాతో ఓడించింది. ఈ ఓటమితో, 5 సార్లు ఛాంపియన్ అయిన చెన్నై సూపర్ కింగ్స్ ప్లేఆఫ్ రేసు నుంచి నిష్క్రమించింది. 18వ సీజన్లో ఇప్పటివరకు చెన్నై 10 మ్యాచ్ల్లో 2 మ్యాచ్ల్లో మాత్రమే గెలిచింది. చెన్నై బ్యాట్స్ మెన్ మాయాజాలం సొంత గడ్డపై విఫలమైంది. టాస్ గెలిచిన తర్వాత కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ ముందుగా బౌలింగ్ చేయాలని నిర్ణయించుకోవడంతో పంజాబ్ జట్టు విజయం సులభమైంది. చెన్నై బ్యాటింగ్ మరోసారి పూర్తిగా తడబడింది.
Also Read:Pakistan: ‘‘ కాశ్మీర్ వెళ్లండి, ఇక్కడేం పని’’.. పాక్ ఆర్మీ, పోలీసుల మధ్య ఘర్షణ.. వీడియో వైరల్..
Also Read
జట్టు ఓపెనింగ్ జోడితో పాటు, ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా కూడా విఫలమయ్యారు. అయితే, సామ్ కరన్ అద్భుతమైన బ్యాటింగ్ కారణంగా, చెన్నై 190 పరుగులకు ఆలౌట్ అయింది. తొలి వికెట్లు పడటంతో సామ్ సామ్ కరన్ క్రీజులోకి వచ్చాడు. అతను 47 బంతులను ఎదుర్కొని 88 పరుగుల వేగవంతమైన ఇన్నింగ్స్ ఆడాడు. అతని ఇన్నింగ్స్లో 9 ఫోర్లు, 4 సిక్సర్లు ఉన్నాయి. పంజాబ్ పేసర్లు అర్ష్దీప్ సింగ్, మార్కో జాన్సెన్ బాగా బౌలింగ్ చేసి చెన్నై ఓపెనర్లను పెవిలియన్ కు పంపారు.
Also Read:CSK vs PBKS: చాహల్ హ్యాట్రిక్.. చెన్నై భారీ స్కోర్కు బ్రేక్
పవర్ ప్లేలోనే షేక్ రషీద్, ఆయుష్ ఔట్ కావడంతో జట్టు 22 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది. అర్ష్దీప్ మొదట రషీద్ను క్యాచ్తో అవుట్ చేయగా, ఆ తర్వాత యాన్సన్ను అయ్యర్ క్యాచ్తో అవుట్ చేశాడు. పంజాబ్ తరఫున యుజ్వేంద్ర చాహల్ హ్యాట్రిక్ సాధించాడు. 19వ ఓవర్లో అతను 4 వికెట్లు పడగొట్టాడు.
191 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ కింగ్స్ జట్టు ఆరంభంలో శుభారంభం చేసింది. పంజాబ్ ఓపెనర్లు ప్రియాంష్ ఆర్య, ప్రభ్సిమ్రాన్ సింగ్ 28 బంతుల్లో 44 పరుగులు జోడించారు. ఐదో ఓవర్లో ప్రియాంష్ (23) ఖలీల్ బౌలింగ్ లో ధోనీకి క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ ప్రభ్సిమ్రాన్ తో కలిసి రెండవ వికెట్ కు 72 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు.
Also Read:Off The Record: తెనాలి కూటమిలో కుంపటి రాజేసుకుందా..? ఢీ అంటే ఢీ..!
13వ ఓవర్ చివరి బంతికి ప్రభ్సిమ్రాన్ క్యాచ్ అవుట్ అయ్యాడు. పంజాబ్ ఓపెనింగ్ బ్యాట్స్మన్ 36 బంతుల్లో 54 పరుగులు చేసి ఇన్నింగ్స్ ఆడాడు. పంజాబ్ గెలవడానికి 3 పరుగులు అవసరమైనప్పుడు, మతిష పతిరానా శ్రేయాస్ అయ్యర్ను బౌల్డ్ చేశాడు. అయ్యర్ 41 బంతుల్లో 72 పరుగులు చేశాడు. చివరి ఓవర్లో, సూర్యాంష్ షెడ్జ్ 1 పరుగు చేసి పెవిలియన్కు తిరిగి వచ్చాడు. జోష్ ఇంగ్లీష్ 6 పరుగులతో, మార్క్ జాన్సెన్ 4 పరుగులతో నాటౌట్గా నిలిచారు. ఖలీల్ అహ్మద్, మతిషా పతిరానా తలా 2 వికెట్లు పడగొట్టారు.
తాజావార్తలు
-
Irumudi: ‘ఇరుముడి’లో షాకింగ్ గెటప్లో రవితేజ.. ఫ్యాన్స్కు ఊహించని సర్ప్రైజ్!
-
Hyderabad : 50 ఏళ్ల మహిళ నాలుక కోసేసిన ప్రియుడు
-
Heatwave Workout Tips: వేసవిలో జిమ్ ప్రియులారా జాగ్రత్త..! ఈ తప్పులు చేస్తే ప్రమాదంలో పడ్డట్టే..!
-
KKR vs DC: చివరి లీగ్ మ్యాచ్లో దుమ్మురేపిన ఢిల్లీ.. కేకేఆర్పై భారీ విజయం.!
-
IPL 2026 ప్లేఆఫ్స్ ఖరారు.. రెండవసారి ఛాంపియన్ కాబోయే జట్టు ఏది.?
ట్రెండింగ్
-
Lemon Pickle: చేదు రాకుండా, బూజు పట్టకుండా.. సంవత్సరం పొడవునా పాడవకుండా ‘నిమ్మకాయ పచ్చడి’ చేసేయండి ఇలా..!
-
iPhone Users Alert: వెలుగులోకి కొత్త ఫిషింగ్ మోసం.. అలర్ట్ జారీ చేసిన కేంద్రం.!
-
Early Age S*ex Results: చిన్న వయసులోనే శృంగారం.. ఈ సమస్యలు తప్పవా.?
-
Natural Home Remedy: తెల్ల జుట్టుకు సింపుల్ “హోమ్ రెమిడీ”.. ఆ మూడు పదార్థాలతో ఉంటే చాలు.. నేచురల్గా హెయిర్ కలర్ రెడీ.!
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!