Big Pay Hike: టీచర్లకు గుడ్న్యూస్.. భారీ వేతన పెంపును ప్రకటించిన సర్కారు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Punjab Announces Big Pay Hike For Teachers: పంజాబ్ ప్రభుత్వం రాష్ట్ర ఉపాధ్యాయులకు శుభవార్త తెలిపింది. పంజాబ్ వేలాది మంది ఉపాధ్యాయులకు క్రమబద్ధీకరణ తర్వాత భారీ వేతన పెంపును ప్రకటించింది. ఇటీవల రెగ్యులరైజ్ చేసిన 12,700 మంది ఉపాధ్యాయుల వేతనాలను మూడు రెట్లు పెంచినట్లు పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ మంగళవారం తెలిపారు. ప్రస్తుతం ఉన్న 6,137 మంది విద్యావాలంటీర్లకు రూ.3,500 బదులు రూ.15,000 అందజేస్తామని ముఖ్యమంత్రి భగవంత్ మాన్ మంగళవారం ప్రకటించారు. ముందుగా కాంట్రాక్టు టీచర్లను నిర్ధారించాలని ప్రకటించారు. అదే సమయంలో విద్యా హామీ పథకంలో పనిచేస్తున్న వారి జీతంలో కూడా భారీ పెరుగుదల ఉంది.
Also Read: Rahul Gandhi: ఢిల్లీలో బైక్ మెకానిక్ గా మారిన రాహుల్.. చూసి ఆశ్చర్యపోతున్న జనాలు
Also Read
- Abhijeet Dipke: అమెరికా నుంచి ఢిల్లీ చేరుకున్న కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు.. నేటి నుంచి నిరసనలు
- Vladimir Putin: "భారత్ను భయపెట్టాలని చూస్తే మీకే నష్టం".. ఆ దేశాలకు పుతిన్ స్ట్రాంగ్ వార్నింగ్!
- Nashik TCS Case: నాసిక్ టీసీఎస్ కేసులో షాకింగ్ ట్విస్ట్.. వెలుగులోకి సంచలన విషయాలు..
- Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు ఆకస్మిక ధన లాభాలు.!
మరోవైపు ఇప్పటి వరకు 6000 రూపాయలు పొందే వారికి ఇప్పుడు 18000 రూపాయల జీతం ఇవ్వనున్నారు. విద్యా ప్రదాతలు గతంలో రూ.10,250 పొందేవారు, ఇప్పుడు వారికి 22 వేల రూపాయల జీతం వస్తుంది. దీంతో పాటు ఎంఏ, బీఈడీ చదివిన టీచర్లకు గతంలో రూ.11,000 జీతం వచ్చేది, ఇప్పుడు వారికి 23, 500 రూపాయల జీతం వస్తుంది. ఐఈవీ వాలంటీర్ల వేతనాన్ని రూ.5500 నుంచి రూ.15000కు పెంచామని.. రానున్న రోజుల్లో ఈ నోటిఫికేషన్ను విడుదల చేస్తామని ముఖ్యమంత్రి తెలిపారు.
Also Read: Monsoon Diet : వర్షాకాలంలో వ్యాధుల బారిన పడకుండా ఉండాలంటే వీటిని తప్పక తీసుకోవాలి..
వారి విద్యార్హతలు, సేవల్లోకి ప్రవేశించడానికి ప్రాథమిక షరతుల ఆధారంగా, వారి సేవలు 58 సంవత్సరాలు పూర్తయ్యే వరకు వారి వేతనాలు నిర్ణయించబడ్డాయి. ఉద్యోగాల కోసం ధర్నాలు చేసే ఉపాధ్యాయులు, ఇతర కార్మికులు ఇకపై ధర్నాలు చేయాల్సిన పని లేదన్నారు. వేసవి సెలవుల తర్వాత అందరికీ అపాయింట్మెంట్ ఇస్తామని సీఎం భగవంత్ మాన్ అన్నారు. రానున్న రోజుల్లో ఇతర శాఖల్లోనూ ఇటువంటి సవరణలు చేయనున్నారు. జాప్యం కావచ్చు కానీ మా ఉద్దేశంలో లోటు లేదన్నారు. గతంలో రాష్ట్రంలోని 14,000 మందికి పైగా కాంట్రాక్టు ఉపాధ్యాయుల సర్వీసుల క్రమబద్ధీకరణకు ముఖ్యమంత్రి భగవంత్ మాన్ ఆమోదం తెలిపారు.
ఉపాధ్యాయుల సమగ్రాభివృద్ధికి భరోసా కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయం ఇది. ఈ ఉపాధ్యాయులు విద్యా శాఖలో 10 సంవత్సరాలకు పైగా సేవలు అందించారని, ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం వారి సేవలను క్రమబద్ధీకరించిందని, అయితే మునుపటి ప్రభుత్వాలు ఈ సమస్యపై పెదవి విప్పలేదని ఆయన అన్నారు.
తాజావార్తలు
-
Abhijeet Dipke: అమెరికా నుంచి ఢిల్లీ చేరుకున్న కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు.. నేటి నుంచి నిరసనలు
-
Vladimir Putin: “భారత్ను భయపెట్టాలని చూస్తే మీకే నష్టం”.. ఆ దేశాలకు పుతిన్ స్ట్రాంగ్ వార్నింగ్!
-
Peddi Controversy : ‘పెద్ది’ ముద్దుపై బుచ్చిబాబు ఫస్ట్ రియాక్షన్… ఏమన్నారంటే?
-
Nashik TCS Case: నాసిక్ టీసీఎస్ కేసులో షాకింగ్ ట్విస్ట్.. వెలుగులోకి సంచలన విషయాలు..
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు ఆకస్మిక ధన లాభాలు.!
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!