Big Pay Hike: టీచర్లకు గుడ్న్యూస్.. భారీ వేతన పెంపును ప్రకటించిన సర్కారు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Punjab Announces Big Pay Hike For Teachers: పంజాబ్ ప్రభుత్వం రాష్ట్ర ఉపాధ్యాయులకు శుభవార్త తెలిపింది. పంజాబ్ వేలాది మంది ఉపాధ్యాయులకు క్రమబద్ధీకరణ తర్వాత భారీ వేతన పెంపును ప్రకటించింది. ఇటీవల రెగ్యులరైజ్ చేసిన 12,700 మంది ఉపాధ్యాయుల వేతనాలను మూడు రెట్లు పెంచినట్లు పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ మంగళవారం తెలిపారు. ప్రస్తుతం ఉన్న 6,137 మంది విద్యావాలంటీర్లకు రూ.3,500 బదులు రూ.15,000 అందజేస్తామని ముఖ్యమంత్రి భగవంత్ మాన్ మంగళవారం ప్రకటించారు. ముందుగా కాంట్రాక్టు టీచర్లను నిర్ధారించాలని ప్రకటించారు. అదే సమయంలో విద్యా హామీ పథకంలో పనిచేస్తున్న వారి జీతంలో కూడా భారీ పెరుగుదల ఉంది.
Also Read: Rahul Gandhi: ఢిల్లీలో బైక్ మెకానిక్ గా మారిన రాహుల్.. చూసి ఆశ్చర్యపోతున్న జనాలు
Also Read
మరోవైపు ఇప్పటి వరకు 6000 రూపాయలు పొందే వారికి ఇప్పుడు 18000 రూపాయల జీతం ఇవ్వనున్నారు. విద్యా ప్రదాతలు గతంలో రూ.10,250 పొందేవారు, ఇప్పుడు వారికి 22 వేల రూపాయల జీతం వస్తుంది. దీంతో పాటు ఎంఏ, బీఈడీ చదివిన టీచర్లకు గతంలో రూ.11,000 జీతం వచ్చేది, ఇప్పుడు వారికి 23, 500 రూపాయల జీతం వస్తుంది. ఐఈవీ వాలంటీర్ల వేతనాన్ని రూ.5500 నుంచి రూ.15000కు పెంచామని.. రానున్న రోజుల్లో ఈ నోటిఫికేషన్ను విడుదల చేస్తామని ముఖ్యమంత్రి తెలిపారు.
Also Read: Monsoon Diet : వర్షాకాలంలో వ్యాధుల బారిన పడకుండా ఉండాలంటే వీటిని తప్పక తీసుకోవాలి..
వారి విద్యార్హతలు, సేవల్లోకి ప్రవేశించడానికి ప్రాథమిక షరతుల ఆధారంగా, వారి సేవలు 58 సంవత్సరాలు పూర్తయ్యే వరకు వారి వేతనాలు నిర్ణయించబడ్డాయి. ఉద్యోగాల కోసం ధర్నాలు చేసే ఉపాధ్యాయులు, ఇతర కార్మికులు ఇకపై ధర్నాలు చేయాల్సిన పని లేదన్నారు. వేసవి సెలవుల తర్వాత అందరికీ అపాయింట్మెంట్ ఇస్తామని సీఎం భగవంత్ మాన్ అన్నారు. రానున్న రోజుల్లో ఇతర శాఖల్లోనూ ఇటువంటి సవరణలు చేయనున్నారు. జాప్యం కావచ్చు కానీ మా ఉద్దేశంలో లోటు లేదన్నారు. గతంలో రాష్ట్రంలోని 14,000 మందికి పైగా కాంట్రాక్టు ఉపాధ్యాయుల సర్వీసుల క్రమబద్ధీకరణకు ముఖ్యమంత్రి భగవంత్ మాన్ ఆమోదం తెలిపారు.
ఉపాధ్యాయుల సమగ్రాభివృద్ధికి భరోసా కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయం ఇది. ఈ ఉపాధ్యాయులు విద్యా శాఖలో 10 సంవత్సరాలకు పైగా సేవలు అందించారని, ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం వారి సేవలను క్రమబద్ధీకరించిందని, అయితే మునుపటి ప్రభుత్వాలు ఈ సమస్యపై పెదవి విప్పలేదని ఆయన అన్నారు.
తాజావార్తలు
-
Sandeep Reddy Vanga : ప్రభాస్ ‘స్పిరిట్’ కి A సర్టిఫికెట్ పక్కా.. నేను ఎంత గింజుకున్నా అంతే!
-
Modi-Rahul Gandhi: కులగణనపై మోడీకి ఖర్గే, రాహుల్గాంధీ లేఖ.. ఏముందంటే..!
-
Sandeep Reddy Vanga : ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ప్రభాస్!
-
Power Bank Explosion : పవర్ బ్యాంక్ పేలి విద్యార్థికి తీవ్ర గాయాలు
-
OTR: మంత్రి కొండా సురేఖను కేబినెట్ నుంచి తప్పిస్తారా..?
ట్రెండింగ్
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్చేస్తే..
-
144Hz డిస్ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!
-
ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 2TB వరకు స్టోరేజ్, 50MP కెమెరాతో Sony Xperia 10 VIII లాంచ్..!
-
Green Chillies Plant Grow: కుండీలో పచ్చిమిరపకాయలు విరగకాయాలంటే ఇలా చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!