Big Pay Hike: టీచర్లకు గుడ్న్యూస్.. భారీ వేతన పెంపును ప్రకటించిన సర్కారు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Punjab Announces Big Pay Hike For Teachers: పంజాబ్ ప్రభుత్వం రాష్ట్ర ఉపాధ్యాయులకు శుభవార్త తెలిపింది. పంజాబ్ వేలాది మంది ఉపాధ్యాయులకు క్రమబద్ధీకరణ తర్వాత భారీ వేతన పెంపును ప్రకటించింది. ఇటీవల రెగ్యులరైజ్ చేసిన 12,700 మంది ఉపాధ్యాయుల వేతనాలను మూడు రెట్లు పెంచినట్లు పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ మంగళవారం తెలిపారు. ప్రస్తుతం ఉన్న 6,137 మంది విద్యావాలంటీర్లకు రూ.3,500 బదులు రూ.15,000 అందజేస్తామని ముఖ్యమంత్రి భగవంత్ మాన్ మంగళవారం ప్రకటించారు. ముందుగా కాంట్రాక్టు టీచర్లను నిర్ధారించాలని ప్రకటించారు. అదే సమయంలో విద్యా హామీ పథకంలో పనిచేస్తున్న వారి జీతంలో కూడా భారీ పెరుగుదల ఉంది.
Also Read: Rahul Gandhi: ఢిల్లీలో బైక్ మెకానిక్ గా మారిన రాహుల్.. చూసి ఆశ్చర్యపోతున్న జనాలు
Also Read
- 8000mAh భారీ బ్యాటరీ, 200MP కెమెరా, Snapdragon 8 Elite Gen 5తో తో Xiaomi 17 Max పవర్ఫుల్ ఎంట్రీ.!
- Sambhaji Maharaj Jayanti: ఛత్రపతి శివాజీ వారసుడు.. మొఘలుల సింహస్వప్నం! ఛత్రపతి శంభాజీ మహారాజ్ వీరగాథ ఇదే..
- IPL Most Centuries: ఐపీఎల్లో అత్యధిక సెంచరీలు చేసిన వీరులు వీరే.. అగ్రస్థానంలో విరాట్ కోహ్లీ.!
- నేడే ఏపీ Cabinet Meeting.. రూ.2 లక్షల కోట్ల పెట్టుబడులకు గ్రీన్సిగ్నల్.. పొదుపు చర్యలపై కీలక చర్చ!
మరోవైపు ఇప్పటి వరకు 6000 రూపాయలు పొందే వారికి ఇప్పుడు 18000 రూపాయల జీతం ఇవ్వనున్నారు. విద్యా ప్రదాతలు గతంలో రూ.10,250 పొందేవారు, ఇప్పుడు వారికి 22 వేల రూపాయల జీతం వస్తుంది. దీంతో పాటు ఎంఏ, బీఈడీ చదివిన టీచర్లకు గతంలో రూ.11,000 జీతం వచ్చేది, ఇప్పుడు వారికి 23, 500 రూపాయల జీతం వస్తుంది. ఐఈవీ వాలంటీర్ల వేతనాన్ని రూ.5500 నుంచి రూ.15000కు పెంచామని.. రానున్న రోజుల్లో ఈ నోటిఫికేషన్ను విడుదల చేస్తామని ముఖ్యమంత్రి తెలిపారు.
Also Read: Monsoon Diet : వర్షాకాలంలో వ్యాధుల బారిన పడకుండా ఉండాలంటే వీటిని తప్పక తీసుకోవాలి..
వారి విద్యార్హతలు, సేవల్లోకి ప్రవేశించడానికి ప్రాథమిక షరతుల ఆధారంగా, వారి సేవలు 58 సంవత్సరాలు పూర్తయ్యే వరకు వారి వేతనాలు నిర్ణయించబడ్డాయి. ఉద్యోగాల కోసం ధర్నాలు చేసే ఉపాధ్యాయులు, ఇతర కార్మికులు ఇకపై ధర్నాలు చేయాల్సిన పని లేదన్నారు. వేసవి సెలవుల తర్వాత అందరికీ అపాయింట్మెంట్ ఇస్తామని సీఎం భగవంత్ మాన్ అన్నారు. రానున్న రోజుల్లో ఇతర శాఖల్లోనూ ఇటువంటి సవరణలు చేయనున్నారు. జాప్యం కావచ్చు కానీ మా ఉద్దేశంలో లోటు లేదన్నారు. గతంలో రాష్ట్రంలోని 14,000 మందికి పైగా కాంట్రాక్టు ఉపాధ్యాయుల సర్వీసుల క్రమబద్ధీకరణకు ముఖ్యమంత్రి భగవంత్ మాన్ ఆమోదం తెలిపారు.
ఉపాధ్యాయుల సమగ్రాభివృద్ధికి భరోసా కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయం ఇది. ఈ ఉపాధ్యాయులు విద్యా శాఖలో 10 సంవత్సరాలకు పైగా సేవలు అందించారని, ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం వారి సేవలను క్రమబద్ధీకరించిందని, అయితే మునుపటి ప్రభుత్వాలు ఈ సమస్యపై పెదవి విప్పలేదని ఆయన అన్నారు.
తాజావార్తలు
-
SBI GPAI: SBI అకౌంట్ ఉన్నవారు తప్పక తీసుకోవాల్సిన పాలసీ!.. రూ.20 లక్షలు పొందే ఛాన్స్!
-
Tollywood : టాలీవుడ్లో సెగలు పుట్టిస్తున్న ‘సింగిల్ స్క్రీన్’ వివాదం.. రెండుగా చీలిన నిర్మాతలు
-
8000mAh భారీ బ్యాటరీ, 200MP కెమెరా, Snapdragon 8 Elite Gen 5తో తో Xiaomi 17 Max పవర్ఫుల్ ఎంట్రీ.!
-
Virat Kohli: సెంచరీ కొట్టినా సెలబ్రేషన్స్ ఎందుకు జరుపుకోలేదు?.. కోహ్లీ ఇచ్చిన ఆన్సర్ వింటే ఫిదా అవ్వాల్సిందే!
-
Manish Pandey: క్యాచ్ ఆఫ్ ది సీజన్.. మనీష్ పాండే ఒక్క చేతి డైవ్.. కోహ్లీని ఆశ్చర్యపరచిన క్యాచ్
ట్రెండింగ్
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
-
Gold Import Duty: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!