Pune Porsche Crash Case: పుణె కారు ప్రమాదం కేసులో డాక్టర్ క్రిమినల్ నెట్వర్క్..!
- పుణెలో ఓ మైనర్ నిర్లక్ష్యపు డ్రైవింగ్ వల్ల ఇద్దరు ఐటీ ఉద్యోగులు మృతి..
- రక్త నమూనా మార్పిడికి పాల్పడిన కేసులో డాక్టర్ వెనక క్రిమినల్ బ్యాక్ గ్రౌండ్..
- ఈ కేసులో జువైనల్ జస్టిస్ బోర్డు ప్రాంగణంలోనే రూ.4 లక్షలు లంచం చెల్లించినట్లు రుజువు
Pune Porsche Crash Case: మహారాష్ట్రలోని పుణెలో ఓ మైనరు (17) నిర్లక్ష్య డ్రైవింగ్ కారణంగా ఇద్దరు ఐటీ ఉద్యోగులు మృతి చెందిన కేసు దర్యాప్తులో సంచలన నిజాలు బయటపడుతున్నాయి. రక్త నమూనా మార్పిడికి పాల్పడిన డాక్టర్ వెనుక పెద్ద క్రిమినల్ బ్యాక్ గ్రౌండ్ ఉందని వెల్లడైంది. తాజాగా, సదరు డాక్టర్ కు నిందితుడి తండ్రి విశాల్ అగర్వాల్ ఏకంగా జువైనల్ జస్టిస్ బోర్డు ప్రాంగణంలోనే రూ.4 లక్షలు లంచం చెల్లించినట్లు తెలిపారు. దీనికి సంబంధించిన సీసీ టీవీ దృశ్యాలను కూడా పోలీసులు సేకరించారు. నిందితుడి రక్త నమూనాలను మార్చేందుకు ఈ డబ్బు తీసుకున్నట్లు ససూన్ ఆస్పత్రి ప్యూన్ అతుల్ ఘాల్కాంబ్లే అనే వ్యక్తి వచ్చి తీసుకెళ్లినట్లు పేర్కొన్నారు. అయితే, మధ్యవర్తికి విశాల్ అగర్వాల్ డ్రైవర్ రూ. 4 లక్షలు ఇవ్వగా.. అందులోంచి రూ.3 లక్షలను డాక్టర్ అతుల్కు చెల్లించినట్లు తెలిపారు. ఇక, పోలీసులు ఇప్పటికే ఆస్పత్రి ప్యూన్ తో పాటు విశాల్ అగర్వాల్ దంపతులు, ఈ వ్యహారానికి మధ్యవర్తిగా వ్యవహరించిన అష్ఫాక్ మకాన్దార్ అనే వ్యక్తిని కూడా అదుపులోకి తీసుకున్నారు.
Read Also: Gold Price Today: స్థిరంగా బంగారం ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో తులం ఎంతుందంటే?
Also Read
- Freezer Ice Smell Solution: ఫ్రీజర్లోని ఐస్ నుంచి దుర్వాసన వస్తుందా..? 2 నిమిషాల్లో తొలగించే సులభమైన చిట్కాలు..!
- Iran-Trump: మా కొత్త ఆయుధం ప్రదర్శిస్తే గుండెపోటు రావొచ్చు.. ట్రంప్నకు ఇరాన్ వార్నింగ్
- స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
- AP SSC Results 2026: ఏపీ టెన్త్ ఫలితాలు విడుదల.. పెరిగిన ఉత్తీర్ణత..
ఇక, ససూన్ ఆస్పత్రిలోని ఫోరెన్సిక్ విభాగం పని తీరుపై అనేక ఆరోపణలు వస్తున్నాయి. ఈ విభాగం అధిపతి డాక్టర్ అజేయ్ తావ్డే గతంలో కూడా పలు కేసుల్లో ఇలానే రక్త నమూనాలు మార్చినట్లు ఆరోపణలు వచ్చాయని పుణె క్రైం బ్రాంచ్ అధికారులు వెల్లడించారు. నిందితుల రక్తనమూనాలు మార్చేయడం ఈ మూఠాకు ఇదే తొలిసారి కాదన్నారు. అతడికి సంబంధించిన డాక్టర్లు, బ్రోకర్ల నెట్వర్క్ పుణె చుట్టు పక్కలతో పాటు పశ్చిమ మహారాష్ట్రలోని నాలుగు జిల్లాల్లో విస్తరించినట్లు గుర్తించారు. ఏదైనా హైప్రొఫైల్ కేసుల బారిన పడిన కుటుంబాలను ఈ నెట్వర్క్ సభ్యులు సంప్రదించి.. వారికి స్వల్ప శిక్షలు పడేట్లు చేస్తారన్నారు. దాదాపు రెండేళ్ల నుంచి ఈ నెట్వర్క్ చురుగ్గా పని చేస్తున్నట్లు పుణె క్రైమ్ బ్రాంచ్ పోలీసులు వెల్లడించారు.
తాజావార్తలు
-
Freezer Ice Smell Solution: ఫ్రీజర్లోని ఐస్ నుంచి దుర్వాసన వస్తుందా..? 2 నిమిషాల్లో తొలగించే సులభమైన చిట్కాలు..!
-
Iran-Trump: మా కొత్త ఆయుధం ప్రదర్శిస్తే గుండెపోటు రావొచ్చు.. ట్రంప్నకు ఇరాన్ వార్నింగ్
-
Bhoghi : ‘కందుల సులోచన రాణి’గా.. అనుపమ.. ఫస్ట్ లుక్ బాగుంది
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Jasprit Bumrah: సీన్ రివర్స్.. బ్యాటర్ల ముందు బెంబేలెత్తిపోతున్న బుమ్రా.. కెరీర్లోనే చెత్త ప్రదర్శన!
ట్రెండింగ్
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!
-
Raw Mango Tomato Roti Pachadi: వేడివేడి అన్నానికి సూపర్ కాంబో “మామిడికాయ టమాటా రోటి పచ్చడి”.!
-
Open AI Financial Crisis : ఆర్థిక సంక్షోభంలో చాట్ జీపీటీ.?
-
Viral Wedding: పెళ్లి పీటలపై ఊహించని ట్విస్ట్.. వధువు ముందు వింత షరతు పెట్టిన పెళ్లి కొడుకు.. షాక్లో బంధువులు!