Wife Killed Husband : మహాతల్లి.. మొగుడిని వాకింగ్కని తీసుకెళ్లి వాచేటట్టు కొట్టి చంపించింది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Wife Killed Husband : కొత్తగా పెళ్లయింది.. సరదాగా కొన్ని రోజులు గడుపుదామని అత్తమామల వద్దకు వచ్చిన అల్లుడిని గుర్తు తెలియని నిందితులు హత్య చేశారు. ఈ ఘటన పుణెలోని మావల్లోని గహుంజేలో చోటుచేసుకుంది. అయితే ఈ హత్యాకాండ ఇప్పుడు మరో కొత్త మలుపు తిరిగింది. హత్యపై విచారణ ప్రారంభించిన పోలీసులు విచారణలో తేలిన విషయాలు విని షాక్ తిన్నారు. పదే పదే శారీరకంగా హింసించడం, కొట్టడంతో విసిగి వేసారిన భార్యే భర్తను హత్య చేసిందని పోలీసుల విచారణలో వెల్లడైంది. విచారణ అనంతరం పింప్రి-చించ్వాడ్ పోలీసులు మీడియాకు ఈ సమాచారం ఇచ్చారు. ఈ కేసులో హత్యకు గురైన సూరజ్ భార్యను తాలెగావ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ విషయమై పోలీసులు మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ఈ హత్య కేసులో ఎంతమంది నిందితులు ఉన్నారనే కోణంలో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
తన భర్తను గుర్తుతెలియని ముగ్గురు వ్యక్తులు పదునైన ఆయుధంతో పొడిచి హత్య చేశారని పోలీసుల విచారణలో పేర్కొంది చనిపోయిన సూరజ్ భార్య కల్పన. దీంతో కేసు నుంచి తేలికగా బయటపడవచ్చని అనకుంది. కానీ ఆమె బూటకం ఎక్కువ సేపు నిలువలేదు. చివరగా పోలీసుల విచారణలో తను అసలు నిజాన్ని అంగీకరించాల్సి వచ్చింది. అంతే కాకుండా తానే హత్య చేసినట్లు పోలీసుల ముందు అంగీకరించింది. ఆసక్తికర విషయం ఏమిటంటే వీరిద్దరి పెళ్లి మూడు నెలల క్రితమే జరిగింది. సూరజ్ ఓ కళాశాలలో ఉద్యోగం చేస్తుండేవాడు.
Also Read
- Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..
- Hyderabad: అమీర్పేట్లో భారీ అగ్ని ప్రమాదం.. పెద్ద ఎత్తున ఎగిసిపడుతున్న మంటలు
- AI in Media: ఏఐ ప్రపంచాన్నే మార్చేస్తోంది.. కానీ జర్నలిజాన్ని భర్తీ చేయగలదా?
- Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..
Read Also:Minister Malla Reddy: సురారం పీఎస్ ను ప్రారంభించిన మంత్రి మల్లారెడ్డి
పెళ్లయిన తర్వాత సూరజ్ తనను శారీరకంగా హింసించేవాడని, తీవ్రంగా కొట్టేవాడని భార్య ఆరోపిస్తోంది. దీంతో విసిగి వేసారిన భార్య భర్తను హత్య చేయాలని పథకం వేసింది. ఆ ప్రకారం ఆదివారం సెలవు దినం కావడంతో సూరజ్ తన అత్తమామల ఇంటికి రాగా, అతడి భార్య వాకింగ్ కు తీసుకెళ్లింది. అటుగా పొలాల్లోనికి నడుచుకుంటూ వెళ్లారు. అప్పటికే సూరజ్ ను చంపేందుకు ప్లాన్ చేసి కొందరిని కల్పన అక్కడ కాపు కాయించింది. వారంతా సూరజ్ కోసం మాటువేశారు. అక్కడికి సూరజ్ చేరుకోగానే ఆయుధాలతో దాడి చేసి హత్య చేశారు.
ఈ ఘటనపై సమాచారం అందుకున్న తలేగావ్ దబాడే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఆ తర్వాత ఘటనా స్థలంలో పంచనామా నిర్వహించి తదుపరి దర్యాప్తు ప్రారంభించారు. దోపిడీ కోసమే హత్య చేసినట్లు ప్రాథమికంగా తేలింది. అయితే భార్యను పదే పదే ప్రశ్నించడంతో అంతా బయటపడింది. ఈ కేసులో ప్రధాన నిందితురాలైన భార్యను తలేగావ్ దభాడే పోలీసులు అరెస్ట్ చేశారు.
Read Also:Minister Amarnath: రెండు రైళ్లలో ఏపీకి చెందిన 342 మందిని గుర్తించాం..
తాజావార్తలు
-
Electricity Bill: ఇంట్లో ఈ పరికరాలే మీ కరెంట్ బిల్లును పెంచుతున్నాయా? అసలు నిజం ఇదే
-
Chiranjeevi: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న చిరంజీవి ట్వీట్..’తండ్రిగా మాత్రమే కాదు.. నటుడిగా కూడా గర్వపడుతున్నా’
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..
-
Crime Thriller OTT : నమ్మిన వాళ్లే వెన్నుపోటు పొడిస్తే… ఓటీటీలోకి గూస్ బంప్స్ తెప్పించే కన్నడ క్రైమ్ థ్రిల్లర్
-
Hyderabad: అమీర్పేట్లో భారీ అగ్ని ప్రమాదం.. పెద్ద ఎత్తున ఎగిసిపడుతున్న మంటలు
ట్రెండింగ్
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..
-
Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!
-
రూ.11,999కే Lava Bold N2 5G స్మార్ట్ఫోన్ లాంచ్.. 6000mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో పాటు.!
-
Cleaning Tips : రాగి పాత్రలు నల్లబడ్డాయా..? 2 నిమిషాల్లో కొత్తవాటిలా మెరిపించే సీక్రెట్.!
-
Rainy Season Electrical Safety Tips: వర్షాలు దంచికొట్టడానికి ముందే మీ ఇంట్లో వైరింగ్ చెక్ తప్పనిసరి.!