Minister Malla Reddy: సురారం పీఎస్ ను ప్రారంభించిన మంత్రి మల్లారెడ్డి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సైబరాబాద్ కమీషనరేట్ పరిధిలో నూతనంగా ఏర్పడిన సురారం పోలీస్ స్టేషన్ ను ముఖ్య అతిథులుగా వచ్చిన మంత్రి మల్లారెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రితో పాటు ఎమ్మెల్యే వివేకానంద, మేడ్చల్ డీసీపీ సందీప్ రావు పాల్గొన్నారు. ఈ ప్రొగ్రాంలో ఏసీపీలు,సీఐలు, కార్పోరేటర్లు పాల్గొన్నారు. మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ.. మేడల్చ్ లో కొత్తగా 9 పోలీస్ స్టేషన్ లు.. 2 డీసీపీ ఆఫీస్ లు.. 3 ఏసీపీ ఆఫీస్ లు ఇచ్చినందుకు సీఎం కేసీఆర్, హోంమంత్రి మహ్మద్ ఆలీకి ధన్యవాదాలు అని మంత్రి మల్లారెడ్డి తెలిపారు.
Also Read : Odisha train accident: “నా బాధ్యత ముగియలేదు”.. ఎమోషనల్ అయిన రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్..
Also Read
- Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
- Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
- OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
- UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
తెలంగాణ ఏర్పాడక ముందు కేవలం రాష్ట్రంలో 60-70 పోలీస్ స్టేషన్ లు మాత్రమే ఉన్నాయి.. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత కొత్తగా 70 పీఎస్ లను ఇచ్చిన ఘనత సీఎం కేసీఆర్ కు దక్కుతుందని ఆయన అన్నారు. ఈ దశాబ్ధి ఉత్సవాల సందర్భంగా మనం ఈ పోలీస్ స్టేషన్ లను ప్రారంభించుకుంటున్నామన్నారు. నిన్న కేబుల్ బ్రిడ్జ్ మీద 500 డ్రోన్ కెమెరాలతో లేజర్ షో అద్భుతంగా నిర్వహించాము.. భారతదేశంలోనే అరుదైన ఘనత అది అని మల్లారెడ్డి తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో క్రైం రేట్ తగ్గించేందుకే నూతన పోలీస్ స్టేషన్లను ఏర్పాటు చేస్తున్నామన్నారు. క్రైం జరిగిన వెంటనే గంటల వ్యవధిలోనే నిందితులను పట్టుకునే వ్యవస్థ మన దగ్గర ఉండటం వల్లే వరుస పెట్టుబడులు రాష్ట్రానికి వస్తున్నాయని మంత్రి మల్లారెడ్డి వెల్లడించారు.
Also Read : Madhya Pradesh: మొన్న బీహార్లో నేడు ఎంపీలో.. వరుడు నల్లగా ఉన్నాడని పరారైన పెళ్లికూతురు
ఎమ్మెల్యే కేపీ వివేకానంద మాట్లాడుతూ.. సురారం పోలీస్ స్టేషన్ ఏర్పాటుతో ఈ పరిధిలో పూర్తిగా క్రైం రేట్ ను కంట్రోల్ చేసి నేర నియంత్రణలో పోలీస్ వ్యవస్థను కట్టుదిట్టం చేయాలని సైబరాబాద్ లోనే ఈ పోలీస్ స్టేషన్ ఉత్తమ పోలీస్ స్టేషన్ గా ఎదగాలని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా పరిపాలన సౌలభ్యం కోసం కొత్త పోలీస్ స్టేషన్ లను ఏర్పాటు చేసుకుంటున్నామని ఆయన అన్నారు. తెలంగాణ పోలీసులు శాంతిభద్రతలు రక్షించడంలో దేశంలోనే టాప్ లో ఉన్నారు అని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే అన్నారు.
తాజావార్తలు
-
Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!