Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Top Story Punches Kicks Inside Delhi Civic Body Amid Chaos Over Key Election

AAP vs BJP: ఎంసీడీలో ముదిరిన కొట్లాట.. జై మోదీ, జై కేజ్రీవాల్‌ అంటూ కొట్టుకున్న కార్పొరేటర్లు

Published Date :February 24, 2023 , 10:57 pm
By Mahesh Jakki
AAP vs BJP: ఎంసీడీలో ముదిరిన కొట్లాట.. జై మోదీ, జై కేజ్రీవాల్‌ అంటూ కొట్టుకున్న కార్పొరేటర్లు
  • Follow Us :
  • google news
  • dailyhunt

AAP vs BJP: ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్‌లోని స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో గందరగోళం నెలకొంది. కీలక ఎన్నికల ఓట్ల లెక్కింపు ఆమ్ ఆద్మీ పార్టీ, బీజేపీ మధ్య హోరాహోరీ పోరుకు దారితీసింది. ఒక్క ఓటు చెల్లకుండా పోవడంపై బీజేపీ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఢిల్లీ మునిసిపల్ కార్పొరేషన్‌లో అత్యంత శక్తివంతమైన సంస్థగా భావించే స్టాండింగ్ కమిటీ ఎన్నికల ఫలితం చెల్లని ఓటు లేకుండానే ప్రకటించబడుతుందని మేయర్ పట్టుబట్టారు. ఈ నిర్ణయంతో సభలో పోరాటాలు జరిగాయి. ఎన్నికైన కౌన్సిలర్లు ఒకరినొకరు కొట్టుకోవడం, తన్నడం జరిగింది. ఆమ్ ఆద్మీ పార్టీ, బీజేపీ మధ్య వాగ్వాదం కారణంగా స్టాండింగ్ కమిటీ ఎన్నికలు రద్దయ్యాయి. ఘర్షణ సమయంలో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) కౌన్సిలర్ అశోక్ కుమార్ మాను ఢిల్లీ సివిక్ సెంటర్‌లో కుప్పకూలారు. బీజేపీ గూండాల వల్ల ఈ గొడవ జరిగిందని ఆరోపించారు. ‘మహిళలు, మేయర్‌పై కూడా దాడి చేసేంత సిగ్గులేని వారు.. బీజేపీ గూండాలు ఈ పని చేశారు’ అని మాను అన్నారు. ఈ సభలో ఆప్, బీజేపీ నేతలు టేబుల్స్‌పైకి ఎక్కి నినాదాలు చేశారు. దీంతో, ఆ ప్రాంతంలో రసాభాస జరిగింది.

మరోవైపు.. ఈ ఎన్నికల్లో ఒక్క ఓటు చెల్లదంటూ మేయర్‌ షెల్లీ ఒబెరాయ్‌ ప్రకటించడంతో సభలో బాహాబాహీ జరిగింది. బీజేపీ, ఆప్ కౌన్సిలర్లు ఒకరిపై ఒకరు దాడికి పాల్పడ్డారు. సభలో తన్నుకోవడంతో పోలీసులు రంగం ప్రవేశం చేశారు. కౌన్సిలర్లను అడ్డుకున్నారు. కొందరు బీజేపీ కౌన్సిలర్లు మీకు తెలివి లేదంటూ ఆమెపై అరిచారు. “స్థాయీ సంఘం ఎన్నికల్లో బీజేపీ ఓడిపోతుందని గ్రహించిన వెంటనే, అది మా మేయర్‌పై దాడి చేసింది. షెల్లీ ఒబెరాయ్ తనను తాను రక్షించుకోవడానికి హౌస్ నుండి బయటకు పరుగెత్తాల్సి వచ్చింది. బీజేపీకి చెందిన మగ కౌన్సిలర్లు ఆమెపై భౌతిక దాడి చేశారు. బీజేపీ ఓటమిని అంగీకరించాలి. తాము ఓడిపోయామని గ్రహించినప్పుడు, వారు మహిళా మేయర్‌పై దాడి చేశారు’ అని ఆప్ ఎమ్మెల్యే అతిషి తెలిపారు. ఎన్నికల సమయంలో తనపై బీజేపీ కౌన్సిలర్లు దాడి చేశారని ఢిల్లీ కొత్త మేయర్ షెల్లీ ఒబెరాయ్ ఆరోపించడంతో ఈ నాటకం బుధవారం ప్రారంభమైంది.

Read Also: Jr. NTR political Entry: జూనియర్‌ ఎన్టీఆర్‌ పొలిటికల్‌ ఎంట్రీ.. నారా లోకేష్‌ ఆసక్తికర వ్యాఖ్యలు

స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో తామే గెలిచామని ఆప్ నేతలు చెబుతున్నప్పటికీ బీజేపీ మాత్రం అందుకు ఒప్పుకోవడం లేదు. అయితే, ఎన్నికల అధికారులు మొత్తం ఆరుగురు సభ్యుల స్టాండింగ్ కమిటీకి ముగ్గురు ఆప్ సభ్యులు, ముగ్గురు బీజేపీ సభ్యులు ఎన్నికయ్యారని తెలిపినట్లు బీజేపీ చెబుతోంది. ఆప్‌ తామే గెలిచినట్లు తప్పుడు ప్రకటన చేసిందని బీజేపీ ఎదురుదాడికి దిగింది. దీంతో, స్టాండింగ్ కమిటీ గెలుపు ఎవరిదనే విషయంపై సస్పెన్స్‌గా మారింది. ఈ నేపథ్యంలో సభలో కొందరు కౌన్సిలర్లు జై శ్రీరామ్‌, జై మోదీ అంటూ నినాదాలు చేయగా.. ఆప్‌ కౌన్సిలర్లు ఆమ్‌ ఆద్మీ పార్టీ జిందాబాద్‌, కేజ్రీవాల్‌ జిందాబాద్‌ అంటూ నినాదాలు చేశారు.ఇక, ఈ ఎన్నికల్లో ఆప్‌ కోసం అమీల్‌ మాలిక్‌, రమీందర్‌ కౌర్‌, మోహిని జీన్‌వాల్‌, సారిక చౌదరిలను నామినేట్‌ చేసింది. మరోవైపు, బీజేపీ కమల్‌జీత్‌ సెహ్రావత్‌, పంకజ్‌ లూథ్రాలను రంగంలోకి దింపింది. కాగా, బీజేపీలో చేరిన ఇండిపెండెంట్‌ కౌన్సిలర్‌ గజేందర్‌ సింగ్‌ దారాల్‌ కూడా పోటీలో ఉన్నారు. అయితే, స్టాండింగ్ కమిటీకి కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది. ఇది నిధులను ఎలా ఉపయోగించాలి, పలు ప్రాజెక్ట్‌లపై నిర్ణయం తీసుకునే అధికారం ఉంటుంది.

VIDEO | A councillor collapses as the ruckus continues in the MCD House. pic.twitter.com/aSDB5S4tfA

— Press Trust of India (@PTI_News) February 24, 2023

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • aam admi party
  • AAP vs BJP
  • bjp
  • delhi civic body
  • delhi municipal

తాజావార్తలు

  • Gaddar Film Awards 2026: సినీ అవార్డులు కొన్నాళ్లు నిర్లక్ష్యానికి గురయ్యాయి.. మెగాస్టార్ ఆవేదన..

  • Off The Record: గుంటూరు నియోజకవర్గంలో పెరిగిపోతున్న అసమ్మతి సెగలు

  • War Effect: భారత్ గ్యాస్ దిగుమతులపై యుద్ధం దెబ్బ.. ఇంధన పొదుపు తప్పదా..?

  • Bhatti Vikramarka : సినిమా అంటే కేవలం వినోదం మాత్రమే కాదు.. అది ప్రజల కోసం ఉండాలి

  • Lets Her Go With Lover: తన భార్యను ప్రియుడితో వెళ్లేందుకు అంగీకరించిన భర్త..

ట్రెండింగ్‌

  • Virat Kohli-IPL 2026: ‘కింగ్’ కోహ్లీ వచ్చేశాడు.. ఇక ప్రత్యర్థులకు డబిడదిబిడే!

  • 100W ఫాస్ట్ చార్జింగ్, 165Hz హై రిఫ్రెష్ రేట్ తో వచ్చేస్తున్న OnePlus 15T..!

  • Suresh Raina-CSK: ఇతర ఫ్రాంచైజీల నుంచి కెప్టెన్సీ ఆఫర్‌లు వచ్చాయి.. అయినా సీఎస్కేలోనే ఎందుకున్నానంటే?

  • Taurus Horoscope: ఖర్చులు అదుపులో ఉంచుకోవాల్సిందే.. వృషభ రాశి వారికి కొత్త ఏడాది ఎలా ఉండబోతుందంటే..!

  • Aries Horoscope: కొత్త ఏడాదిలో ‘మేషరాశి’ ఫలితాలు.. అనుకోని మార్గాల్లో ధనలాభం.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions