BEL Recruitment 2025: భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ లో ప్రాజెక్ట్ ఇంజనీర్ జాబ్స్.. మంచి జీతం.. ఈ అర్హతలుండాలి
- భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ లో ప్రాజెక్ట్ ఇంజనీర్ జాబ్స్
- మొత్తం 52 పోస్టులు
- నవంబర్ 20 వరకు ఆన్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రస్తుతం ఎక్కడ చూసిన లేఆఫ్స్ భయాలే నెలకొన్నాయి. ఉద్యోగం ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితి. ఉన్నపళంగా వందలు, వేల సంఖ్యలో ఉద్యోగులను తొలగిస్తున్నాయి కంపెనీలు. ఇలాంటి పరిస్థితుల్లో చాలా మంది ప్రభుత్వ ఉద్యోగాల కోసం ట్రై చేస్తున్నారు. మరి మీరు కూడా ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఇదే మంచి ఛాన్స్. భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) 52 ప్రాజెక్ట్ ఇంజనీర్ పోస్టుల భర్తీకి అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి, అభ్యర్థులు భారతదేశంలోని ఏదైనా గుర్తింపు పొందిన సంస్థ నుంచి ఎలక్ట్రానిక్స్, మెకానికల్ లేదా కంప్యూటర్ సైన్స్లో BE, BTech లేదా BSc డిగ్రీని పొంది ఉండాలి.
Also Read:Mahesh Kumar: 2-3 రోజుల్లో నిర్ణయం..! లోకల్ బాడీ ఎలక్షన్స్పై టీపీసీసీ అధ్యక్షుడు కీలక వ్యాఖ్యలు..
Also Read
- India-China Relations: సరిహద్దు విషయంలో చైనా ఒకలా.. భారత్ మరోలా.. మోడీ-జిన్పింగ్ భేటీ తర్వాత ఆసక్తికర పరిణామం!
- AFG vs IND: నేడే భారత్-ఆఫ్ఘాన్ మ్యాచ్.. బుడ్డోడిని ఆడిస్తారా?.. లైవ్ స్ట్రీమింగ్, టైమ్, జట్ల పూర్తి వివరాలు ఇవే..
- OTR: సిక్కోలులో వైసీపీకి గ్రూపుల గోల! స్థానిక ఎన్నికల వేళ అసలు రచ్చ ఇదేనా?
- Bangladesh: బంగ్లాదేశ్కు భారత్ ‘‘కరెంట్ షాక్’’..
దరఖాస్తు చేసుకోవడానికి అభ్యర్థులు 32 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు కలిగి ఉండకూడదు. SC, ST అభ్యర్థులకు ఐదు సంవత్సరాల వయో సడలింపు, OBC అభ్యర్థులకు మూడు సంవత్సరాల వయో సడలింపు, వికలాంగ అభ్యర్థులకు 10 సంవత్సరాల వయో సడలింపు లభిస్తుంది. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. జనరల్, OBC, EWS అభ్యర్థులు రాత పరీక్ష, ఇంటర్వ్యూలో కనీసం 35 శాతం మార్కులు సాధించాలి. SC, ST, దివ్యాంగుల అభ్యర్థులు రాత పరీక్ష, ఇంటర్వ్యూలో కనీసం 30 శాతం మార్కులు సాధించాలి.
Also Read:Tejashwi Yadav: గోడి మీడియాను నమ్మొద్దు.. సర్వేలపై తేజస్వి యాదవ్ ధ్వజం
ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు మొదటి సంవత్సరం నెలకు రూ. 40,000, రెండవ సంవత్సరం రూ. 45,000, మూడవ సంవత్సరం రూ. 50,000, నాల్గవ సంవత్సరం రూ. 55,000 జీతం లభిస్తుంది. దరఖాస్తు చేసుకోవడానికి, అభ్యర్థులు రూ. 472 దరఖాస్తు రుసుము చెల్లించాలి. ఇంకా, SC/ST, వికలాంగ అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు నుంచి మినహాయింపు ఉంది. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు నవంబర్ 20 వరకు ఆన్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. పూర్తి సమాచారం కోసం ఈ లింక్ పై క్లిక్ చేయండి.
తాజావార్తలు
-
Bigg Boss Telugu 10: ‘బిగ్ బాస్ తెలుగు 10’లో ఎవరు ఎంత సంపాదిస్తున్నారో తెలుసా?.. టాప్ లో ఆటో రామ్ ప్రసాద్..
-
US Open 2026: సబాలెంకాను ఓడించి ఎలెనా రిబాకినా చరిత్ర.. తొలిసారి యూఎస్ ఓపెన్ టైటిల్
-
Hanuman Ansh: రూ.2 కోట్ల బడ్జెట్.. రూ.200 కోట్ల వసూళ్లు.. ఆ ఒక్క పొరపాటుతో ఆస్కార్ ఛాన్స్ మిస్
-
Jana Sena : ఖమ్మంలో ఇవాళ జనసేన తెలంగాణ శంఖారావం.. భారీగా నేతలు, కార్యకర్తల రాక
-
BRICS Summit 2026: BRICSకి 20 ఏళ్లు.. ప్రత్యేక స్మారక తపాలా బిళ్లలు విడుదల చేసిన భారత్.. వీటి ప్రత్యేకత ఇదే
ట్రెండింగ్
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్తో సెప్టెంబర్ 15న భారత్లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!