Violence in Sambalpur: సంబల్పూర్లో చెలరేగిన హింస.. పట్టణంలో కర్ఫ్యూ విధింపు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Violence in Sambalpur: రాత్రిపూట చెదురుమదురు ఘటనలు హింసాత్మకంగా మారగా, అనుమానాస్పద పరిస్థితుల్లో ఓ వ్యక్తి మరణించిన తర్వాత శనివారం ఒడిశాలోని సంబల్పూర్ పట్టణంలో కర్ఫ్యూ విధించబడింది. శుక్రవారం సాయంత్రం హనుమాన్ జయంతి ఊరేగింపులు కట్టుదిట్టమైన భద్రతలో జరిగిన తరువాత హింస జరిగింది. శుక్రవారం జరిగిన హనుమాన్ జయంతి ర్యాలీలో తాజా హింస చెలరేగడంతో పలు దుకాణాలకు నిప్పు పెట్టారు. ముందుజాగ్రత్త చర్యగా సంబల్పూర్ పట్టణంలో జిల్లా యంత్రాంగం తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు కర్ఫ్యూ విధించినట్లు అధికారులు తెలిపారు. అయితే ప్రజలు ఉదయం 8 గంటల నుంచి 10 గంటల వరకు, మధ్యాహ్నం 3.30 నుండి సాయంత్రం 5.30 గంటల మధ్య బయటకు వెళ్లి నిత్యావసర వస్తువులను కొనుగోలు చేయవచ్చని నోటిఫికేషన్ పేర్కొంది.
అన్ని విద్యాసంస్థలు, వ్యాపార సంస్థలు, ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలు మూసి ఉంచాలని సంబల్పూర్ జిల్లా కలెక్టర్ అనన్య దాస్ తెలిపారు. ప్రజలు కూడా పరిపాలనకు సహకరించాలని, పశ్చిమ ఒడిశా నగరంలో శాంతిభద్రతలు త్వరగా నెలకొనేలా చూడాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. శుక్రవారం రాత్రి నగరంలో హింసాత్మక ఘటనలు చోటుచేసుకోవడంతో ఈ ప్రాంతంలో శాంతి, సాధారణ పరిస్థితులు నెలకొనేందుకు కర్ఫ్యూ విధించాలని నిర్ణయించినట్లు డీఐజీ (నార్త్ సెంట్రల్ రేంజ్) బ్రిజేష్ కుమార్ రాయ్ తెలిపారు. అనేక ప్రాంతాల్లో భారీగా పోలీసుల మోహరించినప్పటికీ, సెక్షన్ 144 అమలు చేయబడినప్పటికీ ర్యాలీలో హింస చెలరేగింది. పోలీసులు మరియు పరిపాలన పరిస్థితిని నియంత్రించడానికి ప్రయత్నించారు.
Also Read
- 4K 180Hz డిస్ప్లేతో 55, 65, 75 అంగుళాల్లో Hisense UR8S MiniLED TVలు లాంచ్..!
- Shubman Gill: భారత క్రికెట్ చరిత్రను మార్చనున్న కెప్టెన్ గిల్.. విరాట్, రోహిత్కి కూడా సాధ్యం కాలేదు..
- 9,070mAh బ్యాటరీ, IP69 రేటింగ్, AMOLED డిస్ప్లేతో REDMI K100 Pro Max లాంచ్..!
- Speaker Ayyanna Patrudu: ఎమ్మెల్యేల హాజరుకు ఇక కెమెరాలే సాక్ష్యం.. స్పీకర్ అయ్యన్న సంచలన నిర్ణయం
Read Also: Bus Accident: లోయలో పడిన బస్సు.. 13 మంది మృతి, 25 మందికి పైగా గాయాలు
ఈ నెల 12న ఒడిశాలో హనుమాన్ జయంతి బైక్ ర్యాలీలో ఉద్రిక్తత చెలరేగింది. ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఏప్రిల్ 12న సంబల్పూర్ జిల్లాలో ఇరు వర్గాల మధ్య హింసాత్మ క ఘటనలు చోటు చేసుకున్నాయి. దీంతో సంబల్పూర్ జిల్లాలో గురువారం ఉదయం 10 గంటల నుం చి 48 గంటల పాటు ఇంటర్నె ట్ సేవలను నిలిపివేశారు. జిల్లాలో 144 సెక్షన్ విధించారు. ఇరువర్గాల మధ్య ఘర్షణలు చోటుచేసుకోవడంతో రాష్ట్ర ప్రభుత్వం గురువారం నిషేధాజ్ఞలు జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం , ఒడిశాలోని సంబల్పూర్లో ఏప్రిల్ 15 వరకు వచ్చే 48 గంటల పాటు ఇంటర్నెట్ సేవలు నిలిపివేయబడతాయని పేర్కొన్నా రు. హనుమాన్ జయంతి సామాన్య సమితి సభ్యులు, భజరంగ్ దళ్ కార్యకర్తలు ఏప్రిల్ 12 సాయం త్ర 6 గంటల సమయంలో చేపట్టిన బైక్ ర్యాలీ సమయం లో పట్టణంలోని హిందూ, ముస్లిం వర్గాల మధ్య ఘర్షణలు జరిగాయని రాష్ట్ర హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రజాభద్రతకు భం గం కలిగిం చడానికి దుం డగులు సోషల్ మీడియా ద్వారా తప్పు డు సమాచారాన్ని ప్రసారం చేస్తున్నారని, వాట్సాప్, ఫేస్బుక్, ట్విట్టర్ మరియు ఇతర మీడియా వంటి మెసేజింగ్ ప్లాట్ఫారమ్లు మతపరమైన భావాలను రెచ్చగొట్టే అవకాశం ఉందని, దీం తోనే ఇంటర్నె ట్ సస్పెండ్ చేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే.
తాజావార్తలు
-
4K 180Hz డిస్ప్లేతో 55, 65, 75 అంగుళాల్లో Hisense UR8S MiniLED TVలు లాంచ్..!
-
Shubman Gill: భారత క్రికెట్ చరిత్రను మార్చనున్న కెప్టెన్ గిల్.. విరాట్, రోహిత్కి కూడా సాధ్యం కాలేదు..
-
Rocky Flintoff: తండ్రిని మించిన కొడుకు.. 18 ఏళ్ల రాకీ ఫ్లింటాఫ్ విధ్వంసం.. తండ్రి రికార్డులే టార్గెట్!
-
9,070mAh బ్యాటరీ, IP69 రేటింగ్, AMOLED డిస్ప్లేతో REDMI K100 Pro Max లాంచ్..!
-
Speaker Ayyanna Patrudu: ఎమ్మెల్యేల హాజరుకు ఇక కెమెరాలే సాక్ష్యం.. స్పీకర్ అయ్యన్న సంచలన నిర్ణయం
ట్రెండింగ్
-
200MP ట్రిపుల్ కెమెరా సెటప్, 8,580mAh బ్యాటరీ, 185Hz డిస్ప్లేతో REDMI K100 Pro లాంచ్.. ధర ఎంతంటే?
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!