Prof. Kodandaram : తెలంగాణ వచ్చింది ఉపాధి కోసం యువతకు మీరేం చేసారో చెప్పండి.?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ కోసం, యువత కోసం శ్రీకాంతాచారి ఆత్మ బలిదానం చేసుకున్నాడని ఈ నేపథ్యంలో ఈరోజుని యూత్ డిమాండ్స్ డే గా పాటిస్తున్నామన్నారు ప్రొఫెసర్ కోదండరాం. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ… కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి నిరుద్యోగ సమస్య మీద పోరాడుతున్నారు.. అందుకే వారిని పిలిచామన్నారు. మన కోసం బలిదానం చేసుకున్న 1200 మంది అమరులను ఎలా చూడాలి.? కేసీఆర్ చేసిన పోరాటం కూడా గొప్పదే అయినా కానీ రాష్ట్రం కోసం చనిపోయిన వారికి ఏం చేసారు.? అని ఆయన ప్రశ్నించారు. ఎనిమిదేళ్ళయినా ఇంకా అమరుల స్మృతి చిహ్నం ఇంకా పూర్తి కాలేదని, తెలంగాణ వచ్చింది ఉపాధి కోసం యువతకు మీరేం చేసారో చెప్పండి.? అని ఆయన వ్యాఖ్యానించారు. అమరుల కుటుంబాలను పరామర్శకు వెళ్తే మమ్మల్ని అరెస్ట్ చేసారని, నిరుద్యోగం కారణంగానే మేము చనిపోతున్నాం అని సూసైడ్ చేసుకున్న వారి లెటర్స్ ఇంకా ఉన్నాయన్నారు. ముఖ్యమంత్రి కాకపోతే నాకేమైంది అని కేసీఆర్ అంటున్నాడు.. మరి నిరుద్యోగులు ఏం కావాలి.? అని ఆయన మండిపడ్డారు.
Also Read : Tharun Bhascker: సెకండ్ షెడ్యూల్ లో ‘కీడా కోలా’!
రాష్ట్రంలో ఎక్కడ చూసిన నిరుద్యోగ యువత చాయ్ అమ్మనుకుంటున్నారు, తోపుడు బండల్లో వ్యాపారాలు చేసుకుంటున్నారన్నారు. ఎందుకు రాష్ట్రంలో ఈ పరిస్థితి వచ్చింది..? నాలుగు రేట్లు తెలంగాణలో నిరుద్యోగం పెరిగిందని ఆయన వ్యాఖ్యానించారు. ఉద్యోగం సామాజిక మార్పుకు దోహదపడుతుంది.. అందుకే ఉద్యోగాలు ఇవ్వండి అని అడుగుతున్నామని, ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయండి.. జాబ్ క్యాలెండర్ ని విడుదల చేయండి అని అడుగుతున్నామన్నారు. రాష్ట్రంలో నేటికీ 2.5 లక్షల ఉద్యోగ ఖాళీలు ఉన్నాయి.. దీనిపై చర్చకు సిద్ధం.. ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తామన్నారు.
Also Read
నియామకాల్లో అవినీతి లేకుండా చూడండని, ఎక్సమ్ పేపర్లలో తప్పులు లేకుండా ఇప్పటి వరకు ఒక్క పేపర్ రాలేదన్నారు. తప్పులు లేకుండా ఎక్సమ్ పేపర్ సెట్టింగ్ చేయండని, TSPSC కి నా పెన్షన్ నుంచి 10వేలు డొనేషన్ ఇస్తా.. నిరుద్యోగ సమస్యలపైనా రాష్ట్రం అతలాకుతలం అయ్యే ఉద్యమం చేస్తాం.. రాష్ట్రానికి వచ్చిన కంపెనీల లెక్క అంతా తప్పే.. రాష్ట్రంలో యువజన విధానాన్ని తీసుకురావాలని డిమాండ్ చేస్తున్నాం.. నిరుద్యోగం అనేది సామాజిక అణిచివేత.. దానిపై మనం పోరాడాలి.. తెలంగాణ అభివృద్ధి కోసం ఉద్యమం కంటే పెద్ద పోరాటం చేయాలనీ. జయశంకర్ సార్ చెప్పారు.. రాష్ట్ర సాధన కంటే అభివృద్ధి కోసం చేసే పోరాటం ఎందుకు క్లిష్టమైందో మా ఇండ్ల తలుపులు పగులగొట్టినప్పుడు అర్థమైంది. అని ఆయన వ్యాఖ్యానించారు.
తాజావార్తలు
-
Aasara Pensions: గుడ్న్యూస్.. తెలంగాణలో ఆసరా పింఛన్లపై బిగ్ అప్డేట్..
-
UP: యూపీలో భారీ తుపాను.. 11 మంది మృతి
-
CM Convoy: ‘నా కాన్వాయ్లో వాహనాలను కుదించండి’.. ఆదేశాలు జారీ చేసిన సీఎం చంద్రబాబు..
-
CBI Director: సీబీఐ డైరెక్టర్ ఎంపికపై కేంద్రం కీలక నిర్ణయం.. మళ్లీ లక్కీ ఛాన్స్ ఆయనకే
-
Pakistan: ‘‘భారత్, ఆఫ్ఘనిస్తాన్ ఒకటే’’.. పాక్ రక్షణ మంత్రి రెచ్చగొట్టే వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
-
Gold Import Duty: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!