Prof. Kodandaram : తెలంగాణ వచ్చింది ఉపాధి కోసం యువతకు మీరేం చేసారో చెప్పండి.?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ కోసం, యువత కోసం శ్రీకాంతాచారి ఆత్మ బలిదానం చేసుకున్నాడని ఈ నేపథ్యంలో ఈరోజుని యూత్ డిమాండ్స్ డే గా పాటిస్తున్నామన్నారు ప్రొఫెసర్ కోదండరాం. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ… కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి నిరుద్యోగ సమస్య మీద పోరాడుతున్నారు.. అందుకే వారిని పిలిచామన్నారు. మన కోసం బలిదానం చేసుకున్న 1200 మంది అమరులను ఎలా చూడాలి.? కేసీఆర్ చేసిన పోరాటం కూడా గొప్పదే అయినా కానీ రాష్ట్రం కోసం చనిపోయిన వారికి ఏం చేసారు.? అని ఆయన ప్రశ్నించారు. ఎనిమిదేళ్ళయినా ఇంకా అమరుల స్మృతి చిహ్నం ఇంకా పూర్తి కాలేదని, తెలంగాణ వచ్చింది ఉపాధి కోసం యువతకు మీరేం చేసారో చెప్పండి.? అని ఆయన వ్యాఖ్యానించారు. అమరుల కుటుంబాలను పరామర్శకు వెళ్తే మమ్మల్ని అరెస్ట్ చేసారని, నిరుద్యోగం కారణంగానే మేము చనిపోతున్నాం అని సూసైడ్ చేసుకున్న వారి లెటర్స్ ఇంకా ఉన్నాయన్నారు. ముఖ్యమంత్రి కాకపోతే నాకేమైంది అని కేసీఆర్ అంటున్నాడు.. మరి నిరుద్యోగులు ఏం కావాలి.? అని ఆయన మండిపడ్డారు.
Also Read : Tharun Bhascker: సెకండ్ షెడ్యూల్ లో ‘కీడా కోలా’!
రాష్ట్రంలో ఎక్కడ చూసిన నిరుద్యోగ యువత చాయ్ అమ్మనుకుంటున్నారు, తోపుడు బండల్లో వ్యాపారాలు చేసుకుంటున్నారన్నారు. ఎందుకు రాష్ట్రంలో ఈ పరిస్థితి వచ్చింది..? నాలుగు రేట్లు తెలంగాణలో నిరుద్యోగం పెరిగిందని ఆయన వ్యాఖ్యానించారు. ఉద్యోగం సామాజిక మార్పుకు దోహదపడుతుంది.. అందుకే ఉద్యోగాలు ఇవ్వండి అని అడుగుతున్నామని, ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయండి.. జాబ్ క్యాలెండర్ ని విడుదల చేయండి అని అడుగుతున్నామన్నారు. రాష్ట్రంలో నేటికీ 2.5 లక్షల ఉద్యోగ ఖాళీలు ఉన్నాయి.. దీనిపై చర్చకు సిద్ధం.. ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తామన్నారు.
Also Read
- INDIA alliance: రేపే ఇండియా కూటమి సమావేశం.. 23 పార్టీలు హాజరయ్యే ఛాన్స్..
- CM Chandrababu: స్థానిక ఎన్నికలపై సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు..
- India vs Pakistan: అంపైర్లు కూడా భారత్కే సపోర్ట్.. పాక్ క్రికెటర్ సంచలన ఆరోపణలు..
- TG20 League: 'హైదరాబాద్ ఈ ఛాంపియన్స్' ఫైనల్ స్క్వాడ్.. ఇదిగో పూర్తి లిస్ట్..
నియామకాల్లో అవినీతి లేకుండా చూడండని, ఎక్సమ్ పేపర్లలో తప్పులు లేకుండా ఇప్పటి వరకు ఒక్క పేపర్ రాలేదన్నారు. తప్పులు లేకుండా ఎక్సమ్ పేపర్ సెట్టింగ్ చేయండని, TSPSC కి నా పెన్షన్ నుంచి 10వేలు డొనేషన్ ఇస్తా.. నిరుద్యోగ సమస్యలపైనా రాష్ట్రం అతలాకుతలం అయ్యే ఉద్యమం చేస్తాం.. రాష్ట్రానికి వచ్చిన కంపెనీల లెక్క అంతా తప్పే.. రాష్ట్రంలో యువజన విధానాన్ని తీసుకురావాలని డిమాండ్ చేస్తున్నాం.. నిరుద్యోగం అనేది సామాజిక అణిచివేత.. దానిపై మనం పోరాడాలి.. తెలంగాణ అభివృద్ధి కోసం ఉద్యమం కంటే పెద్ద పోరాటం చేయాలనీ. జయశంకర్ సార్ చెప్పారు.. రాష్ట్ర సాధన కంటే అభివృద్ధి కోసం చేసే పోరాటం ఎందుకు క్లిష్టమైందో మా ఇండ్ల తలుపులు పగులగొట్టినప్పుడు అర్థమైంది. అని ఆయన వ్యాఖ్యానించారు.
తాజావార్తలు
-
Carrot Oil : ముఖం గ్లో అవ్వాలా.? క్యారెట్ నూనెతో మెరిసే చర్మం..
-
INDIA alliance: రేపే ఇండియా కూటమి సమావేశం.. 23 పార్టీలు హాజరయ్యే ఛాన్స్..
-
CM Revanth Reddy : సైబరాబాద్కు రూ.1,858 కోట్ల బూస్ట్.. రేపు సీఎం భారీ శంకుస్థాపనలు
-
CM Chandrababu: స్థానిక ఎన్నికలపై సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు..
-
Kitchen Hacks: ఇలా చేస్తే మీ వంటింట్లోకి చీమలు చచ్చినారావు.. కేవలం 2 నిమిషాల్లో ఇంట్లోనే ఈ నాచురల్ స్ప్రే చేసుకోండిలా!
ట్రెండింగ్
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!
-
Vaibhav Sooryavanshi-BCCI: బుడ్డోడు భలే లక్కీ.. రోహిత్, కోహ్లీకి లేని ప్రత్యేక సౌకర్యం!
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!