Priyanka Gandhi: రేపు మధ్యప్రదేశ్లో ప్రియాంక గాంధీ పర్యటన.. అధికారమే లక్ష్యంగా..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు అధికారికంగా ప్రకటించనప్పటికీ.. రాజకీయ ఎత్తుగడలు మాత్రం మొదలయ్యాయి. అధికారాన్ని నిలుపుకునేందుకు బీజేపీ పాకులాడుతుండగా.. అధికారంలోకి వచ్చేందుకు కాంగ్రెస్ పావులు కదుపుతోంది. అందుకోసం కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ఎన్నికల సమరంలో జోరుమీదున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రియాంక గాంధీ.. శుక్రవారం గ్వాలియర్-చంబల్ ప్రాంతంలో పర్యటించనున్నారు. అనంతరం అక్కడ జరిగే బహిరంగ సభలో పాల్గొననున్నారు. కాంగ్రెస్ను వీడి బీజేపీలో చేరిన కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియాకు గ్వాలియర్-చంబల్ ప్రాంతం కంచుకోటగా ఉంది. సింధియా బీజేపీలో చేరిన తర్వాత గ్వాలియర్-చంబల్ ప్రాంతంపై కాంగ్రెస్ కన్నేసింది. ఎలాగైనా రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేందుకు ప్రియాంక గాంధీ పన్నాగాలు పన్నుతున్నారు.
Project K: ‘ప్రాజెక్ట్ కె’ కామిక్ ఆర్ట్ పోస్టర్స్ లీక్.. స్టోరీ తెలిసిపోయింది.. ?
Also Read
- ‘RRకు ఏమైనా బుద్ధి ఉందా..? గెలిచే మ్యాచ్ను చేతులారా జీటీకి ఇచ్చేశారు.. వారిద్దరి వల్లనే మ్యాచ్ పోయింది’
- Wife Harassment: భార్య వేధిస్తుంది, మరణించే అనుమతి ఇవ్వండి..
- Drushyam 4: దృశ్యం తరహాలో పాల వ్యాపారి స్కెచ్.. చివరికిలా దొరికిపోయాడు
- Shubman Gill Vs Vaibhav: వైభవ్ సూర్యవంశీ నరకం చూపిస్తాడు.. సంచలన వ్యాఖ్యలు చేసిన శుభ్మన్ గిల్..
ఇప్పటికే జూన్ 12న ప్రియాంకగాంధీ రాష్ట్రంలోని జబల్పూర్లో జరిగిన ర్యాలీలో ప్రసంగించి.. ప్రచారాన్ని ప్రారంభించారు. కాంగ్రెస్ కు ఓటు వేస్తే మహిళలకు నెలకు రూ. 1,500 ఆర్థిక సహాయంతో సహా ఐదు పథకాలను అమలు చేస్తామని చెప్పారు. అంతేకాకుండా100 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ మరియు పాత పెన్షన్ స్కీమ్ (OPS) పునరుద్ధరణ చేస్తామన్నారు. మరోవైపు అక్కడి ప్రభుత్వంపై ప్రియాంక గాంధీ విరుచుకుపడ్డారు. శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని.. ఉద్యోగాలు కల్పించడంలో విఫలమైందని ఆరోపించింది. కాంగ్రెస్ నుండి బిజెపిలో చేరిన నాయకుడు కేంద్ర మంత్రి సింధియాపై కూడా విరుచుకుపడింది. కాంగ్రెస్ కు విధేయుడిగా ఉన్న సింధియా.. 2020 మార్చిలో బిజెపిలో చేరారు. దీంతో 15 నెలల్లో కమల్ నాథ్ నేతృత్వంలోని ప్రభుత్వం పతనానికి దారితీసింది. అంతేకాకుండా చౌహాన్ తిరిగి అధికారంలోకి రావడానికి మార్గం సుగమం చేసింది.
MLC Kavitha: తొమ్మిదేళ్లలోనే 47 బిలియన్ కోట్ల పెట్టుబడులు.. 30 లక్షల ఉద్యోగాలు
గ్వాలియర్-చంబల్ ప్రాంతం మధ్యప్రదేశ్ రాజకీయాల్లో కింగ్ మేకర్ కంటే తక్కువ కాదు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో గ్వాలియర్-చంబల్ సంభాల్ ప్రాంతంలోని 34 అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్ 26, బీజేపీ 7, బీఎస్పీ ఒక సీటు గెలుచుకున్నాయి. ఈ విధంగా మధ్యప్రదేశ్లో కాంగ్రెస్ తిరిగి అధికారంలోకి రావడంలో గ్వాలియర్-చంబల్ ప్రాంతం ప్రధాన పాత్ర పోషించింది. అయితే కాంగ్రెస్ నుండి గెలిచిన ఎమ్మెల్యేల తిరుగుబాటు కూడా కమల్ నాథ్ ప్రభుత్వ ఉపసంహరణకు కారణంగా మారింది. సింధియా కాంగ్రెస్ నుండి నిష్క్రమణ తర్వాత.. గ్వాలియర్ ప్రాంతంలో కాంగ్రెస్ సొంతంగా నిలబడే కసరత్తులో నిమగ్నమై ఉంది. అంతేకాకుండా సింధియాకు సన్నిహితంగా ఉన్న నాయకులను కూడా తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశముంది.
తాజావార్తలు
-
క్వాలిఫైయర్-1లో చిత్తు చేసిన RCB.. ఫైనల్లో GT ప్రతీకారం తీర్చుకుంటుందా? క్లైమాక్స్ ఫైట్ పూర్తి వివరాలు ఇవే..
-
CM Vijay: తలా అజిత్ నివాసానికి తమిళనాడు సీఎం జోసెఫ్ విజయ్.. వెంట వచ్చిన స్టార్ హీరోయిన్ త్రిష!
-
Saunf Sharbat : సోంపు-బెల్లం షర్బత్ తాగితే మండుటెండలో కూడా చల్లగా ఉండచ్చు.! ఎలా చేసుకోవాలో తెలుసా ?
-
Banking Rules : జూన్ 1 నుంచి కొత్త బ్యాంకింగ్ రూల్స్ వస్తున్నాయా? వైరల్ అవుతున్న వార్తల్లో నిజం ఎంత?
-
‘RRకు ఏమైనా బుద్ధి ఉందా..? గెలిచే మ్యాచ్ను చేతులారా జీటీకి ఇచ్చేశారు.. వారిద్దరి వల్లనే మ్యాచ్ పోయింది’
ట్రెండింగ్
-
Munakkaya Pachadi: ఆరోగ్యం + టెస్ట్ సూపర్ కాంబో.. ‘మునక్కాయ పచ్చడి’ చేసేయండి ఇలా.!
-
Airtel మాస్టర్ ప్లాన్.. రూ.469కే 84 రోజుల వ్యాలిడిటీ.. పూర్తి డీటెయిల్స్ ఇలా.!
-
Frog Control Tips : ఇంట్లోకి కప్పలు రాకుండా ఉండాలా? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Tea Ranking : ప్రపంచాన్ని గెలిచిన భారతీయ చాయ్.. ‘నంబర్ 1’గా మసాలా టీ రికార్డ్..!
-
Pachimirchi Avakaya: సీజన్తో పనిలేదు.. మామిడి ఆవకాయకు గట్టి పోటీ ఇచ్చే ‘పచ్చిమిర్చి ఆవకాయ’.! తింటే వావ్ అనాల్సిందే..