Priyank Gandhi: ఆ ఒక్క కారణంతోనే పోటీకి దూరమయ్యారా!?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రియాంకాగాంధీ.. పరిచయం అక్కర్లేని పేరు. రాజీవ్-సోనియాల కుమార్తెగా.. రాహుల్ గాంధీ సోదరిగా.. రాబర్ట్ వాద్రా భార్యగా ప్రియాంక అందరికీ తెలిసిన ముఖమే. అయితే ఆమె ఇప్పటి వరకు ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాలేదు. ఈసారి ఖాయమని అంతా భావించారు. చివరికి తుస్ మనిపించారు. రాయ్బరేలీ నుంచి బరిలోకి దిగుతున్నారని అంతా ప్రచారం జరిగింది. కానీ చివరికి ఆ స్థానం నుంచి రాహుల్గాంధీనే బరిలోకి దిగారు. దీంతో ఒకింత కాంగ్రెస్ శ్రేణులు నిరాశకు గురయ్యారు. అయితే ప్రియాంక పోటీ నుంచి తప్పుకోవడం వెనుక రకరకాలైన ఊహాగానాలు వినిపిస్తున్నా.. ఆ ఒక్క కారణంతోనే ఆమె పోటీ నుంచి తప్పుకున్నట్లు తెలుస్తోంది.
ఇది కూడా చదవండి: Uttarakhand : నైనిటాల్లోని నైని సరస్సులో వేగంగా కనుమరుగవుతున్న నీరు
Also Read
- India vs Afghanistan T20: వాషింగ్టన్, నితీష్ ఎంపికపై మాజీ క్రికెటర్ అసంతృప్తి.. గంభీర్పై పరోక్ష విమర్శలు
- Liquor Prices: మద్యం బాటిళ్లపై అదనపు వసూళ్లు.. సీఎం సీరియస్.. 3 రోజుల్లో 240 మందిపై వేటు..
- Vaibhav Sooryavanshi: ‘వైభవ్ వల్లే నా భార్య దులీప్ ట్రోఫీ చూసింది’.. శ్రీకాంత్ కామెంట్స్ వైరల్
- Gold and Silver Prices Today: మరోసారి బంగారం ధరల పతనం.. నేటి గోల్డ్, సిల్వర్ రేట్లు ఇవే..
ఇప్పటికే తల్లి సోనియా రాజస్థాన్ నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు. ఇక సోదరుడు రాహుల్ గాంధీ వయనాడ్ నుంచి పోటీ చేస్తున్నారు. తాజాగా రాయ్బరేలీ నుంచి కూడా రాహుల్ పోటీ చేస్తున్నారు. అంటే ఇప్పటికే గాంధీ ఫ్యామిలీ నుంచి మూడు స్థానాల్లో బరిలోకి దిగారు. ఇక ప్రియాంక కూడా మరో స్థానం నుంచి పోటీ చేస్తే నాల్గో స్థానం అవుతుంది. ఈ నేపథ్యంలో ప్రత్యర్థులకు అస్త్రంగా మారే అవకాశాలు ఉన్న నేపథ్యంలో ప్రియాంక పోటీ నుంచి తప్పుకున్నట్లు సమాచారం. గాంధీ కుటుంబాన్ని టార్గెట్ చేసుకుని బీజేపీ విమర్శలు చేసే అవకాశం ఉన్న నేపథ్యంలోనే ప్రియాంక లోక్సభ బరిలోకి దిగకూడదని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.
ఇది కూడా చదవండి: Health Tips : మామిడిపండ్లు తింటే బరువు పెరుగుతారా?
ఇదిలా ఉంటే సోనియాగాంధీ ఈసారి ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకున్నారు. రాజస్థాన్ నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు. ఈ నేపథ్యంలో ప్రియాంక.. రాయ్బరేలీ నుంచి బరిలోకి దిగొచ్చని బాగా ప్రచారం జరిగింది. కానీ చివరికి అంతా రివర్స్ అయింది. ఇక అమేథీలో ప్రియాంక భర్త రాబర్ట్ వాద్రా పోటీ చేయొచ్చని కూడా వార్తలు వినిపించాయి. కానీ ఆయనకు కాకుండా గాంధీ ఫ్యామిలీకి విధేయుడైన కేఎల్.శర్మకు సీటు దక్కింది. ఇక్కడ కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ బీజేపీ నుంచి బరిలో ఉన్నారు. గత ఎన్నికల్లో రాహుల్ గాంధీపై 55 వేల ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. తాజాగా ఎన్నికల్లో స్మృతి ఇరానీకి కేఎల్.శర్మ ఎలాంటి పోటీ ఇవ్వనున్నారో మరికొన్ని రోజుల్లో తేలిపోనుంది.
ఇది కూడా చదవండి: Prasanna Vadanam Review : ప్రసన్నవదనం మూవీ రివ్యూ…
తాజావార్తలు
-
India vs Afghanistan T20: వాషింగ్టన్, నితీష్ ఎంపికపై మాజీ క్రికెటర్ అసంతృప్తి.. గంభీర్పై పరోక్ష విమర్శలు
-
Nepal Flash Floods: నేపాల్ను వెంటాడుతున్న ప్రకృతి విపత్తు.. దార్చులాలో విరిగిపడిన కొండచరియలు
-
Vivek Venkataswamy: చెన్నూరుకు మహర్దశ.. రూపురేఖలు మారుస్తా.. మోడల్ పట్టణంగా తీర్చిదిద్దుతా
-
Lenovo Yoga Tab Plus Gen 2: 12,700mAh బ్యాటరీ.. 4K 144Hz డిస్ప్లే.. లెనోవో యోగా ట్యాబ్ ప్లస్ జెన్ 2 వచ్చేసింది
-
Hanuman Ansh Singer: ఒక్క పాటతో అంధ గాయకుడి లైఫ్ టర్న్.. బాలీవుడ్ నుంచి వరుస ఆఫర్లు..
ట్రెండింగ్
-
Shubman Gill Uncle: అకాయ్కు ‘అంకుల్’గా శుభ్మన్ గిల్.. వైరల్గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!