Priyank Gandhi: ఆ ఒక్క కారణంతోనే పోటీకి దూరమయ్యారా!?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రియాంకాగాంధీ.. పరిచయం అక్కర్లేని పేరు. రాజీవ్-సోనియాల కుమార్తెగా.. రాహుల్ గాంధీ సోదరిగా.. రాబర్ట్ వాద్రా భార్యగా ప్రియాంక అందరికీ తెలిసిన ముఖమే. అయితే ఆమె ఇప్పటి వరకు ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాలేదు. ఈసారి ఖాయమని అంతా భావించారు. చివరికి తుస్ మనిపించారు. రాయ్బరేలీ నుంచి బరిలోకి దిగుతున్నారని అంతా ప్రచారం జరిగింది. కానీ చివరికి ఆ స్థానం నుంచి రాహుల్గాంధీనే బరిలోకి దిగారు. దీంతో ఒకింత కాంగ్రెస్ శ్రేణులు నిరాశకు గురయ్యారు. అయితే ప్రియాంక పోటీ నుంచి తప్పుకోవడం వెనుక రకరకాలైన ఊహాగానాలు వినిపిస్తున్నా.. ఆ ఒక్క కారణంతోనే ఆమె పోటీ నుంచి తప్పుకున్నట్లు తెలుస్తోంది.
ఇది కూడా చదవండి: Uttarakhand : నైనిటాల్లోని నైని సరస్సులో వేగంగా కనుమరుగవుతున్న నీరు
Also Read
- West Nile Fever: డెంగ్యూ, మలేరియానే కాదు.. కేరళలో దోమ కాటుతో మరో ప్రాణాంతక వ్యాధి!
- Zojila Tunnel Breakthrough: భారత ఇంజినీరింగ్ అద్భుతం.. 'జోజిలా టన్నెల్ బ్రేక్ త్రూ' ను ప్రారంభించిన కేంద్ర మంత్రి..
- Ganja Party Busted: గంజాయి పార్టీ గుట్టురట్టు.. పోలీసుల అదుపులో ఆయుర్వేద డాక్టర్.!
- Nara Lokesh: డబ్బులిచ్చి చేతులు దులుపుకోవడానికి రాలేదు.. మంత్రి లోకేశ్ ఫైర్!
ఇప్పటికే తల్లి సోనియా రాజస్థాన్ నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు. ఇక సోదరుడు రాహుల్ గాంధీ వయనాడ్ నుంచి పోటీ చేస్తున్నారు. తాజాగా రాయ్బరేలీ నుంచి కూడా రాహుల్ పోటీ చేస్తున్నారు. అంటే ఇప్పటికే గాంధీ ఫ్యామిలీ నుంచి మూడు స్థానాల్లో బరిలోకి దిగారు. ఇక ప్రియాంక కూడా మరో స్థానం నుంచి పోటీ చేస్తే నాల్గో స్థానం అవుతుంది. ఈ నేపథ్యంలో ప్రత్యర్థులకు అస్త్రంగా మారే అవకాశాలు ఉన్న నేపథ్యంలో ప్రియాంక పోటీ నుంచి తప్పుకున్నట్లు సమాచారం. గాంధీ కుటుంబాన్ని టార్గెట్ చేసుకుని బీజేపీ విమర్శలు చేసే అవకాశం ఉన్న నేపథ్యంలోనే ప్రియాంక లోక్సభ బరిలోకి దిగకూడదని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.
ఇది కూడా చదవండి: Health Tips : మామిడిపండ్లు తింటే బరువు పెరుగుతారా?
ఇదిలా ఉంటే సోనియాగాంధీ ఈసారి ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకున్నారు. రాజస్థాన్ నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు. ఈ నేపథ్యంలో ప్రియాంక.. రాయ్బరేలీ నుంచి బరిలోకి దిగొచ్చని బాగా ప్రచారం జరిగింది. కానీ చివరికి అంతా రివర్స్ అయింది. ఇక అమేథీలో ప్రియాంక భర్త రాబర్ట్ వాద్రా పోటీ చేయొచ్చని కూడా వార్తలు వినిపించాయి. కానీ ఆయనకు కాకుండా గాంధీ ఫ్యామిలీకి విధేయుడైన కేఎల్.శర్మకు సీటు దక్కింది. ఇక్కడ కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ బీజేపీ నుంచి బరిలో ఉన్నారు. గత ఎన్నికల్లో రాహుల్ గాంధీపై 55 వేల ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. తాజాగా ఎన్నికల్లో స్మృతి ఇరానీకి కేఎల్.శర్మ ఎలాంటి పోటీ ఇవ్వనున్నారో మరికొన్ని రోజుల్లో తేలిపోనుంది.
ఇది కూడా చదవండి: Prasanna Vadanam Review : ప్రసన్నవదనం మూవీ రివ్యూ…
తాజావార్తలు
-
West Nile Fever: డెంగ్యూ, మలేరియానే కాదు.. కేరళలో దోమ కాటుతో మరో ప్రాణాంతక వ్యాధి!
-
Peddi : “పెద్ది”పై అల్లు అర్జున్ జెన్యూన్ రివ్యూ… ప్రశంసల వర్షం
-
Zojila Tunnel Breakthrough: భారత ఇంజినీరింగ్ అద్భుతం.. ‘జోజిలా టన్నెల్ బ్రేక్ త్రూ’ ను ప్రారంభించిన కేంద్ర మంత్రి..
-
Ganja Party Busted: గంజాయి పార్టీ గుట్టురట్టు.. పోలీసుల అదుపులో ఆయుర్వేద డాక్టర్.!
-
Nara Lokesh: డబ్బులిచ్చి చేతులు దులుపుకోవడానికి రాలేదు.. మంత్రి లోకేశ్ ఫైర్!
ట్రెండింగ్
-
Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?
-
Vivo Y31s 5G లాంచ్.. IP69K+ రేటింగ్, 6500mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్ తో అదిరిపోయే ఫీచర్లు.!
-
7.7 మి.మీ. మందం, 5200mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే కేవలం రూ.11,999లకే.. Infinix Smart 20 లాంచ్.!
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!