Priyanka Gandhi: వందేమాతరంపై చర్చ వెనుక కారణం ఇదే.. కేంద్రంపై ప్రియాంక గాంధీ సీరియస్
- నరేంద్ర మోడీ ఒకప్పటి ప్రధానిగా కనిపించడం లేదు
- గొప్ప వ్యక్తులను అవమానించడమే ఈ చర్చ ఉద్దేశం
- నెహ్రూ ఈ దేశం కోసమే జీవించారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Priyanka Gandhi: లోక్సభలో వందేమాతరంపై జరిగిన చర్చ సందర్భంగా కాంగ్రెస్ నాయకురాలు, ఎంపీ ప్రియాంక గాంధీ మాట్లాడారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. భారతదేశంలోని ప్రతి అణువులో వందేమాతరం ఉందని, మరి దాని గురించి చర్చించాల్సిన అవసరం ఎందుకు వచ్చిందని ప్రశ్నించారు. పశ్చిమ బెంగాల్లో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల కారణంగా కేంద్ర ప్రభుత్వం వందేమాతరం గురించి చర్చిస్తోందని ఆమె ఆరోపించారు. వాస్తవానికి వందేమాతరం ప్రస్తావన వచ్చినప్పుడు, మనకు చరిత్ర గుర్తుకు వస్తుందని అన్నారు.
READ ALSO: Akhanda 2: తెరపైకి కొత్త డేట్.. డిస్ట్రిబ్యూటర్లకు సమాచారం?
Also Read
- 200MP ట్రిపుల్ కెమెరా సెటప్, 8,580mAh బ్యాటరీ, 185Hz డిస్ప్లేతో REDMI K100 Pro లాంచ్.. ధర ఎంతంటే?
- Donald Trump: అమెరికా అధ్యక్షుడి రహస్య ప్రయాణం.. అసలు కారణం ఇదే!
- Jharkhand Student Protest: జార్ఖండ్లో ఉద్రిక్తంగా మారిన నిరుద్యోగుల పోరు.. అర్ధరాత్రి పోలీసులు ఎందుకు వచ్చారు?
- CM Chandrababu: సైబర్ క్రైమ్, గంజాయి, బ్లేడ్ బ్యాచ్లపై ఉక్కుపాదం.. నేడు సీఎం ఉన్నతస్థాయి సమీక్ష..
“ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఒకప్పటి ప్రధానిగా కనిపించడం లేదు. ఆయన మంచి ప్రసంగాలు చేస్తారు, కానీ వాస్తవాలను అర్థం చేసుకోరు. మోడీ ప్రజలకు వాస్తవాలను అందించే విధానం ఆయన నైపుణ్యానికి నిదర్శనం. కానీ నేను ప్రజా ప్రతినిధిని – కళాకారుడిని కాదు” అని ప్రియాంక గాంధీ అన్నారు. వందేమాతరం గురించి ప్రస్తావించినప్పుడు, మనకు మొత్తం చరిత్ర గుర్తుకు వస్తుందని, అది స్వాతంత్య్ర పోరాట చరిత్ర, స్వేచ్ఛ కోసం పోరాటం, నైతికత, బ్రిటిష్ సామ్రాజ్య పతనం గుర్తుకు వస్తుందన్నారు. వందేమాతరం భారతదేశ ప్రజలను రాజకీయ, నైతిక ఆకాంక్షతో అనుసంధానించిందని అన్నారు. వందేమాతరం నిద్రపోతున్న భారతదేశాన్ని మేల్కొలిపిందని, దానిపై ఈ రోజు చర్చ వింతగా అనిపిస్తుందని చెప్పారు. ఇంతకీ ఈ రోజు ఈ చర్చ అవసరం ఏమిటి, దీని ఉద్దేశ్యం ఏమిటి? అని ప్రశ్నించారు.
వాస్తవానికి వందేమాతరంపై ప్రస్తుత చర్చ వెనుక రెండు ప్రధాన కారణాలు ఉన్నాయని ప్రియాంక గాంధీ అన్నారు. మొదటిది బెంగాల్ ఎన్నికలు, రెండవది దేశం కోసం త్యాగాలు చేసిన వారిపై కొత్త ఆరోపణలు చేయాలనే ఈ ప్రభుత్వం కోరిక అని స్పష్టం చేశారు. ఈ ప్రభుత్వం భవిష్యత్తు వైపు చూడాలని అనుకోకుండా, మనల్ని గతంలోకి లాగడమే లక్ష్యంగా పెట్టుకున్నారని విమర్శించారు. నిజం ఏమిటంటే నేడు ఉన్న ప్రధాన మంత్రి మోడీ ఒకప్పటి ప్రధానిగా లేరని, ప్రస్తుత ఆయన విధానాలు దేశాన్ని బలహీనపరుస్తున్నాయని అన్నారు. నేడు దేశ ప్రజలు సంతోషంగా లేరని, ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. నిత్యం ప్రజలు అనేక సమస్యలతో పోరాడుతున్నారని, ప్రభుత్వం వాటికి పరిష్కారాలను కనుగొనడం లేదని అన్నారు. కొందరి కారణంగా దేశానికి హాని జరుగుతోందని అన్నారు. అందుకే ఈ రోజు వందేమాతరం గురించి చర్చిస్తున్నామని, వాస్తవానికి దేశంలోని ప్రతి అణువులో వందేమాతరం సజీవంగా ఉందని, దాని గురించి చర్చించకూడదని స్పష్టం చేశారు.
ప్రజా సమస్యలపై ఒత్తిడి తేకుండా దేశం దృష్టిని మళ్లించాలని ఈ ప్రభుత్వం వందేమాతరంపై చర్చ పెట్టి కోరుకుంటోందని ప్రియాంక గాంధీ అన్నారు. వందేమాతరం స్వభావాన్ని ప్రశ్నించడం దానికి సంబంధించి నిర్ణయాలు తీసుకున్న గొప్ప వ్యక్తులను అవమానించడమే ఈ చర్చ ఉద్దేశమని విమర్శించారు. “నెహ్రూ ఇస్రోను సృష్టించకపోతే, మీరు ఈరోజు చంద్రుడిని చేరుకునేవారు కాదు. ఆయన గెయిల్, బిహెచ్ఇఎల్, సెయిల్లను సృష్టించకపోతే భారతదేశం ఎలా ఉండేది? పండిట్ జవహర్లాల్ నెహ్రూ ఈ దేశం కోసమే జీవించారు” అని ప్రియాంక గాంధీ స్పష్టం చేశారు.
READ ALSO: Musheerabad Murder: దారుణం.. పెళ్లికి నో చెప్పిందని మరదలిని చంపిన మేనబావ..
తాజావార్తలు
-
200MP ట్రిపుల్ కెమెరా సెటప్, 8,580mAh బ్యాటరీ, 185Hz డిస్ప్లేతో REDMI K100 Pro లాంచ్.. ధర ఎంతంటే?
-
Donald Trump: అమెరికా అధ్యక్షుడి రహస్య ప్రయాణం.. అసలు కారణం ఇదే!
-
Fauji vs Eta: ప్రభాస్ ‘ఫౌజీ’కి బిగ్ టెన్షన్.. హిందీ బెల్ట్లో గట్టి పోటీ!
-
BCCI: బీసీసీఐపై వీవీఎస్ లక్ష్మణ్ సంచలన వ్యాఖ్యలు.. షాక్లో మాజీ క్రికెటర్!
-
Jharkhand Student Protest: జార్ఖండ్లో ఉద్రిక్తంగా మారిన నిరుద్యోగుల పోరు.. అర్ధరాత్రి పోలీసులు ఎందుకు వచ్చారు?
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..