Priyanka Gandhi: మోడీని మామయ్య అంటూ పిలిచిన ప్రియాంక గాంధీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గుజరాత్లో జరిగిన ఎన్నికల ర్యాలీలో కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ వాద్రా మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్ర మోడీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది. బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే దేశ రాజ్యాంగాన్ని మార్చేస్తుందని ఆరోపించారు. ఎన్నికల్లో గెలిస్తే రాజ్యాంగంలో కీలక మార్పులు చేస్తామని, స్వయంగా బీజేపీ నేతలే మీడియా చెప్తున్నారని గుర్తు చేశారు. గుజరాత్లోని వల్సాద్ లోక్సభ స్థానం నుంచి పోటీ చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థి అనంత్ పటేల్కు మద్దతుగా ఇవాళ ( శనివారం ) ప్రియాంక గాంధీ ప్రచారం నిర్వహించారు.
Read Also: Mobile Internet: ఫోన్లో ఇంటర్నెట్ స్లోగా వస్తోందా.. అయితే ఇలా చేయండి..
Also Read
- Chilli Garlic Egg Salad Recipe: ఉదయాన్నే ఎనర్జీ కావాలా? 5 నిమిషాల్లో రెడీ.. రుచికరమైన హై-ప్రోటీన్ ఎగ్ సలాడ్
- Earthquake: దక్షిణ ఫిలిప్పీన్స్లో భారీ భూకంపం.. రిక్టర్ స్కేలుపై 6.7 తీవ్రత నమోదు
- Beijing: బీజింగ్లో ఎత్తైన భవనాన్ని ఢీకొట్టిన విమానం.. వీడియో వైరల్
- Red Chili Test: వంటగదిలో వాడే ఎండు మిర్చి కారం నకిలీదా..? అసలుదా..? సింపుల్గా తెలుసుకోండిలా..
కాగా, వల్సాద్ జిల్లాలోని ధరంపూర్ గ్రామంలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో ప్రియాంక గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలో నెలకొన్న ద్రవ్యోల్బణం, నిత్యావసరాల ధరల పెరుగుదలకు మోడీ పాలనా వైఫల్యమే కారణమని విమర్శలు గుప్పించారు. ప్రధాని మోడీని ‘మెహంగాయీ మ్యాన్’ అని పిలిస్తే బాగుంటుందని వ్యాఖ్యనించింది. అయితే, బీజేపీ నేతలు ప్రధాని మోడీ శక్తిమంతుడని పొగుడుతున్నారు.. మోడీ చిటికె వేస్తే రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ఆగిపోతుందంటున్నారు.. అలాంటప్పుడు ఆయన మన దేశ పేదరికాన్ని ఎందుకు తొలగించలేకపోతున్నారని ప్రియాంక గాంధీ ప్రశ్నించారు. ప్రస్తుతం, సార్వత్రిక ఎన్నికల ఉండటం వల్లే ప్రధాని మోడీ సిలిండర్ల ధరలను తగ్గించారు.. అంతేగానీ, ఆయనకు ప్రజలపై సానుభూతి లేదని ఆమె వెల్లడించారు.
Read Also: Imran Khan: దేశాన్ని బానిసగా మార్చిన వారితో రాజీపడబోం.. జైల్లో ఉండేందుకూ సిద్ధమే..
అలాగే, కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే నీ నగలు, మంగళసూత్రం దొంగిలించి వేరొకరికి ఇస్తానని మోడీ మామయ్య ఎప్పుడో ఒకప్పుడు చెప్పడం మొదలు పెట్టే అవకాశం ఉందని ప్రియాంక గాంధీ తెలిపారు. ఈరోజు దేశ ప్రధానమంత్రి తన పదవిని దృష్టిలో ఉంచుకుని మీతో ఇలాంటి పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు అని ఆమె మండిపడ్డారు. అయితే, రాజస్థాన్లో జరిగిన బహిరంగ సభలో ప్రధాని మోడీ మాట్లాడుతూ.. తల్లులు, సోదరీమణుల బంగారం లెక్కింపు చేస్తామని కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో తెలిపిందని చేసిన వ్యాఖ్యలకు ప్రియాంక గాంధీ కౌంటర్ ఇచ్చింది.
తాజావార్తలు
-
Chilli Garlic Egg Salad Recipe: ఉదయాన్నే ఎనర్జీ కావాలా? 5 నిమిషాల్లో రెడీ.. రుచికరమైన హై-ప్రోటీన్ ఎగ్ సలాడ్
-
Mahabharata Unknown Facts: మహాభారతంలో ఆ నలుగురు ఆయుధం పట్టి ఉంటే.. కురుక్షేత్రం రిజల్ట్ వేరేలా ఉండేది! ఆ మహావీరులు ఎవరో తెలుసా?
-
Earthquake: దక్షిణ ఫిలిప్పీన్స్లో భారీ భూకంపం.. రిక్టర్ స్కేలుపై 6.7 తీవ్రత నమోదు
-
Haiku : ‘కోర్ట్’ శ్రీదేవి సినిమా షూటింగ్ పూర్తి కాకుండానే ‘నెట్ఫ్లిక్స్’ మైండ్ బ్లాక్ డీల్
-
Beijing: బీజింగ్లో ఎత్తైన భవనాన్ని ఢీకొట్టిన విమానం.. వీడియో వైరల్
ట్రెండింగ్
-
Kitchen Hacks: ఆమ్లెట్ పెనానికి అంటుకుపోతోందా? అయితే ఇలా చేయండి.!
-
White Furniture : తెల్ల ప్లాస్టిక్ కుర్చీలు కొత్తవాటిలా మెరవాలా.? ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Health Tips : ప్యూరిఫైయర్ ఉందంటే సరిపోదు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!