Priyanka Gandhi: మోడీని మామయ్య అంటూ పిలిచిన ప్రియాంక గాంధీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గుజరాత్లో జరిగిన ఎన్నికల ర్యాలీలో కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ వాద్రా మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్ర మోడీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది. బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే దేశ రాజ్యాంగాన్ని మార్చేస్తుందని ఆరోపించారు. ఎన్నికల్లో గెలిస్తే రాజ్యాంగంలో కీలక మార్పులు చేస్తామని, స్వయంగా బీజేపీ నేతలే మీడియా చెప్తున్నారని గుర్తు చేశారు. గుజరాత్లోని వల్సాద్ లోక్సభ స్థానం నుంచి పోటీ చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థి అనంత్ పటేల్కు మద్దతుగా ఇవాళ ( శనివారం ) ప్రియాంక గాంధీ ప్రచారం నిర్వహించారు.
Read Also: Mobile Internet: ఫోన్లో ఇంటర్నెట్ స్లోగా వస్తోందా.. అయితే ఇలా చేయండి..
Also Read
కాగా, వల్సాద్ జిల్లాలోని ధరంపూర్ గ్రామంలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో ప్రియాంక గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలో నెలకొన్న ద్రవ్యోల్బణం, నిత్యావసరాల ధరల పెరుగుదలకు మోడీ పాలనా వైఫల్యమే కారణమని విమర్శలు గుప్పించారు. ప్రధాని మోడీని ‘మెహంగాయీ మ్యాన్’ అని పిలిస్తే బాగుంటుందని వ్యాఖ్యనించింది. అయితే, బీజేపీ నేతలు ప్రధాని మోడీ శక్తిమంతుడని పొగుడుతున్నారు.. మోడీ చిటికె వేస్తే రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ఆగిపోతుందంటున్నారు.. అలాంటప్పుడు ఆయన మన దేశ పేదరికాన్ని ఎందుకు తొలగించలేకపోతున్నారని ప్రియాంక గాంధీ ప్రశ్నించారు. ప్రస్తుతం, సార్వత్రిక ఎన్నికల ఉండటం వల్లే ప్రధాని మోడీ సిలిండర్ల ధరలను తగ్గించారు.. అంతేగానీ, ఆయనకు ప్రజలపై సానుభూతి లేదని ఆమె వెల్లడించారు.
Read Also: Imran Khan: దేశాన్ని బానిసగా మార్చిన వారితో రాజీపడబోం.. జైల్లో ఉండేందుకూ సిద్ధమే..
అలాగే, కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే నీ నగలు, మంగళసూత్రం దొంగిలించి వేరొకరికి ఇస్తానని మోడీ మామయ్య ఎప్పుడో ఒకప్పుడు చెప్పడం మొదలు పెట్టే అవకాశం ఉందని ప్రియాంక గాంధీ తెలిపారు. ఈరోజు దేశ ప్రధానమంత్రి తన పదవిని దృష్టిలో ఉంచుకుని మీతో ఇలాంటి పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు అని ఆమె మండిపడ్డారు. అయితే, రాజస్థాన్లో జరిగిన బహిరంగ సభలో ప్రధాని మోడీ మాట్లాడుతూ.. తల్లులు, సోదరీమణుల బంగారం లెక్కింపు చేస్తామని కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో తెలిపిందని చేసిన వ్యాఖ్యలకు ప్రియాంక గాంధీ కౌంటర్ ఇచ్చింది.
తాజావార్తలు
-
Fake Shopping Offers : రూ.999 ఆఫర్.. ఖాతా ఖాళీ.! సైబర్ మోసగాళ్ల కొత్త ట్రిక్
-
OTR: కలెక్టర్ vs పోలీస్?.. పెద్దపల్లిలో హాట్ టాపిక్గా మారిన రివ్యూ మీటింగ్
-
OTR: ఎమ్మెల్యే మాధవి వైఖరి మిగతా ఎమ్మెల్యేలకు ఇబ్బందిగా మారిందా?
-
Train: మరీ చీఫ్గా దుప్పట్లు చోరీ.. కోచ్ అటెండెంట్లు గగ్గోలు.. ఎందుకంటే..!
-
ITR Filing: కొత్త ట్యాక్స్ విధానమే బెస్ట్? పాత విధానం ఎవరికి లాభం.. నిపుణులు ఏం చెబుతున్నారంటే?
ట్రెండింగ్
-
IPL 2027-CSK: సీఎస్కేకు క్రికెట్ దిగ్గజం గుడ్బై.. 18 ఏళ్ల బంధానికి ముగింపు!
-
IND vs ENG 1st ODI: ముగ్గురు మొనగాళ్లు వచ్చేశారు.. భారత్ ప్లేయింగ్ 11 ఇదే.. ఇక రచ్చరచ్చే!
-
APTRANSCO Recruitment: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. APTRANSCOలో 200 AEE ఉద్యోగాలు.. రూ.2.08 లక్షల వరకు జీతం.!
-
5G, 4G మోడళ్లతో ఎంట్రీ ఇవ్వనున్న Lava Virat V1 సిరీస్.. ఫీచర్స్ ఇవే.!
-
BSNL ధమాకా.. రూ. 259కే 700GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.. ఉచిత OTT కూడా.!