Priyanka Gandhi : రాయ్ బరేలీ నుంచి కాకుండా డామన్ డయ్యూ నుంచి పోటీ చేయనుున్న ప్రియాంక గాంధీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Priyanka Gandhi : డామన్ డయ్యూ కాంగ్రెస్ అధ్యక్షుడు కేతన్ పటేల్ ప్రియాంక గాంధీ ఎన్నికల్లో పోటీ చేయడంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్ర పాలిత ప్రాంతం నుంచి ప్రియాంక గాంధీ పోటీ చేసే అవకాశం ఉందని అంటున్నారు. ఇందుకు సంబంధించిన డేటాను సేకరించాల్సిందిగా పార్టీ హైకమాండ్ తనను కోరిందని కేతన్ తెలిపారు. ప్రియాంక గాంధీ డామన్ డయ్యూ నుండి లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయవచ్చని ఆయన అన్నారు. ఈ ప్రతిపాదనను తాను మనస్పూర్తిగా స్వీకరిస్తున్నట్లు ప్రకటించారు. డేటా సేకరించే బాధ్యతను హైకమాండ్ మాకు అప్పగించిందని కేతన్ పటేల్ అన్నారు. ప్రియాంక ఇక్కడికి రావడం వల్ల దక్షిణ గుజరాత్, సౌరాష్ట్ర మొత్తం లాభపడుతుంది. దక్షిణ గుజరాత్ ఎప్పుడూ కాంగ్రెస్తోనే ఉంది. డేటాను సేకరించడం అంటే గ్రౌండ్ రియాలిటీ, ఓటర్ల ప్రాధాన్యతలు, గత పనితీరుకు సంబంధించిన సమాచారాన్ని పార్టీ నాయకత్వానికి అందించడం అని పటేల్ అన్నారు.
Read Also:Police Raids on TDP Leaders Houses: నెల్లూరు జిల్లాలో టీడీపీ నేతల ఇళ్లల్లో సోదాలు..
Also Read
- Sambhaji Maharaj Jayanti: ఛత్రపతి శివాజీ వారసుడు.. మొఘలుల సింహస్వప్నం! ఛత్రపతి శంభాజీ మహారాజ్ వీరగాథ ఇదే..
- IPL Most Centuries: ఐపీఎల్లో అత్యధిక సెంచరీలు చేసిన వీరులు వీరే.. అగ్రస్థానంలో విరాట్ కోహ్లీ.!
- నేడే ఏపీ Cabinet Meeting.. రూ.2 లక్షల కోట్ల పెట్టుబడులకు గ్రీన్సిగ్నల్.. పొదుపు చర్యలపై కీలక చర్చ!
- Thursday Horoscope: ఆ రాశి వారు ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాల్సిందే.. లేదా తిప్పలు తప్పవ్..!
ఈసారి గాంధీ కుటుంబానికి చెందిన ఒకరు రాయ్బరేలీ స్థానం నుంచి ఎన్నికల్లో పోటీ చేయవచ్చనే చర్చ కూడా నడుస్తోంది. ఈసారి లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయబోనని సోనియా గాంధీ ప్రకటించారు. భారతీయ జనతా పార్టీ కూడా వచ్చే ఎన్నికలకు సంబంధించిన తొలి జాబితాను విడుదల చేసింది. బిజెపి 195 మంది అభ్యర్థులను ప్రకటించింది. వారిలో పవన్ సింగ్ అసన్సోల్ నుండి ఎన్నికల్లో పోటీ చేయడానికి నిరాకరించారు. ప్రధాని మోడీ తన నియోజకవర్గమైన వారణాసి నుంచి మరోసారి పోటీ చేయనున్నారు. రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ్ యాత్ర మధ్యప్రదేశ్కు చేరుకుంది. కాంగ్రెస్ తన మేనిఫెస్టోపై కసరత్తు చేస్తోంది. త్వరలో కాంగ్రెస్ పార్టీ కూడా తన అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది. ఉత్తరప్రదేశ్లో ఎస్పీ, కాంగ్రెస్లు కలిసి పోటీ చేస్తామని ప్రకటించాయి. వీరిద్దరి మధ్య సీట్ల పంపకాల వ్యవహారం కూడా ఖరారైంది. అయితే కాంగ్రెస్ ఇంకా అభ్యర్థులను ప్రకటించలేదు.
Read Also:Radisson Drugs Case: రాడిసన్ డ్రగ్స్ కేసు.. పోలీసుల విచారణకు హాజరైన నటి! పరారీలో నటుడు
తాజావార్తలు
-
Virat Kohli: సెంచరీ కొట్టినా సెలబ్రేషన్స్ ఎందుకు జరుపుకోలేదు?.. కోహ్లీ ఇచ్చిన ఆన్సర్ వింటే ఫిదా అవ్వాల్సిందే!
-
Manish Pandey: క్యాచ్ ఆఫ్ ది సీజన్.. మనీష్ పాండే ఒక్క చేతి డైవ్.. కోహ్లీని ఆశ్చర్యపరచిన క్యాచ్
-
Raviteja : ఇరుముడి కోసం ‘విల్లాల వీరుడు.. వీరమణికంఠుడు’.. రీమిక్స్ ఫిక్స్
-
Sambhaji Maharaj Jayanti: ఛత్రపతి శివాజీ వారసుడు.. మొఘలుల సింహస్వప్నం! ఛత్రపతి శంభాజీ మహారాజ్ వీరగాథ ఇదే..
-
IPL Most Centuries: ఐపీఎల్లో అత్యధిక సెంచరీలు చేసిన వీరులు వీరే.. అగ్రస్థానంలో విరాట్ కోహ్లీ.!
ట్రెండింగ్
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
-
Gold Import Duty: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!