Priyanka Gandhi: అమేథీ, రాయ్బరేలీలో ప్రియాంక ప్రచారం.. ఖాతాలో వేసుకుంటారా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అమేథీ, రాయ్బరేలీ స్థానాలు కాంగ్రెస్కు కంచుకోటలు. ఎప్పుటినుంచో కాంగ్రెస్కు బలమైన స్థానాలుగా ఉన్నాయి. అయితే ఈసారి చాలా లేటుగా అభ్యర్థుల్ని ప్రకటించారు. నామినేషన్కు చివరి రోజు.. కొన్ని గంటల ముందు హైకమాండ్ అభ్యర్థుల్ని ప్రకటించింది. అయితే ఈ స్థానాలను హస్తం పార్టీ చాలా సీరియస్గా తీసుకుంది. ఎలాగైనా ఈ స్థానాలను ఖాతాలో వేసుకోవాలని భావిస్తోంది. ఇందుకోసం ప్రియాంకాగాంధీ రంగంలోకి దిగారు. ఈ రెండు స్థానాలకు ఐదో విడతలో.. అనగా మే 20న పోలింగ్ జరగనుంది. అయితే ప్రచారం గడువు ముగిసే వరకు తాను ఇక్కడే ఉంటానని కార్యకర్తలకు ఆమె సందేశం ఇచ్చారు. అంటే ఈ స్థానాలు కాంగ్రెస్కు ఎంత ముఖ్యమో అర్థమవుతుంది.
ఇది కూడా చదవండి: Shyamala Devi: ఏపీలో ప్రభాస్ పెద్దమ్మ ప్రచారం.. ఎవరికోసమో తెలుసా?
Also Read
- CJP Protest: దుకాణాలు బంద్, జాతీయ భద్రతా చట్టం, అంబులెన్సుల మోహరింపు.. ఏదో జరగబోతోంది..
- Monsoon: దేశంలో వర్ష మేఘాల బెల్ట్.. వెలుగులోకి ఉపగ్రహ చిత్రాలు.. ఇక భారీ వర్షాలే!
- CJP Protest: సీజేపీ ఉద్యమానికి ఖలిస్తాన్ ఉగ్రవాది మద్దతు..? వైరల్ అవుతున్న వీడియో..
- Delhi: 2024 నీట్ పేపర్ లీక్ కేసులో సంజీవ్ ముఖియాకు సీబీఐ క్లీన్చిట్.. కేంద్రంపై కేజ్రీవాల్ ధ్వజం
గత ఎన్నికల్లో అమేథీలో రాహుల్ గాంధీ ఓడిపోయారు. కేంద్రమంత్రి స్మృతి ఇరానీ 55 వేల ఓట్లతో విజయం సాధించారు. ఈ ఓటమి రాహుల్కు పెద్ద తగిలినట్లైంది. అదృష్టవశాత్తు కేరళలోని వాయనాడ్ నుంచి రాహుల్ గెలిచి పరువు నిలబెట్టుకున్నారు. అయితే ఈసారి కూడా అమేథీ నుంచి పోటీ చేస్తారని అంతా భావించారు. కానీ చివరికి ఆయన రాయ్బరేలీకి వెళ్లిపోయారు. అమేథీలో మాత్రం.. గాంధీ కుటుంబానికి అత్యంత సన్నిహితుడైన కేఎల్.శర్మను రంగంలోకి దించింది. ఎంతో కాలంగా అమేథీ, రాయ్బరేలీలో సేవలు అందించిన అనుభవం ఆయనకు ఉంది. దీంతో కాంగ్రెస్ హైకమాండ్ అతని వైపు మొగ్గు చూపింది. ఇక సోనియా గాంధీ ఈసారి ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకున్నారు. ఆమె రాజస్థాన్ నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు. దీంతో ఇక్కడ ప్రియాంక పోటీ చేస్తారని వార్తలు వినిపించాయి.. కానీ ఆమె పోటీకి దూరంగా ఉన్నారు. ఇక ఇక్కడ రాహుల్ గాంధీనే బరిలోకి దిగారు. అయితే ఈ రెండు స్థానాలు కాంగ్రెస్కు కీలకంగా మారాయి. ఈ నేపథ్యంలో వీటి గెలుపు బాధ్యతను ప్రియాంక తన భుజాన వేసుకుంది.
ఇది కూడా చదవండి: Mumbai: ఇండియాకు పాకిన పాలస్తీనా నినాదం.. స్కూల్ ప్రిన్సిపాల్ తొలగింపు
అందుకోసమే అమేథీ, రాయ్బరేలీలో ప్రియాంకా గాంధీ సుడిగాలి పర్యటనలతో దూసుకెళ్తున్నారు. అమేథీని తిరిగి దక్కించుకోవడం.. సోదరుడు పోటీ చేస్తున్న రాయ్బరేలీలో మరోసారి విజయమే లక్ష్యంగా పార్టీ శ్రేణులను సిద్ధం చేస్తున్నారు. 24 గంటలూ కార్యకర్తలతోనే ఉండి జోష్ నింపుతున్నారు. బుధవారం ఒక్క రోజే ఆమె తొమ్మిది సభల్లో పాల్గొనేలా ప్లాన్ చేసుకున్నారు. మే 18 వరకూ తాను ఇక్కడి నుంచి కదిలేది లేదని పార్టీ నేతలకు ఆమె స్పష్టం చేశారు.
దేశ వ్యాప్తంగా ఏడు విడతల్లో పోలింగ్ జరుగుతోంది. ఇప్పటికే మూడు విడతల పోలింగ్ ముగిసింది. నాల్గో విడత మే 13న జరగనుంది. అనంతరం మే 20, 25, జూన్ 1న జరగనుంది. ఎన్నికల ఫలితాలు మాత్రం జూన్ 4న విడుదల కానున్నాయి.
ఇది కూడా చదవండి: Kalki 2898AD: కల్కి అమితాబ్ లుక్ తో టీ20 WC స్పెషల్ వీడియో.. అదిరిపోయింది బ్రో..
తాజావార్తలు
-
CJP Protest: దుకాణాలు బంద్, జాతీయ భద్రతా చట్టం, అంబులెన్సుల మోహరింపు.. ఏదో జరగబోతోంది..
-
Monsoon: దేశంలో వర్ష మేఘాల బెల్ట్.. వెలుగులోకి ఉపగ్రహ చిత్రాలు.. ఇక భారీ వర్షాలే!
-
Home Tips : ఎండిపోయిన పాత కొబ్బరిని పడేస్తున్నారా? ఇంట్లోనే ప్యూర్ కొబ్బరి నూనె..!
-
Alia Bhatt: “నా మనసు ముక్కలైంది”.. ఆలియా భట్ పోస్ట్ వైరల్!
-
Healthy Diet : షుగర్ ఉందా.? ఈ 6 ఫుడ్ మిస్టేక్స్ మీ కిడ్నీలను దెబ్బతీస్తున్నాయ్.!
ట్రెండింగ్
-
SBI నుంచి రూ.15 లక్షల వరకు స్కాలర్షిప్.. విద్యార్థులు దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే.?
-
Punya Kshetra Yatra: భక్తులకు శుభవార్త.. అయోధ్య, కాశీ, పూరీ, ప్రయాగ్రాజ్.. పుణ్యక్షేత్ర యాత్ర స్పెషల్ రైలు.. వివరాలు ఇదిగో.!
-
Pachimirapakaya Pachadi: తిన్నకొద్దీ తినాలనిపించే “పచ్చిమిరపకాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
IND vs ZIM 1st T20: వైభవ్ సూర్యవంశీకి షాక్.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దోస్తుకు ఛాన్స్?
-
Dinesh Karthik vs Alastair Cook: ఐపీఎల్ గురించి వాడివేడి చర్చ.. ఇంటర్వ్యూలోనే కొట్టుకోబోయిన దినేష్ కార్తీక్, అలిస్టర్ కుక్!