Operation Sindoor: అంతర్జాతీయ ద్రవ్య నిధా లేక ‘ఉగ్రవాద నిధా’? పాక్ కు IMF నిధులు ఇవ్వడంపై ప్రియాంక చతుర్వేది ఆగ్రహం
- పాక్ కు IMF నిధులు ఇవ్వడంపై ప్రియాంక చతుర్వేది ఆగ్రహం
- అంతర్జాతీయ ద్రవ్య నిధా లేక 'ఉగ్రవాద నిధా'?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత్ పాక్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. భారత త్రివిధ దళాలు పాక్ ను చావుదెబ్బ కొడుతున్నాయి. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ ద్రవ్య నిధి పాక్ కు లోన్ ఇవ్వడంపై ప్రియాంక చతుర్వేది ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐఎంఎఫ్ అంటే అంతర్జాతీయ ద్రవ్య నిధినా లేక ఉగ్రవాద నిధా అంటూ పాక్ కు నిధుల విడుదలపై ఆమె మండిపడింది. పహల్గాంలో ఉగ్రదాడి అనంతరం ఆపరేషన్ సింధూర్ తో భారత్ ప్రతీకార దాడులకు దిగింది. ఉగ్రవాదాన్ని పెంచిపోషిస్తున్న పాక్ కు సరైన బుద్ధి చెప్తోంది.
Also Read:Operation Sindoor: ఉదయం 10 గంటలకు భారత సైన్యం అత్యవసర మీడియా సమావేశం..
Also Read
- Vaibhav Sooryavanshi: జింబాబ్వే సిరీస్పై కన్నేసిన వైభవ్ సూర్యవంశీ.. ‘ఈ సిరీస్ వదిలే ప్రసక్తే లేదు’..
- అమ్మా.. నాన్న నన్ను క్షమించండి..
- Shreyas Iyer: రేపటి మ్యాచ్కు మా స్ట్రాటజీ ఇదే.. మమ్మల్ని ఎవరూ ఆపలేరు: శ్రేయస్ అయ్యర్
- Rahul Gandhi: 'ప్రభుత్వాన్ని తొలగించండి' అని పోలీసులు నా చెవిలో చెప్పారు: రాహుల్ గాంధీ
అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF) నుంచి ఒక బిలియన్ డాలర్ల కొత్త రుణం పొందినట్లు పాకిస్తాన్ పేర్కొంది. ఈ రుణం గురించి శివసేన (UBT) రాజ్యసభ ఎంపీ ప్రియాంక చతుర్వేది IMF ను ఉగ్రవాద నిధుల సంస్థగా అభివర్ణించారు. IMF నుంచి పాకిస్తాన్ అందుకున్న నిధుల గురించి ప్రియాంక చతుర్వేది సోషల్ మీడియా ప్లాట్ఫామ్ X లో ట్వీట్ చేశారు. అంతర్జాతీయ ద్రవ్య నిధి పేరును అంతర్జాతీయ ఉగ్రవాద నిధిగా మార్చాలని ప్రియాంక అన్నారు. IMF ఒక ఉగ్రవాద దేశానికి ఆర్థిక సహాయం అందిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఉగ్రవాద కార్యకలాపాలను పెంచడానికి అవకాశం ఇస్తోంది. ఇది సిగ్గుచేటు అంటూ ఫైర్ అయ్యింది.
Also Read:Operation Sindoor Live Updates: పాక్ వైమానిక స్థావరాలపై భారత్ దాడులు…
పాకిస్తాన్ డ్రోన్ దాడుల సంఘటనల తరువాత కచ్, జలంధర్ సహా సరిహద్దు ప్రాంతాలలో ఉద్రిక్తత నెలకొంది. కచ్ జిల్లాలో పూర్తి విద్యుత్తు సరఫరాను నిలిపివేశారు. జలంధర్లో ముప్పు పొంచి ఉన్న తర్వాత, డిప్యూటీ కమిషనర్ మళ్ళీ విద్యుత్తు సరఫరా నిలిపివేతకు ఆదేశించారు. ఈ సంఘటనలకు ప్రతిస్పందనగా, భారతదేశం ప్రతీకారం తీర్చుకుంది. పంజాబ్, గుజరాత్, జమ్మూ కాశ్మీర్ సహా నాలుగు రాష్ట్రాల్లోని 30 కి పైగా విమానాశ్రయాలను మే 14 వరకు మూసివేసింది.
Also Read:Operation Sindoor: పాకిస్తాన్ వ్యాప్తంగా భారీ దాడులు.. ఎయిర్ బేస్లు లక్ష్యంగా విరుచుకుపడిన భారత్..
భారత భద్రతా దళాలు పాకిస్తాన్ డ్రోన్, క్షిపణి, వైమానిక దాడులను భగ్నం చేశాయి. శుక్రవారం సాయంత్రం, పాకిస్తాన్ భారతదేశంలోని నాలుగు రాష్ట్రాల్లోని 26 నగరాలపై డ్రోన్ దాడులు చేసింది. భారత సైన్యం తిప్పికొట్టింది. ఈ దాడుల తర్వాత, జమ్మూ, సాంబా, రాజౌరి, నగ్రోటా, పూంచ్, అఖ్నూర్, ఉధంపూర్, బారాముల్లా, ఫిరోజ్పూర్, అమృత్సర్ వంటి నగరాలు ప్రభావితమయ్యాయి.
International Monetary Fund should be renamed to International Terrorist Fund for financially aiding, abetting and encouraging an aatanki nation to build more terror gangs to export to the world. Shame!
— Priyanka Chaturvedi🇮🇳 (@priyankac19) May 9, 2025
తాజావార్తలు
-
Chiranjeevi: నా అభిమానులు ఎస్కేఎన్, సాయి రాజేష్లను చూసి గర్వపడుతున్నా..
-
Delhi Protest : దేశ రాజధానిలో మళ్లీ రగిలిన ఉద్రిక్తతలు.. జంతర్ మంతర్ వద్ద రణరంగం.!
-
CM Revanth Reddy : మున్సిపల్ అధికారులకు సీఎం రేవంత్ అల్టిమేటం..
-
Vaibhav Sooryavanshi: జింబాబ్వే సిరీస్పై కన్నేసిన వైభవ్ సూర్యవంశీ.. ‘ఈ సిరీస్ వదిలే ప్రసక్తే లేదు’..
-
HYDRA Ranganath: రూ.1.5 లక్షల కోట్ల ప్రభుత్వ భూములు కాపాడాం
ట్రెండింగ్
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!