Operation Sindoor: అంతర్జాతీయ ద్రవ్య నిధా లేక ‘ఉగ్రవాద నిధా’? పాక్ కు IMF నిధులు ఇవ్వడంపై ప్రియాంక చతుర్వేది ఆగ్రహం
- పాక్ కు IMF నిధులు ఇవ్వడంపై ప్రియాంక చతుర్వేది ఆగ్రహం
- అంతర్జాతీయ ద్రవ్య నిధా లేక 'ఉగ్రవాద నిధా'?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత్ పాక్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. భారత త్రివిధ దళాలు పాక్ ను చావుదెబ్బ కొడుతున్నాయి. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ ద్రవ్య నిధి పాక్ కు లోన్ ఇవ్వడంపై ప్రియాంక చతుర్వేది ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐఎంఎఫ్ అంటే అంతర్జాతీయ ద్రవ్య నిధినా లేక ఉగ్రవాద నిధా అంటూ పాక్ కు నిధుల విడుదలపై ఆమె మండిపడింది. పహల్గాంలో ఉగ్రదాడి అనంతరం ఆపరేషన్ సింధూర్ తో భారత్ ప్రతీకార దాడులకు దిగింది. ఉగ్రవాదాన్ని పెంచిపోషిస్తున్న పాక్ కు సరైన బుద్ధి చెప్తోంది.
Also Read:Operation Sindoor: ఉదయం 10 గంటలకు భారత సైన్యం అత్యవసర మీడియా సమావేశం..
Also Read
- Simhachalam Temple Land: సింహాచలం భూముల వివాదంపై హైకోర్టు సీరియస్.. ప్రభుత్వానికి నోటీసులు
- Astrology: జూలై 2 గురువారం దినఫలాలు.. ఈ రాశివారికి ఊహించని గుడ్ న్యూస్..
- Vaibhav Sooryavanshi: బుడ్డోడికి మళ్లీ నిరాశే.. ఇంగ్లండ్తో తొలి టీ20లోనూ 'నో ఛాన్స్'.!
- Pawan Kalyan: సోషల్ మీడియా దుర్వినియోగంపై ఉక్కుపాదం మోపుతాం.. ‘ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్’ పేరుతో దూషణలు ఇక కుదరవు.!
అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF) నుంచి ఒక బిలియన్ డాలర్ల కొత్త రుణం పొందినట్లు పాకిస్తాన్ పేర్కొంది. ఈ రుణం గురించి శివసేన (UBT) రాజ్యసభ ఎంపీ ప్రియాంక చతుర్వేది IMF ను ఉగ్రవాద నిధుల సంస్థగా అభివర్ణించారు. IMF నుంచి పాకిస్తాన్ అందుకున్న నిధుల గురించి ప్రియాంక చతుర్వేది సోషల్ మీడియా ప్లాట్ఫామ్ X లో ట్వీట్ చేశారు. అంతర్జాతీయ ద్రవ్య నిధి పేరును అంతర్జాతీయ ఉగ్రవాద నిధిగా మార్చాలని ప్రియాంక అన్నారు. IMF ఒక ఉగ్రవాద దేశానికి ఆర్థిక సహాయం అందిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఉగ్రవాద కార్యకలాపాలను పెంచడానికి అవకాశం ఇస్తోంది. ఇది సిగ్గుచేటు అంటూ ఫైర్ అయ్యింది.
Also Read:Operation Sindoor Live Updates: పాక్ వైమానిక స్థావరాలపై భారత్ దాడులు…
పాకిస్తాన్ డ్రోన్ దాడుల సంఘటనల తరువాత కచ్, జలంధర్ సహా సరిహద్దు ప్రాంతాలలో ఉద్రిక్తత నెలకొంది. కచ్ జిల్లాలో పూర్తి విద్యుత్తు సరఫరాను నిలిపివేశారు. జలంధర్లో ముప్పు పొంచి ఉన్న తర్వాత, డిప్యూటీ కమిషనర్ మళ్ళీ విద్యుత్తు సరఫరా నిలిపివేతకు ఆదేశించారు. ఈ సంఘటనలకు ప్రతిస్పందనగా, భారతదేశం ప్రతీకారం తీర్చుకుంది. పంజాబ్, గుజరాత్, జమ్మూ కాశ్మీర్ సహా నాలుగు రాష్ట్రాల్లోని 30 కి పైగా విమానాశ్రయాలను మే 14 వరకు మూసివేసింది.
Also Read:Operation Sindoor: పాకిస్తాన్ వ్యాప్తంగా భారీ దాడులు.. ఎయిర్ బేస్లు లక్ష్యంగా విరుచుకుపడిన భారత్..
భారత భద్రతా దళాలు పాకిస్తాన్ డ్రోన్, క్షిపణి, వైమానిక దాడులను భగ్నం చేశాయి. శుక్రవారం సాయంత్రం, పాకిస్తాన్ భారతదేశంలోని నాలుగు రాష్ట్రాల్లోని 26 నగరాలపై డ్రోన్ దాడులు చేసింది. భారత సైన్యం తిప్పికొట్టింది. ఈ దాడుల తర్వాత, జమ్మూ, సాంబా, రాజౌరి, నగ్రోటా, పూంచ్, అఖ్నూర్, ఉధంపూర్, బారాముల్లా, ఫిరోజ్పూర్, అమృత్సర్ వంటి నగరాలు ప్రభావితమయ్యాయి.
International Monetary Fund should be renamed to International Terrorist Fund for financially aiding, abetting and encouraging an aatanki nation to build more terror gangs to export to the world. Shame!
— Priyanka Chaturvedi🇮🇳 (@priyankac19) May 9, 2025
తాజావార్తలు
-
Small Savings Schemes: స్మాల్ సేవింగ్ స్కీమ్స్ లో ఇన్వెస్ట్ చేసేవారికి గుడ్ న్యూస్.. వడ్డీ రేట్లను ప్రకటించిన కేంద్రం
-
Kajal Aggarwal: కాజల్ కెరీర్లోనే మైండ్ బ్లోయింగ్ ప్రాజెక్ట్.. ఆ స్టార్ డైరెక్టర్తోనేనా?
-
Joseph Vijay: టైమ్ టు టైమ్..ఫైల్ తర్వాత ఫైల్.. దళపతి మార్క్ రూలింగ్!
-
Simhachalam Temple Land: సింహాచలం భూముల వివాదంపై హైకోర్టు సీరియస్.. ప్రభుత్వానికి నోటీసులు
-
DC Release Date: గ్యాంగ్స్టర్ గా లోకేష్ కనగరాజ్.. ‘డీసీ’ రిలీజ్ డేట్ ఫిక్స్!
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 10,000mAh బ్యాటరీతో Vivo Pad 5c ఎంట్రీ.. ధర ఎంతంటే?
-
Lenovo నుంచి డబుల్ ధమాకా.. Tab Plus Gen 2, LOQ మానిటర్ సిరీస్ లాంచ్.!
-
Fluffy Omelette: రెగ్యులర్ ఆమ్లెట్కు బదులుగా.. స్పాంజీలా ఉండే ‘ఫ్లఫీ ఆమ్లెట్’ చేసేయండి ఇలా.! లొట్టలేసుకుని తింటారంతే.!
-
Air Fryer vs Stove Cooking: ఎయిర్ ఫ్రయర్ Vs స్టవ్ వంట.. ఆరోగ్యానికి ఏది మంచిది.?
-
అందుబాటులోకి Aadhaar App కొత్త వెర్షన్..ఫేస్ ఆథెంటికేషన్, మొబైల్ నంబర్ అప్డేట్లతో పాటు మరిన్ని సేవలు.!