PM Modi: ఒకే ఒక్కడు.. ప్రధాని మోడీ హిస్టరీ క్రియేట్..
- ప్రధాని మోడీ హిస్టరీ క్రియేట్
- మోడీ తన పదవీకాలంలో 8,931వ రోజును పూర్తి చేసుకుని, రికార్డు సృష్టించారు
- భారత్ లో అత్యధిక కాలం పనిచేసిన ప్రభుత్వ అధినేతగా నిలిచారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఈ రోజు, ఆదివారం (మార్చి 22, 2026), భారత రాజకీయాల్లో ముఖ్యమైన రోజు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, సిక్కిం మాజీ ముఖ్యమంత్రి పవన్ కుమార్ చామ్లింగ్ను అధిగమించి, భారత్ లో అత్యధిక కాలం పనిచేసిన ప్రభుత్వ అధినేతగా నిలిచారు. పవన్ కుమార్ చామ్లింగ్ 8,930 రోజుల పాటు ముఖ్యమంత్రిగా పనిచేయగా, ప్రధానమంత్రి మోడీ ఇప్పుడు ప్రభుత్వ అధినేతగా 8,931 రోజులు ప్రజా పదవిలో పూర్తి చేసుకున్నారు. మోడీ తన పదవీకాలంలో 8,931వ రోజును పూర్తి చేసుకుని, రికార్డు సృష్టించారు. ఇందులో గుజరాత్ ముఖ్యమంత్రిగా, ఇప్పుడు ప్రధానమంత్రిగా ఆయన పదవీకాలం కూడా కలిసింది. దశాబ్దాల పాటు కొనసాగిన ప్రజా సేవ, నాయకత్వానికి నిదర్శనమైన ఇది ఒక అరుదైన, అసాధారణమైన ఘనత.
Also Read
- Saraswati Pushkaralu 2026: కాళేశ్వరంలో ఆధ్యాత్మిక మహోత్సవం.. వైభవంగా సరస్వతీ అంత్య పుష్కరాలు ప్రారంభం..
- Trump: క్లైమాక్స్ చేరుకున్న అమెరికా, ఇరాన్ దేశాల ఉద్రిక్తతలు? ఇరాన్కు ట్రంప్ లాస్ట్ వార్నింగ్!
- What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
- Astrology: మే 21 గురువారం దినఫలాలు.. ఏ రాశివారు ఏ పూజ చేస్తే మేలు..
ప్రధాని మోదీ గురించి గమనించాల్సిన ఒక విషయం
గుజరాత్కు అత్యధిక కాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి.
ముఖ్యమంత్రిగా అత్యంత సుదీర్ఘ అనుభవం ఉన్న ప్రధానమంత్రి.
స్వాతంత్ర్యం తర్వాత జన్మించిన తొలి ప్రధానమంత్రి.
వరుసగా మూడు లోక్సభ ఎన్నికల (2014, 2019, 2024) విజేత.
అమిత్ షా ఏమి చెప్పారు?
హోం మంత్రి అమిత్ షా మాట్లాడుతూ, “సేవ, కృషి అచంచలమైన అంకితభావంతో సాధించిన ఒక మైలురాయి. సిక్కిం మాజీ ముఖ్యమంత్రి పవన్ కుమార్ చామ్లింగ్ నెలకొల్పిన 8,930 రోజుల రికార్డును అధిగమించి, భారతదేశంలో అత్యధిక కాలం పనిచేసిన ప్రభుత్వ అధినేతగా ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రికార్డు సృష్టించారు.” అని అన్నారు.
“ప్రధాని మోడీ 8,931 రోజుల ప్రజా జీవితం – మొదట గుజరాత్ ముఖ్యమంత్రిగా, ఇప్పుడు ప్రధానమంత్రిగా – ‘దేశమే ప్రథమం’ అనే పాలన పట్ల ఆయనకున్న ప్రగాఢ అంకితభావాన్ని, చేతల్లో నిజాయితీని, ప్రతి పౌరునికి నిస్వార్థ సేవను ప్రతిబింబిస్తుంది. అపూర్వమైన విశ్వాసం, అసమానమైన సేవపై నిర్మించబడిన ఒక విశిష్ట వారసత్వం. అని అమిత్ షా కొనియాడారు.
అమిత్ షా ఇలా అన్నారు, “మోడీజీ దశాబ్దాల సేవ ఒక ప్రత్యేక శకాన్ని సృష్టించింది. పేదలకు హక్కులు కల్పించడం, అభివృద్ధిలో కొత్త రికార్డులు నెలకొల్పడం లేదా ప్రపంచ వేదికలపై దేశ గౌరవాన్ని పెంచడం వంటి విషయాలలో మోడీ శకం భారతదేశాన్ని పూర్తిగా మార్చేసింది.”
Also Read:PEDDI : పెద్ది స్పెషల్ సాంగ్.. రామ్ చరణ్ సరసన సొగసుల సుందరి
“ఈ నూతన భారతదేశ నిర్మాణానికి జీవితకాల కృషి అవసరమైంది, ఆ కృషిని ప్రధాని నరేంద్ర మోడీ చేశారు. 24 ఏళ్లకు పైగా ఒక్క సెలవు కూడా తీసుకోకుండా దేశానికి, ప్రజలకు సేవ చేయడం ఆయన అచంచలమైన అంకితభావానికి నిదర్శనం. అందుకే గుజరాత్ ముఖ్యమంత్రిగా మూడుసార్లు, భారత ప్రధానిగా మూడుసార్లు ఆయన ప్రజల నుంచి అపూర్వమైన ప్రేమను పొందారు. ఆయనపై ప్రజల నమ్మకం, అభిమానం, మద్దతు రోజురోజుకూ పెరుగుతూనే ఉన్నాయి,” అని కేంద్ర హోం మంత్రి వెల్లడించారు.
తాజావార్తలు
-
Saraswati Pushkaralu 2026: కాళేశ్వరంలో ఆధ్యాత్మిక మహోత్సవం.. వైభవంగా సరస్వతీ అంత్య పుష్కరాలు ప్రారంభం..
-
RBI: లోన్ తిరిగి చెల్లించకపోతే బ్యాంకు మీ మొబైల్ ఫోన్ను లాక్ చేస్తుందా? షాకిస్తున్న ఆర్బిఐ కొత్త ప్రతిపాదన
-
Trump: క్లైమాక్స్ చేరుకున్న అమెరికా, ఇరాన్ దేశాల ఉద్రిక్తతలు? ఇరాన్కు ట్రంప్ లాస్ట్ వార్నింగ్!
-
Brahma Muhurta Dreams: బ్రహ్మ ముహూర్తంలో ఎలాంటి కలలు వస్తే మంచిదో తెలుసా..?
-
What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!