PM Modi: మాతృదినోత్సవం సందర్భంగా మోడీకి గిఫ్ట్.. థ్యాంక్స్ చెప్పిన ప్రధాని
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మాతృదినోత్సవం సందర్భంగా ప్రధాని మోడీకి ఊహించని బహుమానం దొరికింది. మోడీ మాతృమూర్తి దివంగత హీరాబెన్ చిత్రాన్ని ఆ పార్టీ అభిమానులు ఆయనకు అందించారు. దీంతో ప్రధాని సంతోషం వ్యక్తం చేశారు. మోడీ మాతృమూర్తి దివంగత హీరాబెన్ చిత్రాన్ని ఆ పార్టీ అభిమానులు ఆయనకు అందించారు. దీంతో వారికి మోడీ కృతజ్ఞతలు తెలియజేశారు. పశ్చిమ బెంగాల్లోని హుగ్లీలో ఈ అరుదైన సన్నివేశం ఆదివారం చోటుచేసుకుంది.
ఇది కూడా చదవండి: Video viral: వందే భారత్ రైలు కింద చిక్కుకున్న ఆవు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..!
Also Read
- Astrology: జూన్ 29 సోమవారం దినఫలాలు.. ఈ రాశివారికి గుడ్ న్యూస్..
- Shreyas Iyer: ఓటమికి కారణాలు ఇవే.. తప్పులను నిజాయితీగా ఒప్పుకున్న శ్రేయస్ అయ్యర్..
- Harmanpreet Kaur: ఆ తప్పే మా కొంపముంచింది.. ప్రతీ సారి ఇలానే జరుగుతోంది.. భావోద్వేగానికి లోనైన కెప్టెన్..
- IND Vs IRE: ప్రపంచ ఛాంపియన్ను మట్టికరిపించిన ఐర్లాండ్.. సిరీస్ కైవసం..
ఎన్నికల ప్రచార సభలో ప్రధాని మోడీ మాట్లాడుతుండగా.. ఇద్దరు వ్యక్తులు తన తల్లితో ఉన్న చిత్రాలను ప్రదర్శించారు. దీంతో ప్రసంగాన్ని మధ్యలోనే ఆపేసిన మోడీ.. ఆ చిత్రాలను ఎస్పీజీ సిబ్బందికి అందించాలని సూచించారు. అలాగే ఆ చిత్రపటం వెనుక వారివారి చిరునామాలు కూడా రాయాలని సూచించారు. వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేయాల్సి ఉందన్నారు. పాశ్చాత్య దేశాల్లో మదర్స్ డేను ప్రత్యేకంగా నిర్వహించుకుంటారని, మన దేశంలో తల్లిని నిత్యం దేవతలా కొలుస్తామని ఈ సందర్భంగా పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: Sreemukhi: శ్రీముఖి పెళ్లిపై జబర్దస్త్ కమెడియన్ కామెంట్స్.. ఈ ఏడాదే అంటూ?
ఇదే సభలో సందేశ్ఖాలీ ఘటనపై ప్రధాని మోడీ తృణమూల్పై విరుచుకుపడ్డారు. ఆ పార్టీ ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడుతోందని ఆరోపించారు. సందేశ్ ఖాలీ నిందితులను తొలుత పోలీసులు రక్షించాలని చూశారని, ఇప్పుడు తృణమూల్ కాంగ్రెస్సే నేరుగా రంగంలోకి దిగిందని దుయ్యబట్టారు. సందేశ్ఖాలీలో సోదరీమణులను తృణమూల్ కాంగ్రెస్ గూండాలు బెదిరిస్తున్నారని ఆరోపించారు. తృణమూల్ కాంగ్రెస్కు ఎవరూ భయపడాల్సిన అవసరం లేదన్నారు.
ఇదిలా ఉంటే బెంగాల్కు 5 గ్యారంటీలు మోడీ ప్రకటించారు. తాను అధికారంలో ఉన్నంత కాలం మత ప్రాతిపదికన రిజర్వేషన్లు ఉండవన్నారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల రిజర్వేషన్లను ఎవరూ ఆపలేరన్నారు. అయోధ్యలో రామ మందిరంపై సుప్రీంకోర్టు తీర్పును తోసిపుచ్చలేరని చెప్పారు. రామ నవమి పూజలను చేసుకోకుండా ఆపలేరని… సీఏఏ అమలును అడ్డుకోలేరని ప్రధాని మోడీ బెంగాల్ ప్రజలకు హామీ ఇచ్చారు. శ్రీరాముడిని పూజిస్తే తృణమూల్ కాంగ్రెస్ ప్రజలను బెదిరిస్తోందని, రామనవమి వేడుకలకు అనుమతించట్లేదని ఆయన ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ రామ మందిర నిర్మాణాన్నే వ్యతిరేకించిందని విమర్శించారు. దేశాన్ని అలాంటి వారి చేతిలో పెడదామా అని మోడీ ప్రజలను ప్రశ్నించారు.
ఇది కూడా చదవండి: Kareena Kapoor: ఆ పదం వాడినందుకు కరీనా కపూర్ కు షాక్?
తాజావార్తలు
-
Lorcan Tucker: టీమిండియాపై టీ20 సిరీస్ గెలిచామా.. నేను ఇంకా నమ్మలేకపోతున్నా!
-
US Iran Talks: అమెరికా–ఇరాన్ మధ్య శాంతి దిశగా కీలక అడుగు..
-
God Of War : సోషల్ మీడియాని షేక్ చేస్తున్న Jr. NTR – త్రివిక్రమ్ ‘గాడ్ ఆఫ్ వార్’
-
Peddi OTT Release: రామ్ చరణ్ ‘పెద్ది’ ఇప్పుడు ఇంట్లోనే.. కానీ ఈ ఒక్క భాషకు వెయిటింగ్ తప్పదు!
-
Astrology: జూన్ 29 సోమవారం దినఫలాలు.. ఈ రాశివారికి గుడ్ న్యూస్..
ట్రెండింగ్
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!