PM Modi: అయోధ్యను నా గుండెల్లో పెట్టుకొని ఢిల్లీకి తిరిగి వచ్చాను..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆదివారం రాంలాలా పవిత్రోత్సవానికి ముందు ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. తాజాగా.. ప్రధాని మోదీ ఆ లేఖకు కృతజ్ఞతలు తెలిపారు. అయోధ్యను నా గుండెల్లో పెట్టుకొని ఢిల్లీకి తిరిగి వచ్చాను.. తన జీవితంలో మరచిపోలేని క్షణాలను చూసి అయోధ్య నుంచి తిరిగి వచ్చిన తర్వాత మీకు ఈ లేఖ రాస్తున్నానని ప్రధాని మోడీ తెలిపారు. మీరు రాసిన లేఖ అందే సమయానికి నా మనసు భావోద్వేగంతో నిండిఉంది.. దాని నుంచి బయటపడేందుకు మీ లేఖ ఎంతో సహాయపడిందని అన్నారు. తన జీవితంలోని ప్రతి అధ్యాయంలో అందరి ఆదరణ, అందరి అభివృద్ధి, అందరి విశ్వాసం, ప్రతి ఒక్కరి కృషికి స్ఫూర్తినిచ్చింది శ్రీరాముడేనని పేర్కొన్నారు.
Ram Mandir: రామ్లల్లా దర్శనానికి పోటెత్తిన భక్తులు.. తొలి రోజు ఎంతమంది దర్శించుకున్నారంటే..!
Also Read
- Cheyutha Pensions: చేయూత పెన్షన్ దరఖాస్తుల గడువు పెంపు.. చివరి తేదీ ఎప్పుడంటే..
- Anna Hazare: అన్నా హజారేకు సీరియస్.. ముంబై ఆస్పత్రికి తరలింపు
- Messi Retirement: హార్మోన్ లోపం నుంచి ప్రపంచకప్ కల వరకు.. మెస్సీ జీవిత ప్రయాణం సాగిందిలా..
- Modi-Putin: అంతులేని యుద్ధాన్ని ముగించండి.. పుతిన్కు మోడీ కీలక సందేశం
అయోధ్యలో బాలరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ నేపథ్యంలో ప్రధాని మోదీ 11 రోజుల పాటు నిష్ఠగా కార్యక్రమాలను నిర్వహించారు. ఈ నేపథ్యంలో రాష్ట్రపతి… ప్రధానిని అభినందిస్తూ రెండు రోజుల క్రితం లేఖ రాసిన విషయం తెలిసిందే. రామ్ లల్లాను ప్రత్యక్షంగా చూసి, ఆయన రూపాన్ని దర్శించుకుని, 140 కోట్ల మంది దేశప్రజలతో ఆయనకు స్వాగతం పలికిన ఆ క్షణం సాటిలేనిదని ప్రధాని మోదీ అన్నారు. శ్రీరాముని యొక్క శాశ్వతమైన ఆలోచనలు భారతదేశ ఉజ్వల భవిష్యత్తుకు ఆధారమన్నారు. ఈ ఆలోచనల శక్తి 2047 నాటికి అభివృద్ధి చెందిన భారతదేశాన్ని తయారు చేయడానికి మన దేశ ప్రజలందరికీ మార్గం సుగమం చేస్తుందని మోడీ తెలిపారు. శ్రీరాముని యొక్క గొప్ప ఆలయం తమకు విజయం, అభివృద్ధి వైపు మార్గనిర్దేశం చేస్తుందని పేర్కొన్నారు.
Cardamom Benefits : ఏలకులతో రక్తపోటు నియంత్రణ..!
కాగా.. ద్రౌపది ముర్ము ప్రధాన మంత్రికి రాసిన లేఖలో.. పీఎం జన్మన్ ద్వారా గిరిజనుల అభివృద్ధికి ప్రధాని మోడీ కృషి చేసిన విషయాన్ని ప్రస్తవించారు. గిరిజన సమాజంతో అనుబంధం కలిగి ఉన్న మీ కంటే దీన్ని ఎవరు బాగా అర్థం చేసుకోగలరు. మన సంస్కృతి ఎల్లప్పుడూ, సమాజంలోని అత్యంత అణగారిన వర్గం కోసం పనిచేయడం తమకు నేర్పిందన్నారు. పీఎం జన్మన్ నేడు దేశ ప్రజల జీవితాల్లో పెద్ద మార్పును తీసుకువస్తున్నాయి. ముర్ము తెలిపారు.
తాజావార్తలు
-
Kalki 2 : కల్కి 2 అప్డేట్ ఇచ్చిన నాగ్ అశ్విన్
-
Sardar 2 : సర్దార్ ఆన్ యాక్షన్.. స్పై థ్రిల్లర్తో మళ్లీ రాబోతున్న కార్తీ
-
Cheyutha Pensions: చేయూత పెన్షన్ దరఖాస్తుల గడువు పెంపు.. చివరి తేదీ ఎప్పుడంటే..
-
Anna Hazare: అన్నా హజారేకు సీరియస్.. ముంబై ఆస్పత్రికి తరలింపు
-
Messi Retirement: హార్మోన్ లోపం నుంచి ప్రపంచకప్ కల వరకు.. మెస్సీ జీవిత ప్రయాణం సాగిందిలా..
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!