Price Down: సామాన్యులకు శుభవార్త.. తగ్గిన నిత్యావసరాల ధరలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Price Down: సామాన్యులకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. సెప్టెంబర్ నెలలో 11 రకాల నిత్యావసరాల ధరలను తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. దీంతో వంట నూనెల దగ్గరి నుంచి ఉల్లిపాయల వరకు పలు వస్తువుల ధరలు దిగి వచ్చాయని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. గత నెల రోజుల కాలంలో 11 నిత్యావసర ఫుడ్ ఐటమ్స్ ధరలు 2 నుంచి 11 శాతం మేర తగ్గాయి. ట్విట్టర్ వేదికగా ధరల తగ్గింపు ప్రయోజనాన్ని ప్రకటించారు. దీంతో నెలవారీ కుటుంబ బడ్జెట్ దిగివచ్చిందని చెప్పుకోవచ్చు.
పామ్ ఆయిల్ ధర సగటును 11 శాతం మేర తగ్గింది. అక్టోబర్ 2న పామ్ ఆయిల్ రేటు రూ.118గా ఉంది. సెప్టెంబర్ 2న పామ్ ఆయిల్ ధర లీటరుకు రూ. 132గా ఉంది. వనస్పతి నెయ్యి ధర 6 శాతం మేర దిగి వచ్చింది. గత నెలలో దీని రేటు కేజీకి రూ. 152 వద్ద ఉండేది. అయితే ఇప్పుడు దీని ధర రూ. 143 మేర దిగివచ్చింది. పప్పుదినుసులు రేటు కూడా తగ్గింది. గ్రామ్ దాల్ రేటు 4 శాతం తగ్గింది. కేజీకి రూ. 74 నుంచి రూ. 71కు క్షీణించింది. అలాగే మసూర్ దాల్ రేటు కేజీకి రూ. 97 నుంచి రూ. 94కు దిగివచ్చింది. 3 శాతం క్షీణత నమోదైంది. అలాగే ఉరద్ దాల్ రేటు 2 శాతం తగ్గుదలతో కేజీకి రూ. 108 నుంచి రూ. 106కు తగ్గింది.
Also Read
- Ind Vs SL: లంక టీమ్కు చుక్కలే.. రిషభ్ పంత్కు భయపడుతున్న లంక ప్లేయర్లు.. కారణం ఇదే..
- Petrol Bunk: నమ్మి బాధ్యతలు ఇస్తే షాకిచ్చాడు.. పెట్రోల్ బంక్ నుంచి ఖైదీ పరార్..
- Telangana Public Schools : తెలంగాణ పబ్లిక్ స్కూళ్లకు డెడ్లైన్.. డిసెంబర్లోనే రెడీ.!
- Air India Incident: గంజాయి సేవించి విమానం నడిపాడు.. డ్రగ్ టెస్టులో పైలెట్ ఫెయిల్.!
Read Also: Sova virus: బ్యాంకింగ్ యాప్స్కు ‘సోవా’ ముప్పు
ఇక ఉల్లిపాయల ధరలు కూడా తగ్గాయి. వీటి రేటు 8 శాతం పడిపోయింది. గత నెలలో కేజీకి రూ. 26గా ఉన్న ఉల్లిపాయల ధరలు ఇప్పుడు రూ. 24కు తగ్గింది. పొటాటో రేటు కూడా 7 శాతం దిగివచ్చింది. కేజీకి రూ. 28 నుంచి రూ. 26కు తగ్గింది. సన్ఫ్లవర్ ఆయిల్ రేటు కూడా పడిపోయింది. దీని ధర 6 శాతం క్షీణించింది. గత నెలలో లీటరుకు రూ. 176గా ఉన్న సన్ఫ్లవర్ ఆయిల్ రేటు ఇప్పుడు రూ. 165కు దిగి వచ్చింది. వంటనూనెల ప్యాకెట్ల విషయంలో ఇదే జరుగుతోంది. 21 డిగ్రీల సెల్సియస్ దగ్గర నూనె ప్యాకెట్ బరువు 919 గ్రాములు ఉంటుందని ప్యాకెట్పై వెల్లడించారనుకుందాం. కస్టమర్ ఆ ప్యాకెట్ కొనేప్పుడు అంతే ఉష్ణోగ్రత ఉండదు. గది ఉష్ణోగ్రతను పరిగణలోకి తీసుకుంటే 30 డిగ్రీల నుంచి 40 డిగ్రీల మధ్య ఉంటుంది. అప్పుడు ప్యాకెట్ బరువు తక్కువగా ఉంటుంది. అలాగే సోయాబీన్ ఆయిల్ రేటు కూడా తగ్గింది. 5 శాతం మేర క్షీణించింది. గత నెలలో లీటరుకు రూ. 156 వద్ద ఉన్న ఈ ఆయిల్ రేటు ఇప్పుడు రూ. 148కి తగ్గింది. దేశంలో వంట నూనె ధరలు తగ్గుతూ వస్తున్నాయని కేంద్రం పేర్కొంటోంది.
తాజావార్తలు
-
Varun Tej: చిరంజీవి కళ్ళల్లో ఆనందం చూడటమే నా ఏకైక లక్ష్యం
-
Nagababu: మాకు ప్రాణ వాయువు మా అన్నయ్య
-
Chiranjeevi: మంచి కంటెంట్ ఇస్తే థియేటర్లకి జనం ఖచ్చితంగా వస్తారు
-
Massive Accidents : NH-65పై మృత్యుఘోష.. ఒకే రోజు 9 మంది బలి.!
-
Ind Vs SL: లంక టీమ్కు చుక్కలే.. రిషభ్ పంత్కు భయపడుతున్న లంక ప్లేయర్లు.. కారణం ఇదే..
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..