PM Modi: వేసవిలో ప్రధాని మోదీకి జో బైడెన్ ప్రత్యేక ఆతిథ్యం!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Modi: అమెరికా ప్రెసిడెంట్ జో బిడెన్ ఈ వేసవిలో ప్రధాని నరేంద్ర మోడీకి రాష్ట్ర విందుకు ప్రత్యేక ఆతిథ్యం ఇవ్వబోతున్నారని సమాచారం. స్వేచ్ఛాయుత ఇండో-పసిఫిక్ కోసం జరుగుతున్న ప్రయత్నాల్లో భాగంగా భారత్-అమెరికా మధ్య బలపడుతున్న బంధానికి ఈ విందు ఓ కీలక సంకేతంగా నిలవనుంది. ఈ అంశంపై మాట్లాడేందుకు అమెరికా జాతీయ భద్రతా సమితి నిరాకరించింది. సెప్టెంబరులో ఢిల్లీలో గ్రూప్ ఆఫ్ 20 లీడర్స్ సమ్మిట్కు భారతదేశం ఆతిథ్యం ఇస్తోంది. ఇక్కడ ఉక్రెయిన్పై రష్యా దాడి ప్రధాన చర్చనీయాంశాలలో ఒకటి. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఈ సమావేశానికి హాజరవుతారా లేదా అనేది ఇంకా స్పష్టంగా తెలియలేదు.
అమెరికా ప్రెసిడెంట్ జో బైడెన్ మేలో ఆస్ట్రేలియా, జపాన్ నాయకులతో పాటు క్వాడ్ సమ్మిట్ కోసం సమావేశమైనప్పుడు ఆస్ట్రేలియాలో ప్రధాని మోడీతో బైడెన్ భేటీ కానున్నారు. ఇక, ఇటీవల కాలంలో బైడెన్ ప్రభుత్వం విదేశీ అతిథులకు ఇచ్చే మూడో విందుగా ఇది నిలిచే అవకాశం ఉంది. ఇప్పటికే డిసెంబర్లో ఫ్రాన్స్ అధ్యక్షుడు మేక్రాన్కు ఆతిథ్యం ఇచ్చారు. ఇక ఏప్రిల్ 26వ తేదీన దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్సుక్ యోల్కు విందు ఏర్పాటు చేశారు. జూన్లో మోదీకి ఆతిథ్యం ఇచ్చేందుకు శ్వేతసౌధం సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.
Also Read
- Online Shopping: ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నారా..? కొత్త రూల్స్ వచ్చేస్తున్నాయ్.. కేంద్రం కీలక నిర్ణయం..
- Saudi-Europe: యూరప్కు సౌదీ బిగ్ షాక్.. చమురు నిలిపిపోయే అవకాశం
- Macron: యూరప్లో ఇంధన ధరలు మంటలు.. త్వరలో G7 దేశాల సమావేశం
- Air India: ఖర్చులు తగ్గించేందుకు కీలక నిర్ణయం.. ఎయిరిండియా కొత్త సీఈవో సూపర్ ప్లాన్!
Read Also: Printing Fake Notes: మామూలోడు కాదు.. యూట్యూబ్లో చూసి నకిలీ నోట్లు ముద్రించాడు
అమెరికా భారత్ తో బంధాన్ని బలపరుచుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఇప్పటికే గత నెలలో బైడెన్ సర్కార్ భారత్తో ఇనీషియేటీవ్ ఆన్ క్రిటికల్ అండ్ ఎమర్జింగ్ టెక్నాలజీ కార్యక్రమాన్ని ప్రకటించింది. దీని కింద కంప్యూటింగ్, జెట్ ఇంజిన్ల సంయుక్త అభివృద్ధి వంటి ప్రాజెక్టులు ఉన్నాయి. భారత్పై రష్యా ప్రభావాన్ని తగ్గించడానికి అమెరికా తీసుకొన్న కీలక నిర్ణయంగా దీనిని భావిస్తున్నారు. ఇరు పార్టీల అమెరికా రాజకీయ నేతలు ప్రధాని మోదీతో సంబంధాలను బలోపేతం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.
తాజావార్తలు
-
OTR: దానం నాగేందర్ పై వేటు..మిగతా 9 మంది ఎమ్మెల్యేల సంగతేంటి ..?
-
Botsa Anusha: భీమిలి YSRCP నియోజకవర్గ సమన్వయకర్తగా బొత్స అనూష
-
Old Currency: కాజీపేటలో పాత నోట్ల కలకలం.. రూ.1.38 కోట్ల కరెన్సీతో 8 మంది అరెస్ట్!
-
Bhatti Vikramarka : ఎల్నినో ఎఫెక్ట్.. తెలంగాణలో ముందస్తు ప్లాన్
-
Online Shopping: ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నారా..? కొత్త రూల్స్ వచ్చేస్తున్నాయ్.. కేంద్రం కీలక నిర్ణయం..
ట్రెండింగ్
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్పై భారత్ ఘన విజయం.. సెమీస్కు దూసుకెళ్లిన హర్మన్సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..