Printing Fake Notes: మామూలోడు కాదు.. యూట్యూబ్లో చూసి నకిలీ నోట్లు ముద్రించాడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Printing Fake Notes: యూట్యూబ్లో చూసి నేర్చుకుని ఓ వ్యక్తి నకిలీ నోట్లను ముద్రించాడు ఓ ప్రబుద్ధుడు. ఢిల్లీలోని తన నివాసంలో యూట్యూబ్లో పాఠాలు నేర్చుకున్న తర్వాత రూ.38,220 విలువైన నకిలీ కరెన్సీ నోట్లను ముద్రించిన 30 ఏళ్ల వ్యక్తిని అరెస్టు చేసినట్లు నోయిడా పోలీసులు శుక్రవారం తెలిపారు. నిందితుడిని ఛప్రౌలా గ్రామ సమీపంలోని జీటీ రోడ్డులో బాదల్పూర్ పోలీసు స్టేషన్ అధికారులు పక్కా సమాచారంతో పట్టుకున్నారని అదనపు డిప్యూటీ కమీషనర్ ఆఫ్ పోలీస్ (సెంట్రల్ నోయిడా) రాజీవ్ దీక్షిత్ తెలిపారు.
ప్రింటర్ను ఉపయోగించి నకిలీ కరెన్సీ నోట్లను ముద్రించిన వ్యక్తిని అరెస్టు చేయడంలో పోలీసు బృందం విజయం సాధించింది. నిందితుడిని అబ్దుల్ రకీబ్గా గుర్తించారు. అతను ప్రస్తుతం ఢిల్లీలోని ఘాజీపూర్ ప్రాంతంలో నివసిస్తున్నాడు. అతను బీహార్లోని ముజఫర్పూర్కు చెందినవాడని పోలీసులు వెల్లడించారు. ఢిల్లీలోని ఘాజీపూర్లో అబ్దుల్ రకీబ్, తన భాగస్వామి పంకజ్తో కలిసి నకిలీ కరెన్సీ నోట్లను ముద్రించే పనిలో పడ్డారు. వారు ఉపయోగించిన ప్రింటర్ను స్వాధీనం చేసుకున్నట్లు అధికారి తెలిపారు. 20, 50, 100, 200 డినామినేషన్లతో సహా రూ.38,220 విలువైన నకిలీ నోట్లను స్వాధీనం చేసుకున్నట్లు అదనపు డీసీపీ తెలిపారు. కేసుకు సంబంధించిన ఇతర వివరాలను ధృవీకరించడానికి తదుపరి దర్యాప్తు కొనసాగుతోంది. తప్పిపోయిన ఇతర అనుమానితుడు పంకజ్ను అరెస్టు చేయడానికి పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారని అదనపు డీసీపీ రాజీవ్ దీక్షిత్ చెప్పారు.
Also Read
- CM Chandrababu: టీడీపీ ప్రజాప్రతినిధులకు చంద్రబాబు క్లాస్.. సమన్వయంపై ప్రత్యేక దృష్టి
- EPFO గుడ్ న్యూస్.. PF ఖాతాల్లో వడ్డీ జమ.. మీ ఖాతాలో పడిందా? వెంటనే చెక్ చేసుకోండి
- Anna Lezhneva: అప్పుడు కొడుకు కోసం.. ఇప్పుడు భర్త కోసం.! కాలినడకన తిరుమల కొండెక్కిన డిప్యూటీ సీఎం భార్య.!
- Illicit Relationship: భార్య వివాహేతర సంబంధం.. మరో భర్త బలి.! పామునే ఆయుధంగా..
Read Also: Maryam Nawaz Sharif: ఇమ్రాన్ఖాన్ పార్టీని తీవ్రవాద సంస్థగా పరిగణించాలి..
మరో పోలీసు అధికారి తెలిపిన వివరాల ప్రకారం.. నిందితుడు యూట్యూబ్ ద్వారా సాధారణ కంప్యూటర్ ప్రింటర్ను ఉపయోగించి నకిలీ కరెన్సీ నోట్లను ముద్రించడం గురించి తెలుసుకున్నాడు. నిందితులు దాదాపు రెండు నెలల పాటు ఈ పనిలో నిమగ్నమై, నకిలీ నోట్లను ఉపయోగించి వారి వ్యక్తిగత అవసరాల కోసం వస్తువులను కొనుగోలు చేయడానికి ఎక్కువగా ప్రయత్నించారు. కానీ ఢిల్లీలోని ప్రజలు వాటిని తిరస్కరించడం ప్రారంభించిన తర్వాత, వారు నోయిడా, గ్రేటర్ నోయిడాలో ఆ నోట్లను ఉపయోగించేందుకు ప్రయత్నించారని అధికారి తెలిపారు. వారిపై సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. రకీబ్ను స్థానిక కోర్టులో హాజరుపరచగా, అతన్ని జ్యుడీషియల్ కస్టడీకి పంపినట్లు వారు తెలిపారు.
తాజావార్తలు
-
PV Sindhu: సెమీస్లో అదరగొట్టిన పీవీ సింధు.. జపాన్ ఓపెన్ టైటిల్కు ఒక్క అడుగు దూరంలో
-
CM Chandrababu: టీడీపీ ప్రజాప్రతినిధులకు చంద్రబాబు క్లాస్.. సమన్వయంపై ప్రత్యేక దృష్టి
-
Malayalam Thriller: థియేటర్లలో వణికించిన మలయాళ థ్రిల్లర్ ఓటీటీలోకి… తెలుగులోనూ స్ట్రీమింగ్!
-
RBI Polymer Notes: దేశంలో ప్లాస్టిక్ కరెన్సీ నోట్లు?.. రూ.10, రూ.20 నోట్లపై ఆర్బీఐ భారీ సన్నాహాలు
-
EPFO గుడ్ న్యూస్.. PF ఖాతాల్లో వడ్డీ జమ.. మీ ఖాతాలో పడిందా? వెంటనే చెక్ చేసుకోండి
ట్రెండింగ్
-
185Hz OLED డిస్ప్లే, లిక్విడ్ కూలింగ్తో పవర్ఫుల్ గేమింగ్ ట్యాబ్లెట్ REDMAGIC Astra 2 లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 12.2 అంగుళాల 2.8K 144Hz OLED డిస్ప్లేతో రాబోతున్న ASUS ప్యాడ్ (T3201).!
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!