Bharathi Builders: హైదరాబాద్లో మరో ప్రీ-లాంచ్ స్కాం బట్ట బయలు.. అయోమయంలో 250 మంది బాధితులు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bharathi Builders: హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగంలో మరో ప్రీ లాంచ్ స్కాం వెలుగు చూసింది. ‘భారతి బిల్డర్స్’ అనే డెవలపర్ కంపెనీ పేరుతో 250 మందికిపైగా కొనుగోలుదారులను మోసం చేసిన ఘటన ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. బాధితులు కోట్లు రూపాయల పెట్టుబడులు పెట్టినప్పటికీ.. ప్రాజెక్ట్ పని ముందుకు సాగకపోవడం, భూమిని మూడో వ్యక్తికి విక్రయించడం ప్రస్తుతం సంచలనం రేపుతోంది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే..
Suspicious Death: అమావాస్య రోజు భర్తకు పాదపూజ చేసిన భార్య.. ఆ తర్వాత రోజే హత్య
Also Read
- Narayana: త్రేతాయుగంలో రావణుడు విలన్.. కలియుగంలో రావణ్ను హీరో చేశారు..
- Hassan Eisakhil: తండ్రికి తగ్గ తనయుడు.. 28 బంతుల్లో సెంచరీ.. 16 సిక్సర్లతో విధ్వంసం.!
- Jangaon: మద్యం మత్తులో హల్చల్.. బస్టాండ్ నుంచి ఆర్టీసీ అద్దె బస్సును ఎత్తుకెళ్లిన వ్యక్తి
- Ambati Rambabu: రావణ్పై యూఏపీఏ కేసు అన్యాయం.. పోరాటానికి మా మద్దతు
భారతి బిల్డర్స్ సుమారు ఐదేళ్ల క్రితం ప్రీ లాంచ్ ప్రాజెక్ట్ను ప్రారంభించి, దానికి సంబంధించి 250 మంది నుండి కోట్లు రూపాయల్ని వసూలు చేసింది. కానీ, ఇప్పటికీ కనీసం 25% పనులు కూడా పూర్తి చేయలేదు. ప్రతిసారీ సాకులు చెబుతూ బాధితులను తప్పుదోవ పట్టించడమే కాకుండా.. పనులు వేగంగ జరుగుతాయి అంటూ హామీలు ఇస్తూ కాలయాపన చేస్తున్నారు. అయితే , ఇంతలోనే ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఉన్న భూమిని డెవలపర్ సంస్థ సునీల్ అహుజా అనే వ్యక్తికి రహస్యంగా విక్రయించినట్లు బయటపడింది. దీనిపై బాధితులు అభ్యంతరం చేయడంతో.. వారిని బెదిరింపులు చేస్తూ దౌర్జన్యానికి పాల్పడినట్లు ఆరోపణలు వెలువడుతున్నాయి.
Bigg Boss 9 : బిగ్ బాస్ 9 సామాన్యులకు కూడా ఎంట్రీ పై.. ఇంట్రస్టింగ్ అప్ డేట్
ఈ ఘటనపై బాధితులు సైబరాబాద్ EOW పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదుతో భారతి బిల్డర్స్తో పాటు సునీల్ అహుజా పై కూడా కేసు నమోదు చేసినట్లు సమాచారం. పోలీసులు మోసం, పెట్టుబడిదారుల నమ్మకాన్ని దుర్వినియోగం చేసిన అంశాలపై దర్యాప్తు చేస్తున్నారు. మొత్తంగా ఈ ఘటన మరోసారి ప్రీ లాంచ్ ప్రాజెక్టుల విషయంలో వినియోగదారులు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతటి అవసరం అనే విషయాన్ని రుజువు చేస్తోంది. సరైన అనుమతులు, నిర్మాణ పురోగతి లేని ప్రాజెక్టుల్లో పెట్టుబడులు పెట్టె సమయంలో ఒకటికి రెండుసార్లు ఆలోచించడం మంచిది.
తాజావార్తలు
-
Gudluri Ashok Babu: హీరోగా అవకాశం ఇస్తానంటూ రూ.3.5 కోట్ల మోసం.. ‘భాగమతి’ డైరెక్టర్పై కేసు నమోదు!
-
Timex Deepwater Meridian 300: టైమెక్స్ డీప్వాటర్ మెరిడియన్ 300 వాచ్ విడుదల.. ధర, ఫీచర్ల వివరాలు ఇవే
-
Australia-IPL Match: ఆస్ట్రేలియాలో ఐపీఎల్ మ్యాచ్.. బీసీసీఐతో క్రికెట్ ఆస్ట్రేలియా రహస్య చర్చలు!
-
Narayana: త్రేతాయుగంలో రావణుడు విలన్.. కలియుగంలో రావణ్ను హీరో చేశారు..
-
Hassan Eisakhil: తండ్రికి తగ్గ తనయుడు.. 28 బంతుల్లో సెంచరీ.. 16 సిక్సర్లతో విధ్వంసం.!
ట్రెండింగ్
-
Virat Smartphone సిరీస్.. లావా, ఫ్లిప్కార్ట్ భాగస్వామ్యం.!
-
8000mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme NARZO 100x 5G జూలై 15న లాంచ్.!
-
Rainy Season Tips : వర్షాకాలంలో బూట్ల దుర్వాసనకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
IP69K రేటింగ్, 9000mAh బ్యాటరీతో లాంచ్ కానున్న REDMI Note 17 Pro..!
-
TGSRTCలో 1,500 కండక్టర్ పోస్టులు.. రాత పరీక్ష లేకుండానే ఉద్యోగం.!