ఈ ఏడాది సంక్రాంతి కానుకగా వచ్చిన సినిమాల్లో బ్లాక్ బాస్టర్ హిట్ అయ్యాయి అందులో హనుమాన్ సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చి బాక్సాఫీస్ రికార్డులను బ్రేక్ చేసింది.. 300 కోట్లకు పైగా వసూల్ చేసి సినీ ఇండస్ట్రీని షేక్ చేసింది. ఈ సినిమాను డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తెరకెక్కించారు.. డెబ్యూ మూవీతోనే జాతీయ స్థాయిలో ప్రశంసలు అందుకున్నాడు యంగ్ డైరెక్టర్ .. కెరీర్ ప్రారంభం నుంచే కొత్త తరహా సినిమాలనే తెరకెక్కిస్తూ ప్రేక్షకుల నాడీని తెలుసుకున్నాడు..
అలానే కొత్త కథలతో ప్రేక్షకులను అలరిస్తున్నాడు.. ఇక హనుమాన్ సినిమాతో మరోసారి తన సత్తాను చాటాడు.. పాన్ ఇండియా మూవీగా వచ్చిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకోవడం మాత్రమే కాదు భారీ కలెక్షన్స్ ను కూడా కొల్లగొట్టింది.. ఇటీవల ఓటీటీ లోకి అడుగుపెట్టిన ఈ సినిమా అక్కడ కూడా భారీ వ్యూస్ తో దూసుకుపోతుంది.. ఇక ఈ సినిమాకు సీక్వెల్ గా మరో సినిమా ‘జై హనుమాన్’ సినిమా రాబోతుందని ప్రశాంత్ వర్మ ప్రకటించిన విషయం తెలిసిందే.. వచ్చే ఏడాది సంక్రాంతికి రాబోతుందని చెప్పినా ఇప్పటివరకు సినిమా స్క్రిప్ట్ గురించి ఎక్కడ ప్రస్థావించలేదు..
ఇకపోతే ఈ సినిమా కన్నా ముందుకు మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.. ‘ఆక్టోపస్’ అనే సినిమాని కంప్లీట్ చేయనున్నారని తెలుస్తుంది..ఈ సినిమాను ప్రశాంత్ వర్మ చాలా కాలం క్రితమే సెట్స్ మీదకు తీసుకెళ్లిన ప్రాజెక్ట్.. ఈ సినిమాలో అనుపమా పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తుంది.. ఈ సినిమా చివరి షెడ్యూల్ షూటింగ్ మిగిలి ఉందట.. ఫస్ట్ ఆ సినిమాను పూర్తి చేసి తర్వాత జై హనుమాన్ సినిమాను మొదలు పెట్టబోతున్నారని అందరు అనుకున్నారు.. ఇందులో నిజమేంత ఉందో తెలియాలంటే కొద్దిరోజులు వెయిట్ చెయ్యాల్సిందే..