Site icon NTV Telugu

Prabhas : ప్రశాంత్ వర్మతో సినిమా క్యాన్సిల్ చేసిన రెబల్ స్టార్ ప్రభాస్

Prabhas

Prabhas

‘హనుమాన్’ సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు ప్రశాంత్ వర్మ. ఆ సినిమాతో ప్రశాంత్ వర్మతో సినిమా చేసేందుకు హీరోలు క్యూ కట్టారు.  అయితే ఇటీవల రెబల్ స్టార్ ప్రభాస్‌తో ‘బ్రహ్మరాక్షస’ అనే భారీ బడ్జెట్ చిత్రం చేస్తునట్టు వార్తలు వచ్చాయి. ఎప్పుడో లాంగ్ బ్యాక్ ఈ సినిమా గురించి రకరకాల వార్తలు వినిపించాయి తప్ప ఇటీవల కాలంలో ఎటువంటి అప్డేట్స్ లేవు. అయితే లేటెస్ట్ సమాచారం ప్రకారం ప్రస్తుతం ఈ సినిమా రద్దు అయినట్లు టాలీవుడ్‌లో గట్టిగా వినిపిస్తోంది. వీరిద్దరి కాంబినేషన్ కోసం ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న ప్రభాస్ అభిమానులకు ఇది కాస్త బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి.

Also Read : YASH : ‘టాక్సిక్’ టీజర్ డేట్ ఫిక్స్..

 ‘హనుమాన్’ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత ప్రశాంత్ వర్మ ప్రకటించిన చిత్రాల్లో ఆగిపోయిన మూడో సినిమా ఇది. మొదట బాలీవుడ్ స్టార్ రణవీర్ సింగ్‌తో ‘రాక్షస’ అనే ప్రాజెక్ట్ అనౌన్స్ చేసినప్పటికీ, క్రియేటివ్ డిఫరెన్సెస్ వల్ల అది ఆగిపోయింది. ఆ తర్వాత నందమూరి మోక్షజ్ఞ డెబ్యూ సినిమా విషయంలోనూ మార్పులు జరిగాయి. ఇప్పుడు ప్రభాస్ సినిమా కూడా ప్రస్తుతానికి అటకెక్కినట్లే అని తెలుస్తోంది. షూటింగ్ కి ముందే జరిగిన టెస్ట్ షూట్ తర్వాత ప్రభాస్ కొన్ని మార్పులు కోరడం దానికి తోడు కాల్ షీట్ల ఇబ్బందుల వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. వరుసగా స్టార్ హీరోలతో అనుకున్న ప్రాజెక్టులు ఆగిపోతుండటం ప్రశాంత్ వర్మకు షాక్ ఇచ్చే విషయమే. అయితే, ఆయనకు ఊరటనిచ్చే ఏకైక అంశం ‘జై హనుమాన్’. రిషబ్ శెట్టి ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమా పనులు వేగంగా జరుగుతున్నాయి. హంపిలో ఈ చిత్రానికి సంబంధించిన గ్రాండ్ లాంచ్ ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతానికి ప్రశాంత్ తన పూర్తి దృష్టిని ఈ సినిమాపైనే పెట్టనున్నారు. అటు ప్రభాస్ కూడా తన ‘ఫౌజీ’, ‘స్పిరిట్’ వంటి చిత్రాలతో బిజీగా ఉన్నారు.

Exit mobile version