Kakani Govardhan Reddy: ప్రజల్లో వైసీపీకి ఆదరణ తగ్గలేదు.. వారికి అండగా ఉంటాం..!
- చంద్రబాబుకు అనుభవం ఉందని ప్రజలు అధికారం ఇచ్చారు..
- వైసీపీ నేతల ఇళ్లపై కూటమి ప్రభుత్వం దాడులు చేస్తోంది..
- ప్రజల్లో వైసీపీకి ఆదరణ తగ్గలేదు.. కార్యకర్తలకు అండగా ఉంటాం: కాకాణి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kakani Govardhan Reddy: నెల్లూరు జిల్లాలోని పొడలకూరులో మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. మే నెలలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు టీడీపీని అధికారంలోకి తీసుకువచ్చారన్నారు. అనుభవమున్న.. చంద్రబాబుగా పరిపాలన చేస్తారని ప్రజలు ఎన్నుకున్నారు.. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే వైసీపీ నేతల ఆస్తులు ధ్వంసం చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారు అని ఆయన మండిపడ్డారు. వైసీపీకి 40 శాతం ఓట్లు వచ్చాయి.. మూడు పార్టీలు కూటమిగా ఏర్పడితే వచ్చిన ఓట్లు 60 శాతం.. మా ప్రభుత్వ హాయంలో జరిగిన లోపాలను గుర్తించి సమీక్షించుకుంటామన్నారు. వైసీపీ కార్యకర్తలకు అండగా ఉంటాం.. నేతలతో కలిసి కార్యాచరణ రూపొందించి ముందుకు వెళ్తామని కాకాణి గోవర్థన్ రెడ్డి తెలిపారు.
Read Also: ABVP: డైరెక్టర్ స్కూల్ ఎడ్యుకేషన్ ఆఫీస్ దగ్గర ఏబీవీపీ ఆందోళన..
Also Read
- Wife Murder: బీమా డబ్బుల కోసం.. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను కొట్టి చంపేసిన కీచక భర్త..!
- Nellore: వివాహేతర సంబంధం.. నిండు ప్రాణం బలి.!
- Kolkata Airport Mosque: ముగ్గురు సీఎంలు టచ్ చేయలేకపోయారు.. సువేందు రాకతో ఎయిర్పోర్టు మసీదు తరలింపు.!
- Israel-France: ఇజ్రాయెల్ మంత్రి బెన్-గ్విర్కు ఫ్రాన్స్ షాక్.. దేశంలోకి రాకుండా నిషేధం
టీడీపీ చోటా నాయకుల ఉడత బెదిరింపులకు భయపడాల్సిన అవసరం లేదు అని మాజీమంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి తెలిపారు. ప్రజల్లో వైసీపీకి ఆదరణ తగ్గలేదు.. గత ప్రభుత్వ హయాంలో అవినీతి జరిగిందని.. సీబీఐ విచారణ వేస్తామని అంటున్నారు.. ఎవరి చేత విచారణ చేయించినా ఎలాంటి భయం లేదన్నారు. ఇక, జగన్ కు ప్రతిపక్ష నేత హోదా ఇవ్వడం అనేది సమాజం.. ప్రతి పక్షం లేకుంటే ప్రభుత్వం నిర్వీర్యం అవుతుంది అని ఆయన చెప్పుకొచ్చారు. ఎన్నికల సమయంలో చంద్రబాబు ఎన్నో హామీలు ఇచ్చి ఓట్లను వేయించుకున్నారు.. ఇప్పుడు పింఛను తప్ప మరే పథకం గురించి మాట్లాడడం లేదు.. నాకు పదవి ఉన్నా.. లేకున్నా సర్వేపల్లి నియోజకవర్గ ఇంటి బిడ్డనే.. అధికారం ఉన్నపుడు ప్రజలకు న్యాయం చేసాం.. ఇప్పుడు ప్రజలకు అన్యాయం జరగనియ్యకుండా అడ్డుకుంటానని కాకాణి గోవర్థన్ రెడ్డి పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Rahman : ‘పెద్ది’ ఆ కోరిక తీర్చింది!
-
Ram Charan: నా కెరీర్లోనే ‘పెద్ది’ నంబర్ వన్ చిత్రం
-
AP Film Corporation: ఏపీ ఫిల్మ్ కార్పొరేషన్ నూతన బోర్డు ఏర్పాటు
-
OTR : పాలమూరు కాంగ్రెస్లో రచ్చ రచ్చ.. సిటీ ప్రెసిడెంట్ పదవి కోసం కుమ్ములాట!
-
Wife Murder: బీమా డబ్బుల కోసం.. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను కొట్టి చంపేసిన కీచక భర్త..!
ట్రెండింగ్
-
iPhone Users Alert: వెలుగులోకి కొత్త ఫిషింగ్ మోసం.. అలర్ట్ జారీ చేసిన కేంద్రం.!
-
Early Age S*ex Results: చిన్న వయసులోనే శృంగారం.. ఈ సమస్యలు తప్పవా.?
-
Natural Home Remedy: తెల్ల జుట్టుకు సింపుల్ “హోమ్ రెమిడీ”.. ఆ మూడు పదార్థాలతో ఉంటే చాలు.. నేచురల్గా హెయిర్ కలర్ రెడీ.!
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?