డైనమిక్ హీరో విష్ణు మంచు డ్రీమ్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’. అవా ఎంటర్టైన్మెంట్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్లపై మంచు మోహన్ బాబు నిర్మించిన ఈ చిత్రానికి ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించారు. కన్నప్పపై ఎన్నో హోప్స్ పెట్టుకున్నాడు మంచు విష్ణు. ఈ సినిమా కోసం భారీగా ఖర్చుపెట్టాడు. మోహన్ లాల్, అక్షయ్ కుమార్, రెబల్ స్టార్ ప్రభాస్ వంటి స్టార్స్ ఈ సినిమాలో స్పెషల్ రోల్స్ చేస్తుండడంతో అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి. భారీ అంచనాల మధ్య జూన్ 27న వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయింది కన్నప్ప.
Also Read : Samantha : సౌత్లో బిజీగా సమంత.. ఈ నెలలోనే స్టార్ట్ కాబోతున్న మా ఇంటి బంగారం
విష్ణు కెరిర్ లో అత్యంత భారీ బడ్జెట్ పై తెరకెక్కిన ఈ సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. రెబల్ స్టార్ గెస్ట్ రోల్ చేసిన ఈ సినిమాతో కెరీర్ హయ్యెస్ట్ వసూళ్లు రాబట్టింది. ఇటీవల ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ కు కూడా వచ్చింది. ప్రముఖ ఓటీటీ అమెజాన్ ప్రైమ్ ఈ సినిమా రైట్స్ ను కొనుగోలు చేసి పాన్ ఇండియా భాషల్లో స్ట్రీమింగ్ ఆవుతోంది. ఓటీటి రైట్స్ రూపంలో మంచి లాభాలు రాబట్టింది కన్నప్ప. ఇక ఇప్పుడు ఈ సినిమా శాటిలైట్ రైట్స్ డీల్ కూడా క్లోజ్ అయింది. సన్ టీవీ నెట్ వర్క్ కన్నప్ప శాటిలైట్ రైట్స్ ను కొనుగోలు చేసింది. త్వరలో కన్నప్పను జెమినీ టీవీలో ప్రసారం చేయనుంది.