TS Congress: ఎన్నికల కమిటీలో కనిపించని పొన్నం పేరు.. అధిష్టానంపై అసంతృప్తి..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ రాజకీయల్లో ఇప్పుడే పొలిటికల్ హీట్ కనిపిస్తోంది. అందులోనూ హస్తం పార్టీలో అయితే.. ఎన్నికలు ఓ ఆరు నెలల ముందే వచ్చినంత హడావిడి కనిపిస్తోంది. రాష్ట్రంలో ఈసారి ఎలాగైనా అధికారం చేపట్టాలని కాంగ్రెస్ లక్ష్యంతో ఉంది. అందుకు సంబంధించి కాంగ్రెస్.. మొన్ననే ఎన్నికల కమిటీ కూడా వేసింది. అయితే అందులో కీలక నేతలంతా ఉండగా.. మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ పేరు లేదు. దీంతో అధిష్ఠానంపై ఆయన తన అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.
Jabardasth Varsha: అతడు లేకపోతే చచ్చిపోదాం అనుకున్నా..
Also Read
- Viral Video: పోలీస్ స్టేషన్లో సహోద్యోగిని ముద్దుపెట్టుకున్న మహిళా కానిస్టేబుల్.. చివరకు.?
- Ketan Murder Case: "ఒక్క మాట చెబితే పెళ్లి ఆపేవాళ్లం".. కూతురు ఘాతుకంపై తల్లిదండ్రుల కన్నీటిపర్యంతం!
- రూ.9,999కే Lava Smart 4 Plus లాంచ్.. 6.75 అంగుళాల డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో అదిరిపోయే ఫీచర్లు.!
- Operation Sindoor: ‘ఆపరేషన్ సిందూర్’ అమరవీరుల పేర్లు ఇవే.. దేశం కోసం ప్రాణాలర్పించిన ఆరుగురు వీరులు!
ఏఐసీసీ ప్రకటించిన ఎన్నికల కమిటీలో పొన్నం ప్రభాకర్ పేరు లేదు. దీంతో.. పొన్నం తీవ్ర అసంతృప్తితో ఉన్నట్టు సమాచారం. పార్టీలో తన గొంతున గట్టిగా వినిపిస్తూ బలమైన నేతగా పేరు తెచ్చుకున్న పొన్నంకు.. ఇతర పార్టీల నుంచి వచ్చిన నేతలకు ఇచ్చిన ప్రాధాన్యత కూడా తనకు ఇవ్వడం లేదని రగిలిపోతున్నారు. ఏఐసీసీ ప్రకటించిన ఎన్నికల కమిటీలోనైనా.. తనకు ప్రాధాన్యం లభిస్తుందని ఆశించినా అక్కడ కూడా మొండిచెయ్యే చూపించటంతో.. పొన్నం తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్టు తెలుస్తోంది. మరోవైపు అధిష్ఠానాన్ని కలిసి తాడో పేడో తేల్చుకొనేందుకు ఆదివారం పొన్నం వర్గీయులు గాంధీభవన్ కి వెళ్లారు. పార్టీ పదవుల్లో పొన్నం ప్రభాకర్ కు అవకాశం ఇవ్వకపోవడం పట్ల వారు నిరసన వ్యక్తం చేశారు. పార్టీలో పొన్నంకు ప్రాధాన్యత లభించడం లేదని, ఏ కమిటీలోనూ ఆయనకు చోటు దక్కలేదని ప్రభాకర్ అనుచరులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఒకటి..రెండు రోజుల్లో పొన్నం ప్రభాకర్ వ్యవహారం సెటిల్ చేస్తామని ఆందోళన చేసిన నేతలకు థాక్రే చెప్పారు.
TS Congress: ఎన్నికల కమిటీలో కనిపించని పొన్నం పేరు.. అధిష్టానంపై అసంతృప్తి..!
మరోవైపు .. గాంధీ భవన్లో కాంగ్రెస్ పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ సమావేశం కొనసాగుతుంది. ఈ భేటీకి మాణిక్రావ్ థాక్రే, రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క్, జానారెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, వీ.హనుమంతరావుతో పాటు వ్యూహకర్త సునీల్ కనుగోలు హాజరయ్యారు. త్వరలో జరగనున్న ప్రియాంక గాంధీ సభ, బీసీ డిక్లరేషన్ , పార్టీ కమిటీలపై నేతలు చర్చిస్తున్నారు.
తాజావార్తలు
-
Viral Video: పోలీస్ స్టేషన్లో సహోద్యోగిని ముద్దుపెట్టుకున్న మహిళా కానిస్టేబుల్.. చివరకు.?
-
Vaibhav Sooryavanshi Debut: ఎంతో ప్రతిభ ఉన్నా.. వైభవ్ సూర్యవంశీకి అరంగేట్రం చేసే అర్హత ఉందా?
-
Ketan Murder Case: “ఒక్క మాట చెబితే పెళ్లి ఆపేవాళ్లం”.. కూతురు ఘాతుకంపై తల్లిదండ్రుల కన్నీటిపర్యంతం!
-
Muskan Pradhan: తాగొచ్చిన వరుడికి చెంపదెబ్బ.. ఇప్పుడు మహిళలకు మార్గదర్శి! కౌన్సెలర్గా నియమితురాలైన ముస్కాన్
-
Asha Bhosle : ఆశా భోస్లేకు బ్రిటిష్ బ్యాండ్ గొరిల్లాజ్ ఘన నివాళి.. లండన్ స్టేడియంలో భావోద్వేగ క్షణాలు
ట్రెండింగ్
-
రూ.9,999కే Lava Smart 4 Plus లాంచ్.. 6.75 అంగుళాల డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో అదిరిపోయే ఫీచర్లు.!
-
Pesara Garelu Recipe: బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా ఉండే రుచికరమైన స్నాక్ “పెసర గారెలు” చేసేయండి ఇలా.!
-
Baahubali 3 Announced: ఇండియన్ సినీ ప్రియులకు బిగ్ సర్ప్రైజ్.. ‘బాహుబలి 3′ వస్తోంది!
-
BSNL మాస్టర్ స్ట్రోక్.! అన్లిమిటెడ్ కాలింగ్, డేటా మాత్రమే కాదు.. OTT సబ్స్క్రిప్షన్స్ కూడా..
-
Viral Video: ఎవరయ్యా ఈయన.. మద్యం మత్తులో 11KV విద్యుత్ స్తంభం ఎక్కి తీగలపై పడుకున్నాడు.!