Ponnam Prabhakar : మహిళలను స్వేచ్ఛగా ముందుకు తీసుకుపోవాలి
- విద్య ను రాబోయే తరానికి ప్రతి తల్లిదండ్రులు వారి పిల్లలకు వారి శక్తిమేరకు చదివించాలి
- అప్పుడే సమాజంలో అందరూ విద్యకు దగ్గర అవుతారు
- మహిళలను స్వేచ్ఛగా ముందుకు తీసుకుపోవాలి : మంత్రి పొన్నం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ponnam Prabhakar : హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్లో మహాత్మా జ్యోతిరావు పూలే జీవితం ఆధారంగా నిర్మితమైన చలనచిత్రాన్ని తెలంగాణ రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ బీసీ ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, బీసీ సంఘాల నేతలతో కలిసి వీక్షించారు. ఈ సందర్బంగా సామాజిక సమానత్వం, మహిళా సాధికారత, విద్యా ప్రాధాన్యత తదితర అంశాలపై చర్చ జరగింది. సినిమా చూసిన వారిలో ముఖ్యంగా ప్రభుత్వ సలహాదారు కేశవరావు, ప్రముఖ సామాజికవేత్త కంచె ఐలయ్య, ఎంపీ సురేష్ షెట్కర్, రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్, బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, బీసీ ఎమ్మెల్యేలు కాలేరు వెంకట్, ముఠా గోపాల్, శ్రీహరి ముదిరాజ్, శంకరయ్య, ప్రకాష్ గౌడ్, కార్పొరేషన్ చైర్మన్లు, గ్రంథాలయ సంస్థ , మార్కెట్ కమిటీ చైర్మన్లు పాల్గొన్నారు.
PakIstan: భారత్ టార్గెట్గా అణ్వాయుధాలను ఆధునీకరిస్తున్న పాకిస్తాన్.. యూఎస్ రిపోర్ట్..
Also Read
- Free Flight Journey: వారికి భారీ శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. ఒక రోజు ఉచిత విమాన ప్రయాణం..
- Indus Waters Treaty: సింధు జలాల ఒప్పందంపై పాకిస్తాన్కు కెనడా షాక్..
- Kavya Maran: పాకిస్థాన్ క్రికెటర్ను కొనుగోలు చేయడంపై చెలరేగిన రచ్చ.. కావ్య మారన్ రియాక్షన్ ఇదే!
- Gold In Bag: అలిపిరిలో దొరికిన బంగారం బ్యాగ్.. సీసీటీవీ పరిశీలించిన అధికారులు..
మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ, కంచె ఐలయ్య సూచనల మేరకు అన్ని రాజకీయ పార్టీలకు చెందిన ప్రజాప్రతినిధులు, బీసీ సంఘాలకు ఈ సినిమాను ప్రదర్శించామని తెలిపారు. ఇది జ్యోతిరావు పూలే వారి ఆశయాలను విస్తృతంగా విపరిణమించేందుకు ఎంతో దోహదపడుతుందన్నారు. విద్యను ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలకు ఇవ్వాలని, అది సమాజాన్ని ముందుకు నడిపించేందుకు ప్రధాన పాత్ర పోషిస్తుందని మంత్రి పేర్కొన్నారు. మహిళలకు స్వేచ్ఛ ఇవ్వాలని, వారి అభివృద్ధికి సహకరించాలని పూలే వారిని ఆదర్శంగా నిలిపారు.
Jagga Reddy : తెలంగాణ రాజకీయాల్లో కాంగ్రెస్ బలంగానే ఉంది
దేశంలో మొదటిసారి కుల గణన చేపట్టిన ప్రభుత్వం తెలంగాణ అని మంత్రి గుర్తుచేశారు. ఇది మహాత్మా జ్యోతిరావు పూలే స్పూర్తితోనే సాధ్యమైందన్నారు. బీబీ మాండల కమిషన్, కాకాసాహెబు కాలేల్కర్ వంటి మహనీయుల కృషిని గుర్తు చేశారు. పార్లమెంట్లో మహిళా రిజర్వేషన్లపై ఎస్సీ, ఎస్టీ లకు కూడా అవకాశం కల్పించాలన్న అభిప్రాయం పెండింగ్లో ఉండటం బాధాకరమన్నారు.
రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో చెప్పిన సామాజిక సమీకరణ మారాలన్న సందేశాన్ని గుర్తు చేసిన పొన్నం ప్రభాకర్, సినిమా ద్వారా ప్రజల్లో చైతన్యం కలుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సినీ ప్రముఖులను కలుసి ఈ సినిమాకు డబ్బింగ్, ట్యాక్స్ మినహాయింపును తీసుకురావడానికి చర్యలు తీసుకుంటారని తెలిపారు. సినిమాలో చూపించిన అంశాలు ప్రతి బలహీన వర్గానికి చెందిన పిల్లలకు విద్యకు దూరంగా ఉండకుండా చేస్తాయని, మహిళా సాధికారతకు పూలే దంపతులు నిలువెత్తు ఆదర్శమన్నారు. తెలంగాణ ప్రభుత్వం దేశానికి రోల్ మోడల్గా నిలుస్తుందని మంత్రి స్పష్టం చేశారు.
తాజావార్తలు
-
Shamshabad : ఇండిగో ఉద్యోగినిపై క్యాబ్ డ్రైవర్ అత్యాచారయత్నం..!
-
Free Flight Journey: వారికి భారీ శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. ఒక రోజు ఉచిత విమాన ప్రయాణం..
-
Minister Seethakka : ములుగు టూర్కు వెళ్తున్నారా? మంత్రి సీతక్క కీలక హెచ్చరిక.!
-
Indus Waters Treaty: సింధు జలాల ఒప్పందంపై పాకిస్తాన్కు కెనడా షాక్..
-
Kavya Maran: పాకిస్థాన్ క్రికెటర్ను కొనుగోలు చేయడంపై చెలరేగిన రచ్చ.. కావ్య మారన్ రియాక్షన్ ఇదే!
ట్రెండింగ్
-
Cleaning Hacks : తుప్పు పట్టిన ఇనుప అల్మారా కొత్తదానిలా మెరవాలా? ఈ 4 చిట్కాలు చాలు.!
-
Remote Cleaning : వర్షాల్లో టీవీ రిమోట్ పనిచేయడం లేదా? ఈ 4 ట్రిక్స్తో కొత్తదానిలా మారుతుంది.!
-
Food Storage Tips : వంట నూనె ఇలా నిల్వ చేస్తే విషమే.! ఈ 5 సంకేతాలు కనిపిస్తే వెంటనే పారేయండి
-
Kitchen Tips : పుట్టగొడుగులు 2 రోజుల్లో పాడవుతున్నాయా? ఈ సీక్రెట్ ట్రిక్తో వారాల పాటు ఫ్రెష్.!
-
Sanju Samson: రోహిత్ భాయ్ సారీ.. నిన్ను నేను నమ్మలేదు.. సంజు ఆసక్తికర వ్యాఖ్యలు!